వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 23వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టక్నాలజీ మద్రాస్‌ (ఐఐటీ మద్రాస్‌) దక్షిణ భారత దేశంలోని చెన్నై(గతంలో మద్రాస్‌)లో ఉన్న ఒక ఇంజినీరింగ్‌ మరియు టెక్నాలజీ కళాశాల. భారత ప్రభుత్వం చేత, జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తింపు పొందింది. భారతదేశంలో ఉన్న అత్యుత్తమ ఇంజినీరింగ్‌ సంస్థలలో ఒకటి. పశ్చిమ జర్మనీ ప్రభుత్వం యొక్క సాంకేతిక మరియు ఆర్థిక సహకారంతో 1959లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేయడం ద్వారా రూపొందించిన 15 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలలో ఐఐటీ మద్రాస్‌ మూడవది. ఇంజినీరింగ్‌ మరియు టెక్నాలజీలలో అత్యుత్తమ విద్యావకాశాలు, పరిశోధన కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఐఐటీ మద్రాస్‌ 2.5 చదరపు కిలోమీటర్లు (620 ఎకరాల) విస్తీర్ణంలో క్యాంపస్‌ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్‌ సంస్థ. ఇది గిండి జాతీయ పార్క్‌లో ఒక భాగంగా ఉంది. సంస్థలో సుమారు 360 మంది అధ్యాపకులు, 6 వేల మంది విద్యార్థులు మరియు 1250 మంది నిర్వహణ మరియు సహాయ సిబ్బంది ఉన్నారు. 1961లో భారత పార్లమెంటులో రూపుదిద్దుకొన్నప్పటి నుంచి ఈ సంస్థ ఎదుగుతూ వచ్చింది. దీని అద్భుతమైన క్యాంపస్‌లో అధిక భాగం గిండి నేషనల్‌ పార్క్‌ యొక్క రక్షిత అడవిలో భాగం. ఇది ఇప్పటికీ చితల్‌కు (మచ్చల దుప్పులు) స్వస్థలం. బ్లాక్‌బక్‌ మరియు ఇతర వన్యమృగాలకు ఇది కేంద్రం. 2003లో లోతు పెంచిన సహజసరస్సు, వర్షపు నీటిని తనలో ఇంకింపజేసుకుంటుంది.


(ఇంకా…)