వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 31వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కేశవ శంకర్ పిళ్ళై

శంకర్ గా సుపరిచితులైన కేశవ శంకర్ పిళ్ళై(1902 జూలై 31 – 1989 డిసెంబరు 26) ఒక ప్రముఖ భారతీయ కార్టూనిస్టు. ఆయన 1948 లో "శంకర్ వీక్లీ" మరియు పంచ్ అనే పత్రిక ను స్థాపించారు. ఆయన సృష్టించిన వారపత్రిక అబూ అబ్రహం, రంగ మరియు కుట్టి వంటి కార్టూనిస్టులను సృష్టించింది. ఎమర్జెన్సీ సమయంలో ఈ పత్రికను ఆపివేసారు. అప్పటి నుండి ఆయన బాలలకు హాస్యాన్నందిస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపారు. ఆయనకు 1976లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. ఆయన 1857లో చిల్డ్రన్స్ బుక్ ట్రస్టును మరియు 1965లో శంకర్ ఇంటర్నేషనల్ డాల్స్ సంగ్రహాలయం స్థాపించారు. శంకర్ 1902 లో కేరళ లోని కాయంకుళంలో జన్మించారు. కాయంకుళం మరియు మావెలిక్కర ప్రాంతాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు నిద్రిస్తున్న భంగిమలో ఉన్న చిత్రం ఆయన వేసిన మొదటి కార్టూన్. ఆ చిత్రాన్ని ఆ తరగతి గదిలోనే వేసారు. ఆ సంఘటన ప్రధానోపాధ్యాయుని ఆగ్రహానికి గురిచేసింది. కానీ ఆయన పినతండ్రి ప్రోత్సాహం మేరకు ప్రసిద్ధ కార్టూనిస్టుగా ఎదిగారు. పాఠశాల విద్య అనంతరం "మావెలికర"లో రవివర్మ స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్ లో చదివారు. ఆయన నాటకాలు, స్కౌట్స్, రచనా వ్యాసంగాలలో పాల్గొనడానికి ఇష్టపడేవారు. వరద బాధితుల కోసం విరాళాల సేకరణ కూడా చేసారు. ఆయన చిత్రాలు పేద ప్రజల జీవన చిత్రాలను ప్రతిబించేటట్లు ఉండేవి.


(ఇంకా…)