వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 27వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పి.వేణుగోపాల్

డాక్టర్ పి.వేణుగోపాల్ ప్రముఖ హృద్రోగ శస్త్రచికిత్స వైద్యంలో నిపుణులు. 49 సంవత్సరాల సేవ తరువాత 3, జులై 2008న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసారు. కేంద్ర ఆరోగ్యమంత్రి అంబుమణి రామదాసుతో అల్ ఇండియా మెడికల్ సైన్సెస్ నిర్వహణపరమైన విధానాలతో విభేదించి, కుట్ర పూరితమయిన చట్టం ద్వారా తొలగింపబడి తిరిగి సుప్రీం కోర్టు ద్వారా నియమింపబడి, సంస్థ లోని డాక్టర్లు, ఇతర సిబ్బంది, పలువురు రాజకీయ నాయకులు, మీడియా వారి మద్దతు పొంది విజయం సాధించిన అరుదయిన వ్యక్తి. భారత దేశములో మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు. అనేక అంతర్జాతీయ హృద్రోగ సంస్థలకు సలహాదారుడిగా మరియు సభ్యుడిగా ఉన్న వేణుగోపాల్ తెలుగుజాతికి గర్వకారణం. వైద్యంలో ముఖ్యంగా హృద్రోగాల నిదానంలో ఈయన ఒక అసాధారణ నిపుణులు. మౌలిక ప్రతిభ ఉన్న పరిశోధకులు. మన దేశంలో మొట్టమొదటి గుండెమార్పిడి శస్త్రచికిత్స చేసింది ఈయనే. 1994 లో దేవీరాం (ఓక మోటార్ మెకానిక్) కు అరుదైన శస్త్రచికిత్స చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. దేశంలో తొలిసారిగా ఈ అసాధారన వైద్య విజయాన్ని సాధించారు. ఆనాటి నుండి 50వేల మందికి పైగా హృద్రోగులకు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. 1970లో ఎయిమ్స్ లో చేరినప్పటి నుండి ఏ ఆపరేషన్ థియేటర్ లో, ఏ టేబుల్ మీదనయితే వేలాది మంది హృద్రోగులకు ఈయన శస్త్ర చికిత్స చేసారో, అదే టేబుల్ మీద ఈయనకు కూడా బైపాస్ సర్జరీ జరిగింది.

(ఇంకా…)