ప్రసన్న యాదవము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రసన్న యాదవము
ప్రసన్న యాదవము పుస్తక ముఖచిత్రం
కృతికర్త: చిలకమర్తి లక్ష్మీనరసింహం
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: కురుకూరి సుబ్బారావు, సరస్వతి బుక్ డిపో బెజవాడ
విడుదల: 1934
పేజీలు: 104


ప్రసన్న యాదవము చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన నాటకం. ఇది 1934లో ముద్రించబడింది. శ్రీకృష్ణుడు, నరకాసురుడు ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్య నాటకమిది.[1]

ఈ నాటకంలో 5 అంకాలు ఉన్నాయి. ప్రథమాంకంలో నరకుడు స్వర్గమును అక్రమించడం, ద్వితీయాంకంలో ఊర్వశీ - నరకుల సంవాదము, తృతీయాంకంలో నరకుని దుశ్చర్యలు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై బయలుదేరుట, చతుర్థాంకంలో శ్రీకృష్ణ - నరక - సత్యభామ యుద్ధాలు, పంచమాంకంలో శ్రీకృష్ణుడు నరక పుత్రుడైన భగదత్తును ఓదార్చి పదహారు వేల కన్నియలను పరిగ్రహించుట వంటివి ఉన్నాయి.

నాటకంలోని పాత్రలు[మార్చు]

  • మహేంద్రుడు - దేవతలరాజు
  • బృహస్పతి - దేవగురువు
  • జయంతుడు - మహేంద్రుని కుమారుడు
  • మాణిభద్రుడు - కుబేరుని సేవకుడు
  • నరకాసురుడు - ప్రగ్జ్యోతిషాధిపతియగు రాక్షసరాజు
  • పంచజనుడు, నిశుంభుడు, మురుడు - నరకాసురుని బంట్లు
  • సూతుడు - నరకుని సారథి
  • భగదత్తుడు - నరకాసురుని కుమారుడు
  • శంబరుడు - నరకాసురుని మంత్రి
  • శుక్రాచార్యుడు - రాక్షసుల గురువు
  • చిత్రరధుడు - గంధర్వుడు
  • పులహుడు, బృహదశ్వుడు - బదరికాశ్రమ మునులు
  • దారకుడు - కృష్ణుని సూతుడు
  • దేవలుడు - కృష్ణుని అంతపుర పరిచారకుడు
  • శ్రీకృష్ణుడు - కథానాయకుడు
  • ఊర్వశి - స్వర్గలోక వేశ్యకాంత
  • సత్యభామ - శ్రీకృష్ణుని దేవి

మాలాలు[మార్చు]

  1. ప్రసన్న యాదవము, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 250.

ఇతర లంకెలు[మార్చు]