వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 30వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేశీయ ఆర్యులు

పౌరాణిక కాలక్రమంపై ఆధారపడిన భారతీయ సాంప్రదాయిక దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తూ పాశ్చాత్యులు ప్రవచించిన, ప్రస్తుతం సాధారణంగా ఆమోదంలో ఉన్న కాలాన్ని త్రోసిరాజంటూ, వేదకాలం మరింత ప్రాచీనమైనదని ఈ సిద్ధాంతం చెబుతుంది. సింధు లోయ నాగరికతని కూడా చెబుతుంది. ఈ సిద్ధాంతం దృష్టిలో, "భారతీయ నాగరికత సా.పూ. 7000 - 8000 కాలం నాటి సింధు నాగరికత నాటి నుండి అవిచ్ఛిన్నంగా వస్తున్న సంఫ్రదాయం". ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఇండో యూరోపియన్ వలస నమూనాకు ఈ సిద్ధాంతం ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రాల మధ్య ఉన్న గడ్డిభూముల (స్టెప్పీలు) నుండి ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారని, ఆ ప్రాంతమే ఇండో-యూరోపియన్ భాషలకు మూలస్థానమనీ ఇండో యూరోపియన్ వలస నమూనా (ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి కొత్త రూపం) ప్రతిపాదిస్తుంది. భారతీయ చరిత్ర, గుర్తింపుకు సంబంధించి సాంప్రదాయిక, మతపరమైన అభిప్రాయాలపై ఈ ప్రతిపాదన ఆధారపడి ఉంది. హిందుత్వ రాజకీయాల్లో ఈ సిద్ధాంతం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హిందూ మతం, భారతదేశ చరిత్ర, భారతీయ పురావస్తు శాస్త్రాలకు చెందిన పండితులు ఎక్కువగా ఈ సిద్ధాంతాన్ని సమర్ధిస్తారు. ప్రధాన స్రవంతి పండితుల్లో దీనికి అంతగా మద్దతు లేదు. దేశీయ ఆర్యులు అనేవారు భారతదేశ చరిత్రలో ఎక్కడ కనిపించలేదని ప్రధాన స్రవంతి పండితులు ఎక్కువగా నమ్ముతారు.
(ఇంకా…)