దిండోరి ప్లాంట్ శిలాజాల జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిండోరి ప్లాంట్ శిలాజాల జాతీయ ఉద్యానవనం
Map showing the location of దిండోరి ప్లాంట్ శిలాజాల జాతీయ ఉద్యానవనం
Map showing the location of దిండోరి ప్లాంట్ శిలాజాల జాతీయ ఉద్యానవనం
ప్రదేశందిందోయి జిల్లా, మధ్యప్రదేశ్  India
సమీప నగరందిందోయి,
విస్తీర్ణం0.27 square kilometers
స్థాపితం1968

దిండోరి ప్లాంట్ శిలాజాల జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని లోని దిందోరి జిల్లాలో ఉంది.

చరిత్ర[మార్చు]

ఈ ఉద్యానవనం 1960 లో స్థాపించబడింది. ఇది 274,100 చదరపు మీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇందులో శిలాజ రూపంలో ఉండే మొక్కలు ఉన్నాయి. ఇవి 40 మిలియన్ నుండి 150 మిలియన్ సంవత్సరాల క్రితం దిండోరి జిల్లాలోని ఏడు గ్రామాలలో (ఘుగువా, ఉమారియా, డియోరఖుర్డ్, బార్బాస్‌పూర్, చంటి-హిల్స్, చార్గావ్, డియోరి కోహాని) వంటి ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.  ఇలాంటి శిలాజాల మొక్కలు జిల్లాలోని మరో మూడు గ్రామాలలో కూడా కనిపిస్తాయి. కాని అవి ఈ ఉద్యానవనం పరిధిలో ఉండవు.

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈ ఉద్యానవనంలోని శిలాజ మొక్కలపై లక్నోలోని బిర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియోబోటనీ అధ్యయనం చేశారు. ఈ ఉద్యానవనంలో ఘుగువా, ఉమారియాలో చెట్ల పెట్రిఫైడ్ ట్రంక్లను జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్- మోనోకోటిలెడన్స్ లాంటి శిలాజ మొక్కలను కనుగొన్నారు . ఇందులో ఉండే శిలాజాలు జురాసిక్ చల్ లేదా క్రెటేషియస్ యుగం నాటి నుంచి ఉన్నాయయని కొంత ప్రశ్న ఉంది.

మూలాలు[మార్చు]