రాజరాజ నరేంద్ర స్వామి దేవాలయం
| రాజరాజ నరేంద్ర స్వామి దేవాలయం | |
|---|---|
| భౌగోళికాంశాలు : | 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E |
| పేరు | |
| ప్రధాన పేరు : | రాజరాజ నరేంద్ర స్వామి దేవాలయం |
| ప్రదేశం | |
| దేశం: | భారత దేశం |
| రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా: | తూర్పు గోదావరి |
| ప్రదేశం: | ఆత్రేయపురం లొల్ల |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | రాజరాజ నరేంద్ర స్వామి దేవాలయం |
| నిర్మాణ శైలి, సంస్కృతి | |
| దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
రాజరాజ నరేంద్ర స్వామి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురంమండలంలో లొల్ల గ్రామంలో ఈ దేవాలయం ఉంది.
ఆలయ చరిత్ర
[మార్చు]ఈ దేవాలయం నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించారు. ఇక్కడ స్వామి వారిని రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన శ్రీ రాజ రాజనరేంద్ర చక్రవర్తి ప్రతిష్ఠించారు. సారంగధర శిక్షానంతరం జరిగిన దానికి క్షోభించి, ఆ పాపవిముక్తి కొరకు రాజరాజ నరేంద్రుడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా గ్రామాల్లో శివలింగములను ప్రతిష్ఠించాడు. ఆలయాన్ని నిర్మించడమేగాక, ఆలయ నిర్వాహణకు కావలసిన భూములన్నీ ఆయనస్వామి వారికి సమర్పించాడు. ఆయన గుడిని కట్టించడమేగాక స్వామి వారికి రాజరాజనరేంద్రస్వామి అని పేరు పెట్టుకున్నాడు.స్వామి వారి మహిమల గురంచి గ్రామస్థులు చాలా గొప్పగా చెప్పుకుంటారు.[1]
ఉత్సవాలు
[మార్చు]ప్రతి సంవత్సరం మహాశివరాత్రిన చాలా వైభవోపేతంగా జరుగుతుంది. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
మూలాలు
[మార్చు]- ↑ ఎన్. ఎస్, నాగిరెడ్డి (2003). తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి.