జాన్ ఫాసే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తన నాటకాలు, విశిష్ట రచన శైలితో అవ్యుక్తాన్ని వ్యక్తీకరించడంలో సిద్ధహస్తుడైన నార్వే దేశ రచయిత జాన్ ఫాసే కు 2023 నోబుల్ సాహిత్య పురస్కారాన్ని 2023 అక్టోబర్ 5వ తేదీన ఎంపిక కమిటీ ప్రకటించింది[1]. మానవుల్లోని అభద్రత భావాలను జాన్ ఫాసే రచనలు బలంగా వ్యక్తీకరిస్తాయని పేర్కొంది[2]. ఇప్పటివరకు 40 నాటకాలు, నవలలు, బాలల పుస్తకాలు, కథానికలు, కవితలు, వ్యాసాలు రచించిన జాన్ ఫాసే 1969 లో నోబుల్ సాహిత్య బహుమతి పొందిన రచయిత శామ్యూల్ బకెట్ నుండి స్ఫూర్తి పొందానని తెలియజేశారు[3]. జాన్ ఫాసేతో కలిపి ఇప్పటివరకు నలుగురు నార్వే రచయితలకు నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది[4]. 54 లక్షల జనాభా గల నార్వే దేశంలో అధికార రచన శైలిలో ఒకటైన బొక్మాల్ ను అధికారికంగాను, పత్రిక భాషల్లోనూ ఉపయోగిస్తారు. జాన్ ఫాసే తొలి నవల ' రెడ్, బ్లాక్' 1983 సంవత్సరంలోనూ, తొలి నాటకం ' సమ్ వన్ ఈస్ గోయింగ్ టు కమ్ ' 1992 సంవత్సరంలోనూ ప్రచురితమయ్యాయి.

మూలాలు :

  1. "నార్వే రచయిత ఫాసేకు నోబెల్‌". EENADU. Retrieved 2023-10-09.
  2. telugu, NT News (2023-10-05). "Nobel Prize: నార్వే ర‌చ‌యిత జాన్ ఫోసేకు సాహిత్యంలో నోబెల్ పుర‌స్కారం". www.ntnews.com. Retrieved 2023-10-09.
  3. "జాన్‌ ఫోసేకు సాహిత్య నోబెల్‌". Sakshi. 2023-10-06. Retrieved 2023-10-09.
  4. ABN (2023-10-06). "నార్వే రచయిత జాన్‌ ఫోసెకు సాహిత్య నోబెల్‌". Andhrajyothy Telugu News. Retrieved 2023-10-09.
"https://te.wikipedia.org/w/index.php?title=జాన్_ఫాసే&oldid=4079095" నుండి వెలికితీశారు