జి. శంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి. శంకర్

జి. శంకర్ అని పిలువబడే గోపాలన్ నాయర్ శంకర్ భారతదేశంలోని కేరళ కు చెందిన వాస్తుశిల్పి.[1] స్థానికంగా లభించే పదార్థాల వాడకం, సుస్థిరత, పర్యావరణ అనుకూలత, వ్యయ ప్రభావాన్ని ఆయన సమర్థించాడు. అతను 1987 లో తిరువనంతపురంలో హాబిటాట్ టెక్నాలజీ గ్రూపును స్థాపించాడు. 2012 నాటికి అనేక బోర్డులలో పనిచేస్తాడు.[2] అతను తన ఆర్కిటెక్చర్ స్టడీస్టడీస్ ను కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, త్రివేండ్రం (1982 బ్యాచ్) నుండి పూర్తి చేశాడు. తరువాత యునైటెడ్ కింగ్ డం లోని బర్మింగ్ హోం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుండి M. S.ను, జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాడు. గ్రీన్ ఆర్కిటెక్చర్, స్లమ్ రీసెట్ల్మెంట్, ఎకో సిటీ డిజైన్ కోసం అతను 3 జాతీయ పురస్కారాలను కూడా గెలుచుకున్నాడు. [2]"గ్రీన్ ఆర్కిటెక్చర్" పట్ల అతని వైఖరి అతనికి "ప్రజల వాస్తుశిల్పి" గా ఖ్యాతిని సంపాదించింది.[3] శంకర్ కు 2011 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "A Brief Sketch of Architect Padma Shri.G Shankar | Habitat Technology Group". Archived from the original on 26 April 2012. Retrieved 13 December 2011.
  2. 2.0 2.1 "Habitat Group Profile". Archived from the original on 25 November 2010. Retrieved 27 January 2011.
  3. R, Anupama (14 May 2004). "People's Architect". The Hindu Business Line. Retrieved 22 May 2018.
  4. Padma Awards Announced

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జి._శంకర్&oldid=4243728" నుండి వెలికితీశారు