భాగ్యశ్రీ బోర్సే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాగ్యశ్రీ బోర్సే
జననం

భాగ్యశ్రీ బోర్సే పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023) తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయికగా ఆమెను ఎంపికచేసారు.[1]

కెరీర్[మార్చు]

నైజీరియాలోని లాగోస్ లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుని ఒక ఎజెన్సీతో కలసిపనిచేసింది. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో ఆమె ప్రసిద్ధిచెందింది. అలా బాలీవుడ్ చిత్రం యారియాన్ 2లో రాజ్యలక్ష్మి పాత్రలో తన నటనతో యువతను ఆకట్టుకుంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున మిస్టర్ బచ్చన్ చిత్రంలో రవితేజ సరసన ఆమె నటించబోతోంది.[2]

మూలాలు[మార్చు]

  1. "మాస్‌ మహారాజాకి జోడీగా క్లాస్‌ మహారాణి.. ఎవరీ భాగ్యశ్రీ బోర్సే? | Bhagyashri Borse Comes On Board For Ravi Teja, Harish Shankar Latest Film - Sakshi". web.archive.org. 2023-12-18. Archived from the original on 2023-12-18. Retrieved 2023-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "క్లాస్‌ మహారాణి.. భాగ్యశ్రీ బోర్సే". web.archive.org. 2023-12-18. Archived from the original on 2023-12-18. Retrieved 2023-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)