రెండవ కులోత్తుగ చోళుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Kulothunga Chola II
రెండవ కులోత్తుగ చోళుడు
Rajakesari
Reignసుమారు 1133 –  1150 CE
PredecessorVikrama Chola
SuccessorRajaraja Chola II
మరణం1150 CE
QueenTyagavalli
Mukkokilan
IssueRajaraja Chola II
తండ్రిVikrama Chola

రెండవ కులోత్తుంగ చోళుడు దక్షిణ భారతదేశంలోని తమిళ ప్రజల చోళ రాజవంశం 12 వ శతాబ్దపు రాజు. సా.శ1135 లో తన తండ్రి విక్రమచోళుడి తరువాత సింహాసనం పొందాడు. సా.శ 1133 లో విక్రమచోళుడు కులోత్తుంగను స్పష్టంగా, దృఢంగా తన వారసుడిని చేసాడు. రెండవ కులోత్తుంగ శాసనాలు క్రీస్తుశకం 1133 నుండి అతని పాలన ప్రారంభించాడు.[1] రెండవ కులోత్తుంగ పాలన సాధారణ శాంతి, సుపరిపాలన కాలంగా భావించబడింది.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

" కులోత్తుంగ చోలను ఉలా" రెండవ కులోత్తుంగ చోళుడిని తువరాయి నుండి వచ్చిన చంద్రవంశానికి చెందిన యువరాణి కుమారుడిగా ప్రశంసించింది. ఈ వివరాల ఆధారంగా పండితులు ఆయన తల్లిని హొయసల యువరాణిగా గుర్తిస్తారు. యు.వి స్వామినాథ అయ్యరు ఆమెను ద్వారసముద్రకు చెందిన వెలిరు అధిపతి కుమార్తెగా గుర్తిస్తుంది.[3]

రెండవ కులోతుంగ చోళుడు గంగైకొండ చోళపురం వద్ద రాజధాని కంటే చిదంబరంలో నివసించడానికి ఇష్టపడ్డాడు. ఆయనకున్న వివిధ బిరుదులలో అనపాయ బహుశా అతనికి ఇష్టమైనది. ఇది ఆయన శాసనాలలో, కులోత్తుంగ చోళను ఉలా అనే కవితా నివాళిలో కనుగొనబడింది.[4] ఆయనను తిరునీట్రురుచోళా అని కూడా పిలుస్తారు.[5] సా.శ 1150 లో రెండవ కులోత్తుంగ తరువాత రెండవ రాజరాజ చోళుడు వచ్చాడు.

సామ్రాజ్య విస్తరణ[మార్చు]

ఆయన పూర్వీకుడు విక్రమచోళుడి వారసత్వంగా వచ్చిన సామ్రాజ్యం చక్కగా నిర్వహించబడింది. ఈ కాలంలో పశ్చిమ చాళుక్య రాజ్యాన్ని ద్వారసముద్ర, దేవగిరి యాదవ ముఖ్యులు పడగొట్టారు. రెండవ కులోత్తుంగచోళుడు కన్నడ, చాళుక్య దేశంలో అంతర్గత అభిప్రాయబేధాలు, తిరుగుబాట్లను సద్వినియోగం చేసుకుని వెంగీ, తూర్పు చాళుక్య భూభాగాల మీద తన పట్టును ఏర్పరచుకున్నాడు. వేంగి ఉత్తర భాగాన్ని పరిపాలించిన వేలనాడు చోడ కుటుంబానికి చెందిన రెండవ గోంకా ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించాడు. అదేవిధంగా కడప-నెల్లూరు అధిపతి మొదటి బెట్టా కుమారుడు మదురాంతక పొట్టాపి చోడ, కొండవీడు శాఖకు చెందిన మూడవ బుద్ధవర్మను, ఆయన కుమారుడు రెండవ మండయ కూడా ఆంధ్ర దేశంలో రాజు అధికారాన్ని అంగీకరించారు.[6]

చిదంబరాలయం[మార్చు]

చోళ యువరాజులు ఐదు ప్రదేశాలుకు తమ కిరీటాధికారాన్ని పెట్టుబడి పెట్టారు. కులోతుంగ ఆ నగరంలోని శివుడి చిదంబరం ఆలయానికి గొప్ప భక్తుడు, ఆయన అక్కడ తన పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు. తిరుమణికులిలోని రాజశాసనం ఈ సంఘటనను ప్రశంసించింది. తిల్లై (చిదంబరం) నగరానికి మెరుపునిచ్చే విధంగా రాజు తన పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడని పేర్కొంది.[7]

కులోతుంగ చోళుడు ఉలా కవితలో వివరించిన విధంగా ఆలయం విస్తరించడానికి పునర్నిర్మాణానికి ఆయన ఆర్థిక సహాయం చేశారు. ఈ పునరుద్ధరణ పని విక్రమచోళుడు ప్రారంభించిన పనుల కొనసాగింపుగా ఉండే అవకాశం ఉంది. నటరాజ ఆలయం పెరంబాలం, చిదంబరం బంగారంతో పూసిన ఘనత రెండవ కులోత్తుంగ చోళుడికి దక్కింది. ఆయన దాని గోపురాలు, వెయ్యి స్తంభాల హాలును కూడా నిర్మించాడని చెబుతారు.[8][9]

1913 లో చిదంబర ఆలయం దృశ్యం

సాహిత్యం[మార్చు]

రెండవ కులోత్తుంగ చోళుడు పాలన సాహిత్య కార్యకలాపాల ద్వారా గుర్తించబడింది. ఇది సెక్కిళారి, ఒట్టకూతరు రచనల ద్వారా రుజువు చేయబడింది.[10] సెక్కిళారు తన పాలనలో శైవ మతం మీద మత గ్రంథమైన పెరియపురాణం రచన చేశాడు.[11] రాజు బాల్యంతో వ్యవహరించే కులోత్తుంగ చోళ ఉలా, కులోత్తుంగ చోలను పిళ్ళై తమిళ రాజు గౌరవార్థం ఒట్టకూతరు రచించారు.[12]

వైష్ణవులను హింసించుట[మార్చు]

కొంతమంది పండితులు రెండవ కులోతుంగచోళుడిని క్రిమికాంత చోళ లేదా పురుగు-మెడ చోళతో పిలుస్తారు. ఆయన గొంతు లేదా మెడ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు చెబుతారు. తరువాతి వైష్ణవ గురుపరంపరాలో ఇది ప్రస్తావించబడింది, వైష్ణవులకు బలమైన ప్రత్యర్థి అని చెబుతారు. పర్పన్నమృతం (17 వ శతాబ్దం) రచన క్రిమికాంత అనే చోళ రాజును సూచిస్తుంది. ఆయన గోవిందరాజ విగ్రహాన్ని చిదంబరం నటరాజ ఆలయం నుండి తొలగించినట్లు చెబుతారు.[13] కులోతుంగ చోలన్ ఉలా, కులోత్తుంగ II పాలనలో, విష్ణువును తన అసలు నివాసానికి, అంటే సముద్రానికి తిరిగి పంపించాడని పేర్కొన్నాడు.[14] అయితే శ్రీరంగం ఆలయానికి చెందిన "కోయిలు ఒలుగు" (ఆలయ రికార్డులు) ఆధారంగా కులోత్తుంగ చోళుడి క్రిమికాంత చోళ కుమారుడు. తన తండ్రికి భిన్నంగా పశ్చాత్తాప పడుతున్న కొడుకు వైష్ణవ మతానికి మద్దతు ఇచ్చాడు.[15][16] రామానుజుడు రెండవ కులోత్తుంగచోళుడిని తన మేనల్లుడు దశరతి శిష్యుడిగా చేసినట్లు చెబుతారు. రామానుజుడి కోరిక ప్రకారం రాంగనాథస్వామి ఆలయ నిర్వహణను దసరతి, అతని వారసులకు మంజూరు చేశాడు.[17][18]

శిలాశాసనాలు[మార్చు]

తిరువారూరులోని త్యాగరాజస్వామి ఆలయంలో ఒక రాజు శాసనం ఉంది. దీనిలో ఆయన తనను తాను అనపాయగా, చిదంబరం నటరాజు పాదకమలాల వద్ద తేనెటీగగా పేర్కొన్నాడు.[4]

మాధ్యమం[మార్చు]

దశావతారం చలనచిత్రంలో నటుడు నెపోలియను రెండవ కులోత్తుంగ పాత్రను పోషించాడు.

మూలాలు[మార్చు]

  1. K.V. Raman. Sri Varadarajaswami Temple, Kanchi: A Study of Its History, Art and Architecture. Abhinav Publications, 2003 - 206 pages. p. 15.
  2. Yashoda Devi. The History of Andhra Country, 1000 A.D.-1500 A.D.: Without special title. Gyan Publishing House, 1993 - Andhra Pradesh (India) - 528 pages. p. 18.
  3. Govindan Thirumavalavan. Political, social, and cultural history of the Chōl̲ās as gleaned from Ulā literature. Ezhilagam Publishers, 1991 - History - 244 pages. pp. 101–102.
  4. 4.0 4.1 P. V. Jagadisa Ayyar. South Indian Shrines: Illustrated. Asian Educational Services, 1982 - Hindu shrines - 638 pages. p. 216.
  5. Vidya Dehejia. Slaves of the Lord: The Path of the Tamil Saints. Munshiram Manoharlal, 1988 - Art - 206 pages. p. 19.
  6. Government Of Madras Staff, Government of Madras. Gazetteer of the Nellore District: Brought Upto 1938. Asian Educational Services, 1942 - Nellore (India : District) - 378 pages. p. 43.
  7. S. R. Balasubrahmanyam; B. Natarajan; Balasubrahmanyan Ramachandran. Later Chola Temples: Kulottunga I to Rajendra III (A.D. 1070-1280), Parts 1070-1280. Mudgala Trust, 1979 - Architecture - 470 pages. p. 102.
  8. Archaeological Survey of India, India. Dept. of Archaeology. Epigraphia Indica, Volume 27, Volumes 13-14 of [Reports]: New imperial series, India Archaeological Survey. Manager of Publications, 1985. p. 96.
  9. Madras (India : State). Madras District Gazetteers, Volume 1. Superintendent, Government Press, 1962. p. 55.
  10. Sailendra Nath Sen. Ancient Indian History and Civilization. New Age International, 1999 - India - 668 pages. p. 486.
  11. Karen Pechilis Prentiss. The Embodiment of Bhakti. Oxford University Press, 06-Jan-2000 - Religion - 288 pages. p. 117.
  12. Prema Kasturi; Chithra Madhavan. South India heritage: an introduction. East West Books (Madras), 2007 - History - 616 pages. p. 294.
  13. B. Natarajan; Balasubrahmanyan Ramachandran. Tillai and Nataraja. Mudgala Trust, 1994 - Chidambaram (India) - 632 pages. p. 108.
  14. Three great Acharyas: Sankara, Ramanuja, and Madhwa: critical sketches of their life and times: an exposition of their philosophical systems. G. A. Natesan, 1947. p. 126.
  15. V. N. Hari Rao. Kōil Ol̤ugu: The Chronicle of the Srirangam Temple with Historical Notes. Rochouse, 1961. p. 87.
  16. Mu Kōvintacāmi. A Survey of the Sources for the History of Tamil Literature. Annamalai University, 1977. p. 161.
  17. C. R. Sreenivasa Ayyangar (1908). The Life and Teachings of Sri Ramanujacharya. R. Venkateshwar, 1908. p. 239.
  18. Colin Mackenzie. T. V. Mahalingam (ed.). Mackenzie manuscripts; summaries of the historical manuscripts in the Mackenzie collection, Volume 1. University of Madras, 1972. p. 14.

వనరులు[మార్చు]

  • Nilakanta Sastri, K.A. (1935). The CōĻas, University of Madras, Madras (Reprinted 1984).
  • Nilakanta Sastri, K.A. (1955). A History of South India, OUP, New Delhi (Reprinted 2002).
అంతకు ముందువారు
విక్రమ చోళుడు
చోళ
1133–1150 CE
తరువాత వారు
రెండవ రాజరాజ చోళుడు