మనసు కాస్తా కలతపడితే (పాట)

వికీపీడియా నుండి
(మనసు కాస్తా కలతపడితే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
"మనసు కాస్తా కలతపడితే"
రచయితసిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతంఇళయరాజా
సాహిత్యంసిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రచురణశ్రీకారం (1995)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిజేసుదాసు

మనసు కాస్తా కలతపడితే పాట 1995లో విడుదలైన శ్రీకారం చిత్రంలోని పాట. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను జేసుదాసు పాడాడు.

పాట నేపథ్యం[మార్చు]

అత్యాచారానికి గురై, మానసిక వేదనకు లోనై ఆత్మహత్య చేసుకోబోతున్న కథానాయకకు, కథానాయకుడు ధైర్యం చెప్పి ఆమెను ఓదార్చే సందర్భంలో వచ్చే పాట ఇది.[1]

పాటలోని సాహిత్యం[మార్చు]

పల్లవి:
మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కనుల నీరు తుడుచువారు ఎవరూ లేరని చితి ఒడికి చేరాకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి నూరేళ్లు నిండుగా జీవించమన్నది
వేటాడువేళలో పోరాడమన్నది ||మనసు కాస్త||
చరణం 1:
కలసి రాని కాలమెంత కాటేస్తున్న – చలి చిదిమేస్తున్న
కూలిపోదు వేరు ఉన్న తరువేధైనా – తనువే మోడైనా
మాను జన్మకన్న – మనిషి ఎంత మిన్న
ఊపిరిని పోసే ఆడదానివమ్మ
బేలవై నువ్వు కూలితే – నేలపై ప్రాణముండదమ్మ ||మనసు కాస్త ||

పురస్కారాలు[మార్చు]

  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం -1994

మూలాలు[మార్చు]

  1. సాక్షి, ఫ్యామిలీ (11 January 2014). "మనసు కాస్త కలతపడితే... మందు ఇమ్మని మరణాన్ని అడగకు!". Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.