దేవగుప్తాపు భరద్వాజము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేవగుప్తాపు భరద్వాజము పిఠాపురం సంస్థానంలో రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు ఆశ్రయం పొందిన కవులలో ఒకడు. వేంకట రామకృష్ణ కవులు పిఠాపురం రాజాశ్రయం పొందడానికి ఒకవిధంగా ఇతడు కారకుడు.

రచనలు[మార్చు]

ఇతడు శ్రీ సూర్యరాయ శతకము, శర్మిష్ఠావిజయము అనే నాటకాన్ని వ్రాశాడు.

శ్రీ సూర్యరాయ శతకము[మార్చు]

23 పేజీలలో 100 పద్యములు కల శ్రీ సూర్యరాయ శతకము[1] 1916లో చెన్నపురి ఆంధ్రపత్రికాలయములో ముద్రింపబడింది. పిఠాపురం మహారాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు దాతృత్వాన్ని వర్ణించి, కొన్ని నీతులు బోధింపబడిన ఈ శతకములో "సూర్యనృపా" అనే మకుటం కలదు. ఇది కాక కవి "సూర్యరాయ విబుధవిదేయా!" "సూర్యరాయ సజ్జనగేయా!" "సూర్యరూప! చిత్తజరూపా!" అని కూడా సంబోధించాడు. అపాత్రదానము పనికి రాదని, ప్రభువెన్నడు తనకున్నదంతయు వెచ్చింపరాదని, వెనుక ముందు చూచి ఇవ్వవలెనని కవి ఈ శతకము ద్వారా ప్రభువుకు హితబోధ చేశాడు.

కం. పండితున కొక్కడబ్బిడఁ
గొండగు, మఱి వేనవేలు కొండీండ్రకిడన్
బెండగు పాత్రాపాత్రల్
ఖండితముగ నెంచి చూడ ఘనసూర్యనృపా!

ఇతని హితబోధను పాటించకుండుట వల్లనేమో మహారాజా వృద్ధాప్యం శోచనీయంగా మారింది.

మూలాలు[మార్చు]

  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973