వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 30వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాలతీదేవి చౌదరి

మాలతీదేవి చౌదరి (సేన్) (1904 జూలై 26 – 1998 మార్చి 15) భారతీయ పౌర హక్కుల, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త, గాంధేయవాది. ఆమె 1904లో ఉన్నత మధ్యతరగతి బ్రహ్మో కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి కుముద్ నాథ్ సేన్, న్యాయవాది. రెండున్నర సంవత్సరాల వయస్సులోనే ఆమె తండ్రిని కోల్పోయింది. ఆమెను తల్లి స్నేహలతా సేన్ పెంచింది. మాలతీ దేవి కుటుంబం వాస్తవానికి ఢాకాలోని బిక్రంపూర్‌లోని కమరఖండకు చెందింది (ప్రస్తుతం అది బంగ్లాదేశ్‌లో ఉంది). కానీ ఆమె కుటుంబ సభ్యులు బీహార్‌లోని సిముల్తాలాలో స్థిరపడ్డారు.ఆమె తల్లి తాత బెహారీ లాల్ గుప్తా, ఐసిఎస్, బరోడా దివాన్ అయ్యాడు. ఆమె తల్లి తరపున కుటుంబంలో మొదటి బంధువులు రణజిత్ గుప్తా, పశ్చిమ బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐసిఎస్, ప్రముఖ లోకసభ సభ్యుడు, భారతదేశ మాజీహోంమంత్రి ఇంద్రజిత్ గుప్తా, అన్నయ్య పికె సేన్ గుప్తా, మాజీ ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారి, భారతీయ ప్రభుత్వ ఆదాయ శాఖలో పనిచేసాడు.మరొక సోదరుడు కెపి సేన్ మాజీ పోస్ట్‌మాస్టర్ జనరల్. తల్లిదండ్రులకు మాలతీదేవీ చిన్నబిడ్డ కావడం వలన, ఆమె తనసోదరులుకు ప్రియమైంది.ఆమె తల్లి స్నేహలత స్వతాగా రచయిత్రి, ఆమె జుగలాంజలి పుస్తకంనుండి ఠాగూర్ కొన్నిరచనలను అనువదించాడు.
(ఇంకా…)