ధర్మసాధని
స్వరూపం
ధర్మసాధని, కాకినాడ నుండి వెలువడిన ధార్మిక వారపత్రిక. బ్రహ్మసాధనాశ్రమం పక్షాన ప్రతి శనివారం ఈ పత్రిక వెలువడేది. కె.హనుమంతరావు ఈ పత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్త, ముద్రాపకుడు. బ్రహ్మసమాజానికి సంబంధించిన వార్తలు, ధార్మిక సంబంధమైన విషయాలు ఈ పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఈ పత్రిక స్త్రీవిద్య, రజస్వలానంతర వివాహాలు మొదలైన సంఘ సంస్కరణలను ప్రోత్సహించింది. ఈ పత్రిక 1913 లో ప్రారంభమై 54 సంవత్సరాలకు పైగా వెలువడింది. 1926 లో పక్షపత్రికగా మారింది. 1941 నుండి మాసపత్రికగా వెలువడింది. ఈ పత్రికలో ఉమర్ అలీషా, చలం, జానకీజాని, తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి మొదలైన వారి రచనలు వెలుగు చూశాయి. రాజా రామ్మోహన్ రాయ్ 126వ వర్ధంతి సందర్భంగా ఈ పత్రిక ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ "ఎ.పి.ప్రెస్ అకాడమీ వారి ఆర్కైవ్స్లో ధర్మసాధని ప్రతులు". Archived from the original on 2020-10-25. Retrieved 2020-04-12.