వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 29వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మండ్య

మండ్య (కన్నడ: ಮಂಡ್ಯ) కర్ణాటక రాష్ట్రములోని నగరము మరియు మండ్య జిల్లా (కన్నడం: ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆ ) యొక్క ప్రధానపట్టణం. మండ్య మైసూరు నుండి 40 కిలోమీటర్లు, బెంగళూరు నుండి వంద కిలోమీటర్లు దూరములో ఉన్నది. ఈ నగరానికి మాండవ్య ఋషి పేరు మీద మాండవ్యనగరంగా పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మండ్య అయ్యింది. 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 1,808,680 వీరిలో 16.03% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు. మాండ్య జిల్లాకేంద్రం మాడ్య కారణంగా జిల్లాకు ఈ పేరు వచ్చింది. మాండ్య నగర నామం వెనుక పురాణ కథనం ప్రచారంలో ఉంది. ఇది మాండవ్య ముని నివసించిన ప్రాంతం కనుక నగరానికి ఈ పేరు వచ్చిందని విశ్వసిస్తున్నారు. అయినప్పటికీ పరిశోధకులు, విద్యావంతులు పురాతన శిలాక్షరాలను అనుసరించి మన్- త- య (ಮಂಟಯ) అని పేర్కొన్నారు. ఇది పురాతన కాలం నుండి మానవ నివాసప్రాంతంగా ఉందని విశ్వసిస్తున్నారు. కాలక్రమంలో ఇది మాండ్య అయింది. మాండ్య చరిత్ర మైసూరు రాష్ట్రంతో సమీప బాంధవ్యం ఉంది. మాండ్య మరియు కావేరీ ముఖద్వారం పరిసర ప్రాంతాలను గంగాలు, చోళులు, హొయసలులు తరువాత 1346 లో విజయనగర రాజులు పాలించారు. 1565 యుద్ధం తరువాత క్రిష్ణదేవరాయలు సమఖ్య దక్కన్ నవాబుల చేతిలో ఓడిపోయిన తరువాత విజయనగర సామ్రాజ్యం పతనావస్థకు చేరుకుంది. తరువాత క్రమంగా ఒడయార్లు బలపడసాగారు.

(ఇంకా…)