వగ్గెల మిత్రసేన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వగ్గెల మిత్రసేన

వగ్గెల మిత్రసేన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే.[1] ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు[2].

జీవిత విశేషాలు[మార్చు]

అశ్వారావుపేట మండలం సున్నంభట్టి గ్రామానికి చెందిన మిత్రసేన 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు[3]. 2009 నుంచి 2014 వరకు అశ్వారావుపేట ఎమ్మెల్యేగా మిత్రసేన సేవలందించారు.[4] 2009లో కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రసేన విజయం సాధించారు.[5] [6]

గిరిజనులకు పోడు భూములపై హక్కును కల్పిస్తూ మహానేత వైఎస్సార్ హయాంలో రూపొందించిన అటవీహక్కు చట్టం, అటవీహక్కు పత్రాల పంపిణీని. సగానికిపైగా ఎస్టీ రిజర్వుడ్ స్థానాలున్న ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించడంతో వగ్గెల మిత్రసేనది కీలకపాత్ర. ప్రజల మనిషిగా పేరున్న ఆయన స్వగ్రామం సున్నంబట్టికి సర్పంచ్ గా ఎన్నికవావడం ద్వారా తన రాజకీయప్రస్థానాన్ని ప్రారంభించారు. కొంతకాలం అశ్వాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా 2007 నుండి 2009 మధ్య పనిచేశారు.[7]

మిత్రసేనకు భార్య పోలమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మరణం[మార్చు]

కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ నిమ్స్‌లో డయాలసిస్‌ పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు.[8]

మూలాలు[మార్చు]

  1. మాజీ ఎమ్మెల్యే మిత్రసేన మృతి 14-02-2016[permanent dead link]
  2. Mithrasena Vaggela
  3. Andhra Pradesh Assembly Election Results in 2009[permanent dead link]
  4. "Sitting and previous MLAs from Aswaraopeta (ST) Assembly Constituency". Archived from the original on 2016-04-14. Retrieved 2016-02-14.
  5. మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన కన్నుమూత..[permanent dead link]
  6. "Former MLA Mitrasena Passes Away". Archived from the original on 2016-02-15. Retrieved 2016-02-14.
  7. మాజీ ఎమ్మెల్యే మిత్రసేన మృతి Sakshi | Updated: February 13, 2016
  8. "మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన కన్నుమూత". Archived from the original on 2016-02-14. Retrieved 2016-02-14.

ఇతర లింకులు[మార్చు]