మరా ప్రజలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Mara
(LAKHER, SHENDU, SHENDOO)
Total population
345,000 (approximately)
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
Mizoram, India70,000 (approximately)
Chin State, Burma215,000 (approximately)
other Countries65,000 (approximately)
భాషలు
Mara Reih, English, others
మతం
Christian (predominantly Evangelical)
సంబంధిత జాతి సమూహాలు
Mizo people, Zomi people, Meitei people Naga people, Kachin people, Rakhine people, Karen people, Kuki people, Karbi people, Shan people and Chin people

మారా ప్రజలు ఈశాన్య భారతదేశంలోని మిజోరాం నివాసులుగా గుర్తించబడ్డారు. ప్రధానంగా మిజోరాం రాష్ట్రంలోని మారా " అటానమసు డిస్ట్రిక్టు కౌన్సిలు "లో ఉన్నారు. ఇక్కడ వారు జనసంఖ్యాపరంగా ఆధిఖ్యతలో ఉన్నాడు. మారాలకు భారతదేశంలోని కుకి, మిజో, మయన్మారు లోని కాచిను, కరెను, షాను, చిను ప్రజలతో సంబధం ఉంది. మయన్మారులో చిను రాష్ట్రం (బర్మా)నైరుతి, దక్షిణ-మధ్య భాగంలో గణనీయమైన సంఖ్యలో మారాలు కనిపిస్తారు. భారతదేశంలోని మారా సమీప ప్రాంతాన్ని, బర్మాను వేరుచేస్తున్న కొలోడిను/చిమ్టుయిపుయి/ బినో నది అంతర్జాతీయ సరిహద్దుగా ఏర్పడుతుంది. తైకావో / మిజో ప్రజలు వారిని లాఖరు అని పిలుస్తారు, ఖుమి ప్రజలు, దాయి ప్రజలు, షి ప్రజలు, మాటు ప్రజలు, రాఖైంగు ప్రజలు వారిని లై అంటారు. షెండు ప్రజలు వారిని జోచియా అని పిలుస్తారు. 1978 లో మిజోరాం రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల జాబితాలో పాత పేరును భర్తీ చేస్తూ మారా అనే కొత్తపేరు చేర్చబడింది. మారాలు ప్రారంభ కాలంలో మారా, లాఖరు, షెండు, మాఘా, మిరాం, బాంగ్షెలు లేదా షెండూ, మారింగు, జ్యూ లేదా జావో / ఝో, ఖువాంగ్సాయి వంటి వివిధ గిరిజన పేర్లతో బాహ్య ప్రపంచేత గుర్తించబడ్డారు. వారు ఒక ప్రత్యేకమైన గిరిజన సమూహంగా ఉన్నారు. వారు అధికంగా మిజోరాంలోని సియాహా / సైహా జిల్లాలో, పాలెట్వా టౌన్‌షిపు ఉత్తర భాగం, మాటుపి టౌన్షిప్పు, తలాంట్లాంగు టౌన్షిప్పు పశ్చిమ, దక్షిణ భాగం, హాకా టౌన్షిప్పు దక్షిణ భాగంలో నివసిస్తున్నారు. వారు తమను "మారాలు" అని పేర్కొంటారు.[1] వారు ఖచ్చితంగా ఒక తెగ కాకుండా తెగల సమాఖ్య. ఇందులో త్లోసాయి, హలైపావో, హౌతాయి, జోఫే, జోటుంగు, లౌటు, సెంటాంగు తెగలు అంతర్భాగంగా ఉంటాయి.

గణాంకాలు[మార్చు]

తెగలు[మార్చు]

మరాకు భాషలో 11 మాండలికాలు ఉన్నాయి. వీటిని ఇప్పుడు అర్థం చేసుకోలేని విధంగా ఉన్నప్పటికీ స్వంత హక్కులు కలిగిన భాష అని భావిస్తారు. వివిధ తెగల మధ్య అవి:

  1. త్లోసాయి:- త్లోసాయి మారా అధికారిక భాష. ఇది మారలాండులో విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఇది సియాహా, పైథా, సైకావో గ్రూపులుగా విభజించబడింది. ముందుగా వారిని ఎక్కువగా ఖువాంగ్సాయి అని పిలుస్తారు. వీరి నుండి చాలా వంశాలు వచ్చాయి.
  2. సత్యూ / సాటే సమూహాలు సాబియు సమూహాలకు ఆగ్నేయంగా, లాటసుకు దక్షిణంగా, లియలైసుకు తూర్పుగా, మాటుపిసుకు వాయువ్యంగా నివసించారు. వారు సత్యూ / సాటే భాష మాట్లాడతారు.
  3. హౌథాయి లివావు భాష మరాల పురాతన భాష. అన్ని ఇతర మరా భాషలు దాని నుండి విడిపోతాయి. మయన్మారు (బర్మా) లివాసు (నోహ్రోసు, నోట్లియాసు) లోని సుమారు 300-500 ఇళ్లలో ఆరు గ్రామాలను కలిగి ఉన్న లోచీలు అనేక తెగలుగా ఇవి విభజించబడ్డాయి, భారతదేశంలోని ప్రతి గ్రామాలలో 200 నుండి 1000 గృహాలకు పైగా ప్రజలున్న 20 గ్రామాలు ఉన్నాయి.
  4. వహాపి (జైహ్నోసు):- లోపలు, లాకిలు అని పిలుస్తారు. వారి భాష హీమా కొంత లియలై భాషలను పోలి ఉంటుంది. ఎక్కువగా హిలైపావు తెగల పేరుతో కలిసి ఉంటాయి.
  5. భారతదేశంలో చాపి (సిజో మాట్లాడే బర్మాలో ప్రజలు తమను ఉత్తర సమూహం, సబ్యూ దక్షిణ సమూహం అని పిలుస్తారు) వారు మధ్య, దక్షిణ చిను కొండలు, మాలావి డివిజను శక్తివంతమైన, భయపడే తెగ. చీజా వంశం (పాలన వారసులు) మహ్లీ), వీరు హీమాల పాలక వంశాలు కూడా ఉన్నారు.
  6. హేమా మయన్మారు-బంగ్లాదేశు సరిహద్దులోని మోడుకు ఎన్గాలో అత్యంత శక్తివంతమైన తెగలు
  7. లియలై (లైలెన్):- వారి అత్యంత శక్తివంతమైన వంశంలో చైరి, త్లాహ్నీహులు ఉన్నారు. వారి అధిపతి ఎక్కువగా జవతా వంశాలకు చెందినవారు. దక్షిణ చిను కొండలు, ఉత్తర అరకాను రాష్ట్రంలో హీమా, సిజోలు వంటి వారు కూడా చాలా శక్తివంతమైన తెగ.
  8. జిఫేలు:- వీరిని జోఫే అని కూడా పిలుస్తారు. వారు భారతదేశంలోని సియాటా, ఇయానా అనే రెండు గ్రామాలను కలిగి ఉన్నారు. వారు హౌతాయి తెగలతో కలిసి ఉన్నారు. వారి ప్రధాన భాష వ్యూటు / వువాంగ్టు, ఈ తెగకు ముఖ్యుడు జవ్తాంగు వంశం ప్రధానమైనదిగా ఉంది.
  9. జోటుంగు:- వారిని జైతా, అజియు అని కూడా పిలుస్తారు. వారు ఎక్కువగా షాలు థాంగు, మాయి భాషలు మాట్లాడతారు.
  10. లౌతు:- వారిని లైటు / కహ్నో అని కూడా పిలుస్తారు. వారి తెగ పేరు మీద ఒక భాష మాట్లాడతారు.
  11. సెంటాంగు:- దీనిని సైతా అని కూడా పిలుస్తారు. వారు సెంటాంగు భాషలను మాట్లాడతారు. చాలా సాధారణ వంశం అయిన దీనిని సాథింగు అని అంటారు.

భాష[మార్చు]

మారా భాషలు టిబెటో-బర్మా కుటుంబానికి సంబంధించిన భాషల సమూహానికి చెంది ఉన్నాయి. ఇది మిజోరాం రాష్ట్రం, భారతదేశం, చిను, రాష్ట్రం, మయన్మారులోని పరిసర ప్రాంతంలో నివసించే మారా ప్రజలకు వాడుకభాషగా ఉంది. మారా ఈ ప్రాంతంలో విస్తృతంగా మాట్లాడే ఇతర మిజో, జోమి, కుకి, చిను భాషలతో కూడా దగ్గరి సంబంధం కలిగి ఉంది. అయితే కుకి-చిను లేదా కుకిషు భాష ప్రత్యేక భాషగా కూడా జాబితా చేయవచ్చు. ఇండియా మారా భాషలలో ప్రధానంగా త్లోసాయి, హ్లైపావో, లైవా, జిఫే, సిజో ఉన్నాయి.

ప్రభుత్వం[మార్చు]

మొట్టమొదటి కౌన్సిలు " పోయి-లాఖర్ ప్రాంతీయ కౌన్సిలు " చోహ్మో హ్లిచో (సైకావో త్లోసాయి గిరిజన అధిపతి), మారా అధిపతులతో కలిసి స్థాపించబడింది. ఆయన ప్రధాన ప్రతిపాదకుడిగా ఉన్నప్పటికీ, లాఖరు పయనీరు మిషను ఆల్బర్టు సహాయంతో బ్రూసు ఫాక్సాలు (చోహ్మో హిల్చోకు ప్రధాన సలహాదారు), లుషాయి పర్వతాల సూపరింటెండెంటు ఎల్ఎల్ పీటర్సు ఇది స్థాపించబడింది. తరువాత ఈ కౌన్సిలు మూడుగా చేయబడింది. మూడుగా విభజించబడిన తరువాత దాని పేరు " మారా అటానమసు డిస్ట్రిక్టు కౌన్సిలు " గా పునర్స్థాపన చేయబడింది. భారతదేశంలో మారా ప్రజలు స్వయంప్రతిపత్త సంస్థను కలిగి ఉన్నారు, అనగా " మారా అటానమసు డిస్ట్రిక్టు కౌన్సిలు " ఈ ప్రాంతానికి స్థానిక పాలక మండలిగా ఉంటూ ఇది మిజోరాం సియాహా జిల్లాలోని ప్రధాన పట్టణం సియాహాలో కేంద్రీకృతమై ఉంది. మిజో నేషనలు ఫ్రంటు, ఇండియన్ నేషనలు కాంగ్రెసు కౌన్సిలులో అత్యంత చురుకైన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. 2019 నాటికి అధికార పార్టీలోని చాలా మంది సభ్యులు భారతీయ జాతీయ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీకి వంటి జాతీయ పార్టీలకు మారారు. అధికారం మోహం కారణంగా ఇది వారి స్వంత ప్రజలను కూడా మోసం చేస్తుంది.

బర్మాలో, మారా ప్రజలకు స్వయం ప్రభుత్వ సంస్థ లేదు. వారి భూమి పూర్తిగా వారు నివసించినప్పటికీ, వారు ఏడు టౌన్షిప్పులచే పరిపాలించబడ్డారు; ఉత్తరాన ఉన్నవారికి త్లాంట్లాంగు, హాకా టౌన్షిపు; మధ్య భాగంలోని ప్రజల కోసం మాటుపి, లైలెన్పి, రెజువా టౌన్షిపు; దక్షిణ భాగంలోని ప్రజల కోసం పాలెట్వా, సాం టౌన్షిప్పు; తూర్పు మరా ప్రజలకు రాజధాని పట్టణంగా లైలెన్పి ఉంది. ఇది బర్మాలోని అన్ని మరా ప్రజలకు కేంద్ర ప్రదేశంగా ఉంది.

మతం[మార్చు]

మారా ప్రజలందరూ 100% క్రైస్తవులు, ఎక్కువగా ఎవాంజెలికలు అని అంచనా వేయబడింది. 1907 లో రెవ. మిషనరీలు బాప్టిస్టు మూలానికి చెందినవారు అయినప్పటికీ, మారలాండులో కొత్తగా స్థాపించబడిన చర్చి బయటి చర్చి లేదా తెగలతో అనుబంధించబడలేదు. దీనిని " ఇండిపెండెంటు చర్చి ఆఫ్ మారలాండు " అని పిలుస్తారు. ప్రస్తుత ఎవాంజెలికలు చర్చికి రెండు శాఖలు ఉన్నాయి. ఒకటి మరాలాండు భారతదేశం, మరొకటి బర్మాలో ఉన్నాయి; భారతదేశ విభజన తరువాత ఈ శాఖలు వేరు చేయబడ్డాయి.

ఎవాంజెలికలు చర్చి ఆఫ్ మారాలాండు (ఇండియా), కాంగ్రేగేషనలు చర్చి ఆఫ్ ఇండియా (మారలాండు), మారా ఎవాంజెలికలు చర్చి(బర్మా) మూడు ఆధిపత్య చర్చిలుగా ఉన్నాయి. మిజోరాం లోని సియాహా జిల్లాలోని సైకావో (సెర్కావరు) పట్టణంలో ఖననం చేయబడిన మార్గదర్శక మిషనరీలు మూడు చర్చీల ప్రత్యేక సాధనలుగా భావించబడుతున్నాయి. మారా ప్రజలలో ప్రెస్బిటేరియను, బాప్టిస్టు, సెవెంత్-డే అడ్వెంటిస్టులు, పెంటెకోస్టలు కూడా గణనీయమైన గుర్తింపు కలిగి ఉన్నాయి.

References[మార్చు]

  1. Dr K. Zohra, Ph.D, An introductory notes to Mara District of South Mizoram, India.

External links[మార్చు]

మూస:Kuki-Chin-Mizo tribes మూస:Scheduled tribes of India మూస:Hill tribes of Northeast India