నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా?

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా? పుస్తకాన్ని రంగనాయకమ్మ రచించారు[1]. చలం సాహిత్యం పై నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, చలసాని ప్రసాదరావులు చేసిన తప్పుడు ప్రచారానికి సమాధానంగా ఈ పుస్తకం వ్రాసారు. చలం సాహిత్యం పై మార్క్సిస్టుల దృక్పథం ఎలా ఉంటుందో, అతని సాహిత్యం పై జడభావవాదుల దృక్పథానికి, మార్క్సిస్ట్ దృక్పథానికి మధ్య ఉన్న తేడా ఏమిటో వివరిస్తూ ఆ పుస్తకంలో వ్యాసాలు వ్రాసారు. చలం గతితార్కిక చారిత్రక భౌతికవాదాన్ని అంటరానిదిగా భావించాడంటూ చలసాని ప్రసాద రావు చేసిన తప్పుడు ప్రచారాన్ని, చలం బూతువాది అని అంటూ ఇతర భూస్వామ్య భావవాదులు చేసిన తప్పుడు ప్రచారాన్ని, చలం శ్మశాన రచయిత అంటూ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు చేసిన ప్రచారాన్ని విమర్శిస్తూ రంగనాయకమ్మ ఈ పుస్తకం వ్రాసారు.

ఈ పుస్తకంలో మూడు పుస్తకాల విమర్శలు ఉన్నాయి. అవి

  1. నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా?
  2. 'జన సాహితి'తో మా విబేధాలు
  3. తీగ లాగారు, డొంకంతా కదిలింది!

ఈ మూడు పుస్తకాలను ఒకే సంఫుటంగా వెలువరించారు.

మూలాలు[మార్చు]

  1. రంగనాయకమ్మ. నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా?: 'జన సాహితి'తో మా విభేదాలు! తీగ లాగారు, డొంకంతా కదిలింది! (in రష్యన్). Sweet Home Publications.