తీస్తా సీతల్వాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తీస్తా సేతల్వాడ్
2015లో తీస్తా సేతల్వాడ్
జననం (1962-02-09) 1962 ఫిబ్రవరి 9 (వయసు 62)
జాతీయతఇండియన్
వృత్తిపౌర హక్కుల కార్యకర్త , పాత్రికేయురాలు

తీస్తా సేతల్వాడ్ (ఆంగ్లం: Teesta Setalvad) ఒక భారతీయ పౌర హక్కుల కార్యకర్త. ఆమె పాత్రికేయురాలు కూడా. 2002 గుజరాత్ అల్లర్ల బాధితుల పక్షాన వాదించేందుకు ఏర్పాటు చేసిన సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (CJP) సంస్థకు ఆమె కార్యదర్శి.[1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

1962లో గుజరాతీ కుటుంబంలో జన్మించిన తీస్తా సేతల్వాడ్ ముంబైకి చెందిన న్యాయవాది అతుల్ సేతల్వాడ్, సీతా సేతల్వాడ్ దంపతుల కుమార్తె. ఆమె తాత భారతదేశపు మొదటి అటార్నీ జనరల్ అయిన ఎం. సి. సేతల్వాడ్.[2][3] మైనారిటీ హక్కుల కార్యకర్తగా మారిన జర్నలిస్టు జావేద్ ఆనంద్‌ను తీస్తా సేతల్వాడ్ వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

గుజరాత్ అల్లర్ల కేసు[మార్చు]

గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి తప్పుడు సమాచారం ఇచ్చిన ఆరోపణలపై తీస్తా సీతల్వాడ్‌ను గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) 2022 జూన్ 25న అరెస్ట్ చేసింది. ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.[4]

మూలాలు[మార్చు]

  1. "Teesta Setalvad". Human Rights office of the city of Nuremberg.
  2. "India THE NEXT DECADE". Archived from the original on 25 జూన్ 2007.
  3. "Nürnberger Menschenrechtspreisträger 2003" (in జర్మన్). Archived from the original on 8 March 2012.
  4. "Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్‌". web.archive.org. 2022-06-26. Archived from the original on 2022-06-26. Retrieved 2022-06-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)