వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 42వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశంలో ఇస్లాం
భారతదేశం లో హిందూమతం తరువాత రెండవ స్థానంలో ఇస్లాం మతం గలదు. 2007 గణాంకాల ప్రకారం, 13.4% ముస్లింలు గలరు. ప్రస్తుతం భారత్ లో ముస్లింలు ఇండోనేషియా మరియు పాకిస్తాన్ ల తరువాత మూడవ స్థానంలో వున్నారు.దక్షిణాసియా లో ముస్లింల దండయాత్రల మూలంగా భారత్ లో ఇస్లాం ప్రవేశించిందని, సాధారణంగా ఓ నమ్మకమున్నది. చరిత్రను చూస్తే క్రింది విషయాలు ద్యోతకమవుతాయి. భారతదేశంలో మొదటి మస్జిద్ (మసీదు) క్రీ.శ. 612 లో చేరామన్ పెరుమాళ్ కాలంలో కేరళ లో నిర్మింపబడినది. ఈ కాలం ముహమ్మద్ ప్రవక్త జీవితకాలం. (క్రీ.శ. 571 - 632 ). కేరళ లోని కొడుంగళూర్ లో మాలిక్ బిన్ దీనార్ చే నిర్మింపబడినది. మాలిక్ బిన్ దీనార్ మరియు 20 మంది ముహమ్మద్ ప్రవక్తగారి అనుయాయులు, మొదట కేరళలోని, కొడుంగళూర్ వచ్చారు. వీరు భారతదేశంలో ప్రవేశించినపుడు, ఈ రాష్ట్రాలలో ఇస్లాం మతానికి మంచి స్పందన లభించినది. తదనంతరం, ఇతర రాష్ట్రాలలో కూడా మంచి స్పందన లభించింది. ఇస్లామీయ తత్వం, ఏకేశ్వరోపాసక నియమం, సర్వమానవ సోదరభావత్వం, సమానత్వాల ప్రవచనాలు, శాస్త్రాలతో కూడిన ఖురాన్, సాదా సీదా జీవన సరళి, మున్నగు విషయాలు ప్రజలపై ప్రభావం చూపాయి. మాలిక్ బిన్ దీనార్ మొదటి మస్జిద్ ను నిర్మించాడు, ఈ మస్జిద్, హిందూ దేవాలయ శైలి (కేరళ శైలి) లో నిర్మింపబడినది.
(ఇంకా…)