Jump to content

మాదాసికురువ

వికీపీడియా నుండి
(మదాసికురువ నుండి దారిమార్పు చెందింది)

మాదాసికురువ , మదారికురువ చరిత్ర ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా లో 31వ ఉపకులం. [1][2]మదాసికురువ,మదారికురువ లను పూర్వం కురువ పేరుతో పిలువబడేవారు

జీవన విధానం

[మార్చు]

పూర్వం నుండి వారసత్వంగా పెద్దలు ఇచ్చిన వ్రుత్తి ని చేసుకుంటూ గొర్రెలు మేకల కాపరులుగా జీవనం కొనసాగిస్తున్న జాతి మదాసికురువ మదారికురువ జాతి ప్రజలు వీరిని పూర్తి పేరుతో కాకుండా కురువ పేరుతో పిలువబడుతారు వీరిలో రెండు తెగలు ఉన్నాయి మదాసికురువ , మదారికురువ వీరిని ఊరిలో ఉన్న మిగతా కులాల వారు కురువలు, కురువోళ్ళు , తిక్క కురువోళ్ళు , వెర్రికురువోళ్ళు అని పిలుస్తారు వీరి జీవన విధానం ఇతర కులాల వారి కంటే బిన్నంగా ఉంటుంది వీరు మూఢనమ్మకాలు నమ్ముతారు సంస్క్రుతి సాంప్రదాయాలు ఇప్పటికి పాటిస్తారు జంతుబలి పాటిస్తారు గ్రామదేవతలను కొలుస్తారు శుభ అశుభ కార్యక్రమాలకు బ్రహ్మణులు రారు సైన్స్ పరంగా ఎంతో అభివృద్ధి చెందినా ఈ రోజుకి కట్టుబాట్లను అమలు చేస్తారు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటారు పట్టణాల్లో కూడా తక్కువ గా ఉంటారు


దాసరయ్యలు, దాసప్పలు

[మార్చు]

ఆర్థిక , సాంఘిక , విద్యాపరంగా వెనుకబడి ఉండటం వలన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు వీరిని జాతీయ షెడ్యూల్ కులాల జాబితాలో పొందపరచడం జరిగింది. వీరిని ప్రజలు దాసప్పలు, దాసరయ్యలు అని పిలుస్తారు. వీరు హరినామ సంకర్తీనలను ప్రచారం చేయడం గోవింద నామాలు పలుకుతూ శ్రీ మహావిష్ణువు హారిని కీర్తించడం చేస్తారు. వైష్ణవ సిద్ధాంతాలు ప్రచారం చేస్తారు. శుభ అశుభ కార్యాలకు వీరు తమ సాంప్రదాయం ప్రకారం కార్యక్రమంలో పూడ్చిన సమాధిపై కూర్చొని పూజలు చేస్తూ చనిపోయిన వారి సమాధిపై వారి కోసం పెట్టిన ఆహారాన్ని సమాధిపై కూర్చుని భుజిస్తారు. ముఢ నమ్మకాలు నమ్ముతారు ఆచరిస్తారు వీరు గోవింద నామస్మరణ చేస్తారు. వీరి ఆశుభ కార్యాలు ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తాయి. అవి భయానకంగా కూడా ఉంటాయి. మిగతా రోజులలో గడ స్థంబం కు ధీపం వెలిగించుకొని జావిటి కొడుతూ బోనాసి (అక్షయపాత్ర) తీసుకొని బిక్షాటన చేస్తారు హరినామ కీర్తన సంకీర్తన చేస్తూ ప్రత్యేకమైన ఉగాది. దసరా పండుగ రోజుల్లో వీరికి కొన్ని ఊళ్ళు పూర్వం నుండే కేటాయించబడి ఉంటాయి. ఆ ఊరిలో మాత్రమే వీరు వీరి కార్యక్రమాలు చేసుకోవలసి ఉంటుంది. బిక్షాటన చేసే సమయంలో ధనం‌‌ , ధాన్యం వారు ఇచ్చిన వస్త్రాలు స్వీకరించడం, వాటితో జీవనం గడపడం వీరి వృత్తి. వీరిని అంటరానివాళ్ళు గా భారతప్రభుత్వం 1950లో కేంద్ర షెడ్యూల్ కులాల జాబితాలో గుర్తించింది. 1956 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది

గొర్రెలు , మేకల కాపరులు

[మార్చు]

భారతదేశం లో అత్యంత ప్రాచీనమైన జాతి మదాసికురువ/మదారికురువ లు వీరు ఆర్థికంగా, సామాజికంగా , సాంఘికంగా , విద్యాపరంగా , ఉధ్యోగ పరంగా ఈ జాతి వెనుకబడి ఉండడవలన వీరిని గుర్తించిన డాక్టర్ భీం రావ్ అంభేడ్కర్ గారు కేంద్ర షెడ్యూల్ కులాల జాబితాలో ఉంచడం జరిగింది. వీరి వృత్తి గొర్రెలు మేకల కాపరులని వీరు ఊరికి దూరంగా అడవుల్లో నెలల తరబడి గొర్రెలుమేకలు కాచుకుంటూ జీవనం కొనసాగిస్తారు వీరు పూర్వం ఈ గొర్రెలుమేకల ను మచ్చిక చేసుకొని వాటిని కాసి అదే వ్రుత్తి గా స్వీకరించిన మదాసికురువ మదారికురువ జాతి ఎక్కువుగా పచ్చిక బైళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వలస లు వెళ్లి గొర్రెలు మేకలు కాచుకునే వ్రుత్తి వీరిది పగలు ఒక వైపు అలా రాత్రికి ఇలా కొత్త ప్రాంతం లో మేతలకు వెళ్ళినప్పుడు దొంగలు రాత్రిపూట దొంగతనం చేయకుండా ఉండేందుకు గొర్రెలు మేకలు కాపరులు వంతులు వేసుకుని మేలుకొని రేయింబవళ్ళు కంటికి నిద్రను దూరం చేసుకొని ఆ జీవాలను రక్షించుకునేందుకు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే రాత్రి సమయాల్లో క్రూరమృగాలు పులులు సింహాలు కూడా జీవాల మందలపై దాడి చేసి వారి జీవాలను చంపి తినడానికి తీసుకువెల్లి ఆ కాపరికి ఆర్థికంగా నష్టం చేస్తుంటాయి ఇది వారి జీవన విధానం

అడవిలో గొర్రె ఈనిన పిల్లల ను వాటిని భూజాన వేసుకొని పగలంతా దాదాపుగా రోజుకు 60 నుండి 100 కీలోమీటర్లు కాలినడకన నడుచుకుంటూ జీవాలను మేపుకొని వాటిని గూటికి చేర్చిన తరువాత ఆ ఈనిన గొర్రె పిల్లను గూటికి వేసేదాక ( చిన్న పిల్లల ను రక్షణ కోసం వాడే గూడు ఉంటుంది ) వాటిలో వేసి తన దినచర్యను ముగిస్తాడు ఈ గొర్రె పిల్లను భూజాన వేసుకోవడం ఆ మైలు బట్టలకు అంటుకోవడం వలన వీరిని అంటరాని వాల్లు అని అంటరానితనం ఉండటం వల్లనే మమ్మల్ని బహిష్కరించారు ఊరిలో ఉన్న కుక్కలు కూడా మా మీదికి భౌభౌ అంటు వచ్చేవి గొర్రెలు కాచే సమయంలో పొలం లోకి వెళ్లి గొర్రెలు మేస్తే కురువ నాకొడడుకా కురువ పెండ్లాం ని దెంగా అని దూషించి మమ్మల్ని మానసికంగా క్షోభకు గురిచేసి మా గొర్రెలను ఎత్తుకు వెళ్ళి తప్పు కట్టించుకునే వారు ఎక్కువ సమయం అడవిలో గొర్రెలను మేకలను వాటికి మేత మేపుతూ ఎండనక గాలనక చలికి వర్షంకి లెక్క చేయక చేత సద్ది (భోజనం) చిక్కెంతో చేతిలో కర్ర తో కుక్కను వెంటబెట్టుకొని జీవాలను మేపుతూ పాములు , తేళ్ళు విషపురుగుల నుండి తన ప్రాణాలను లెక్క చేయక వాటిని సంరక్షించుకుంటూ ఆరోగ్య కరమైన సమాజాన్ని స్రుష్టించేందుకు నాణ్యమైన పౌష్టికాహార మాంసం ను సమాజానికి పరిచయం చేసి అందించినది ఈ మదాసికురువ , మదారికురువలే జీవాలను అమ్మడం ద్వారా వచ్చిన ధనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు , ఇలా సంచార జీవనం లో ఓక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి గొర్రెలు మేకలు మేతలకోసం వలస వెళుతుంటారు. అందువలన కుటుంబం సభ్యులు ఉరిలో ఉండటం వలన ఊరికి దూరంగా ఆరు నెలలు జీవాల మేత కోసం వలస వెళ్ళి వస్తు ఉండటం తో వీరిని యస్సీ జాబితాలో చేర్చి రిజర్వేషన్ ను ఇవ్వడం జరిగింది అలా వలస వెళ్లిన దగ్గర దారిదోపిడి దొంగల నుండి తనని తాను రక్షించుకొనుటకు తన దగ్గర చిన్న కత్తి ని రక్షణకోసం ఉంచుకుంటాడు. ఇన్ని సమస్యల సుడిగుండం లో వీరి జీవనస్థితిగతులు ఉండడం ఇలాంటి కష్టాలను అంబేద్కర్ గారు అర్థం చేసుకొని వీరి సమస్యలను చూసి చలించి వీరి జాతి పడుతున్న కష్టాలను అడవిలో ఎదురవుతున్న సవాళ్ళను దృష్టి లో ఉంచుకొని అన్ని జాతులతో పాటు వీరు కూడా సమ సమాజం లో అభివృద్ధి పథంలో నడవాలని రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పించి ఎస్.సి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది


గుడికట్ట , పూజారులు

[మార్చు]

గుడికట్టు అంటే గుడి దగ్గర ( ఆ గుడికి సంభందించిన వారు ) అందరు కలసి కూర్చొని ఓక నిర్ణయం తీసుకుంటే అదే గుడికట్టు ( కట్టు ) నియమం అని అర్థం ఒక సారి నియమం మొదలైన తరువాత అందరూ నియమబద్దులై ఉండాలి లేదంటే తప్పు చేసిన వారి నుండి సంజాయిషీ లేదా నియమం విస్మరించినందుకు తప్పు (జరిమాన) కట్టించుకోవడం జరుగుతుంది అలా కూడా చేయని పక్షం లో కులం నుండి వెలివేయడం జరుగుతుంది.

పూర్వం నుండి అంటరానితనం ఉండడం వలనే వీరి గుడికి బ్రహ్మణులు రారు పూజలు చేయరు ఇతర కులస్థులు కూడా బీరప్ప స్వామి గుడి కి రారు అందుకే పూర్వమే వీరి పెద్ధలు బీరప్ప స్వామి గుళ్ళు నిర్మించుకొని వీరు ప్రత్యేకమైన సంస్క్రుతి సాంప్రదాయాలు పాటిస్తూన్నారు వీరు పెళ్లిల్లు వీరి కుల పెద్దలు గురువులు ఘణాచార్యులు పూజారులు సమక్షంలో జరుగుతాయి బ్రహ్మణులు రారు ఈ గుడికి వీరి కులస్థులు తప్పితే వేరేవారు రారు వీరు వేరే గుడికి వెళ్ళరు. ఈ భీరప్ప స్వామి కి పూజలు చేయడానికి వారి గుడికట్ట లో ఉండే ఎవరో ఒక్కరి సంతానంలో పెద్ద కుమారుడు కాని లేక చివరి సంతానం నుండి పూజారిగా ఆ కుటుంబ యజమాని అనుమతి తో పూజారిగా బీరప్ప స్వామి పట్టాభిషేకం రోజున గురువులయ్య సాంప్రదాయం ప్రకారం పూజా క్రతువులు ముగించి పూజారిగా ప్రకటించి అంతకు ముందు తలిదండ్రులు కట్టిన మొలతాడు తెంచి ఆరోజు నుండి ఆ గుడికట్ట లో ఉన్న అన్నదమ్ములకు అందరికీ కుమారుడిగా ఉంటూ బీరప్ప స్వామి కి ఆంచలమైన భక్తి శ్రద్ధలతో బీరప్ప స్వామి కి పూజలు చేస్తాడు స్వామి కీర్తిని ప్రజ్వల్లిల్లేలా చేస్తాడు శుభ అశుభ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తారు వీరి ఆచార వ్యవహారాలు బిన్నంగా ఉంటాయి, తిక్కగా ఉంటాయి. అందుకే వీరిని తిక్క కురువలు అని వెర్రికురువలు అని కురువలకు వేపకాయంత వెర్రి ఉంటుందని హేళన చేస్తుంటారు. వీరికి పూర్వం పెద్దలనుండి సంక్రమించిన దేవుడు భీరప్ప స్వామి ఈ భీరప్పస్వాములకు ఏ ఊరిలో ఉంటే ఆపేరు తో పిలుస్తారు లక్షలు , వెచ్చించి అన్నదమ్ములను కలుపుకొని బీరప్ప స్వామి పట్టాభిషేకం నిర్వహిస్తారు

గురువులయ్య

[మార్చు]

70 నుండి 80 గుడికట్ల పూజారులకు పెద్దలుగా ఉండి హిందూ సాంప్రదాయాన్ని వ్యాప్తి చేయడం శ్రీశ్రీశ్రీ ఆది గురువు రేవణసిద్దేశ్వర స్వామి చెప్పిన ధర్మాన్ని వారు చెప్పిన సిద్ధాంతాలను పాటించే విధంగా కులంలో ఎప్పటికప్పుడు తను సూచనలు చేస్తూ మతం మారకుండా కాపాడటంలో గురువులది ప్రత్యేకమైన స్థానం సంస్క్రుతి సాంప్రదాయల పరిరక్షణ కర్తగా గురువులయ్య గారు ఉంటారు. వీరి సాంప్రదాయం వీర శైవం , గుడికట్ట కు పూజారులను నియమించడం , బీరప్ప స్వామి పట్టాభిషేకం నిర్వహించడం , హిందూమూలాలను కాపాడటం వీరివృత్తి

కులస్థుల నుండి ధన , ధాన్య , కానుకలు స్వీకరించి తన ధర్మాన్ని నిర్వర్థిస్తాడు

ఘణాచాార్యలు

[మార్చు]

వీరిలో తాంళంఘణాచార్యులు మద్దెల ఘణాచార్యులు అని రెండు రకాలు వీరువృత్తి మనకి పూర్వం మన పెళ్ళిళ్ళకు బ్రహ్మణులు వచ్చేవారు కాదు వీరు, పూజారులు కలిపి సాంప్రదాయబద్దంగా పెళ్ళి జరిపిస్తారు, గొరవయ్యలకు గొరవయ్యను చేయడం సాంప్రదాయ బద్దంగా మెడలో గవ్వలు కట్టడం వీరి వృత్తి.

మూలాలు

[మార్చు]
  1. "బి.సి.టైమ్స్. ఆర్గ్ లో కులం ఉనికి" (PDF). Archived from the original (PDF) on 2015-07-01. Retrieved 2015-05-20.
  2. "THE CONSTITUTION (SCHEDULED CASTES) ORDER, 1950 (C.O.19)". Archived from the original on 2009-06-19. Retrieved 2015-05-20.