మద్దూరి బలదుర్గా శ్యామల
Jump to navigation
Jump to search
మద్దూరి బలదుర్గా శ్యామల తొలి గజల్ కవయిత్రి.[1][2]
జననం[మార్చు]
శ్యామల 1966, ఆగస్టు 10న ఎం.ఎస్.ఎన్. మూర్తి, లక్ష్మీసీతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, వెల్లటూరు గ్రామంలో జన్మించింది.[2]
విద్యాభ్యాసం - ఉద్యోగం[మార్చు]
జిల్లెళ్ళమూడి ప్రాచ్య కళాశాల విద్యాభ్యాసం చేసింది. అభిజ్ఞాన శాకుంతలం ఆంధ్రీకరణ అనుశీలకు డాక్టరేట్ పొందింది. బాపట్ల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తుంది.
రచనాప్రస్థానం[మార్చు]
- కోయిలమ్మ పదాలు, సుహృల్లేఖ, షిర్డి గజల్స్, ఆలాపన (గజల్స్ సంకలనాలు)
- నా గుండే గుమ్మానికి పచ్చనాకునై, సజీవ క్షణాల కోసం వంటి (వచన కవితా సంకలనాలు)
పురస్కారాలు[మార్చు]
- ఉత్తమ ఉపాధ్యాయుని సత్కారం (సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల శాఖ)
- కవి బ్రహ్మ తిక్కనామాత్య పురస్కారం
- కలహంస గజల్ పురస్కారం
- ఎక్స్ లెన్సీ అవార్డు (హైదరాబాద్ కళావేదిక)
- మహిళా రత్న పురస్కారం (వివేకానంద సామాజిక సేవా సంస్థ)
- హెల్త్ ఇంటర్నేషనల్ అండ్ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ పురస్కారం[2]