ప్రసాదంవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలం, ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఒక రెవెన్యూయేతర (కుగ్రామం).ఇది చెరుకుపల్లి నుండి పూషడపు వారి పాలెం వెళ్లే రోడ్డు పై ఉంటుంది. మండల కేంద్రానికి 3 కి.మీ దూరంలో ఉంటుంది. గ్రామంలో సుమారు 40 ఇళ్లు ఉంటాయి. 200 వరకు జనాభా కలిగి ఉంది. ఊరిలో ప్రాధమిక పాఠశాల గానీ, అంగన్వాడీ కేంద్రం గానీ లేవు. విద్యార్థులు ఒక కి.మీ. పైగా పొరుగూరికి నడిచి వెళ్ల వలసినదే. ఉన్నత పాఠశాల 4 కి.మీ దూరంలో ఉంది. ఐనా ప్రసాదం వారి పాలెం సంపూర్ణ అక్షరాస్యత ను సాధించిన గ్రామం.కవి, రచయిత నాగిశెట్టి జన్మస్థలం ప్రసాదంవారిపాలెం.

మూలాలు[మార్చు]