మద్దూరి బలదుర్గా శ్యామల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మద్దూరి బలదుర్గా శ్యామల తొలి గజల్ కవయిత్రి.[1][2]

జననం[మార్చు]

శ్యామల 1966, ఆగస్టు 10న ఎం.ఎస్.ఎన్. మూర్తి, లక్ష్మీసీతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, వెల్లటూరు గ్రామంలో జన్మించింది.[2]

విద్యాభ్యాసం - ఉద్యోగం[మార్చు]

జిల్లెళ్ళమూడి ప్రాచ్య కళాశాల విద్యాభ్యాసం చేసింది. అభిజ్ఞాన శాకుంతలం ఆంధ్రీకరణ అనుశీలకు డాక్టరేట్ పొందింది. బాపట్ల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తుంది.

రచనాప్రస్థానం[మార్చు]

  1. కోయిలమ్మ పదాలు, సుహృల్లేఖ, షిర్డి గజల్స్, ఆలాపన (గజల్స్ సంకలనాలు)
  2. నా గుండే గుమ్మానికి పచ్చనాకునై, సజీవ క్షణాల కోసం వంటి (వచన కవితా సంకలనాలు)

పురస్కారాలు[మార్చు]

  1. ఉత్తమ ఉపాధ్యాయుని సత్కారం (సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల శాఖ)
  2. కవి బ్రహ్మ తిక్కనామాత్య పురస్కారం
  3. కలహంస గజల్ పురస్కారం
  4. ఎక్స్ లెన్సీ అవార్డు (హైదరాబాద్ కళావేదిక)
  5. మహిళా రత్న పురస్కారం (వివేకానంద సామాజిక సేవా సంస్థ)
  6. హెల్త్ ఇంటర్నేషనల్ అండ్ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ పురస్కారం[2]

మూలాలు[మార్చు]

  1. ప్రతిలిపి శ్యామల మద్దూరి. "ప్రతిలిపి". Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 21 April 2017.
  2. 2.0 2.1 2.2 "తొలి గజల్ కవయిత్రి శ్యామల". ఆంధ్రజ్యోతి. 10 April 2017.