వీణా టాండన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీణా టాండన్
జననం (1949-09-07) 1949 సెప్టెంబరు 7 (వయసు 74)
కాశీపూర్, ఉత్తరాఖండ్, భారతదేశం
వృత్తిపరాన్నజీవుల శాస్త్రవేత్త
విద్యావేత్త
క్రియాశీల సంవత్సరాలుSince 1978
జీవిత భాగస్వామిప్రమోద్ టాండన్
పిల్లలు1 కుమారుడు
పురస్కారాలుపద్మశ్రీ
ఇ. కె. జానకి అమ్మల్ పురస్కారం
ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీ వారి జీవిత సాఫల్య పురస్కారం

వీణా టాండన్ (జననం: సెప్టెంబర్ 7, 1949) ఈమె పరాన్నజీవుల శాస్త్రవేత్త, విద్యావేత్త. ఈమె పద్మశ్రీ పురస్కార గ్రహీత.[1]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈమె 1949 సెప్టెంబర్ 7 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాశీపూర్ లో జన్మించింది. ఈమె 1967 లో చండీఘర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి జువాలజీ (బిఎస్సి-హోన్స్) లో డిగ్రీ  విద్యను పూర్తిచేసింది. ఈమె 1968 లో మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్సి) పూర్తి చేసింది. 1973 లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి తన పి.హెచ్.డి ని పూర్తిచేసింది. ఈమె హిమాచల్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తన వృత్తిని ప్రారంభించింది. తరువాత షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయంలో తన పదవి విరమణ వరకు జువాలజీ విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసింది. తన పదవీ విరమణ తరువాత, లక్నోలోని బయోటెక్ పార్కులో చేరారు. ఈమె నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సీనియర్ శాస్త్రవేత్తగా ప్లాటినం జూబ్లీ ఫెలోషిప్ పై హెల్మిన్థాలజికల్ పరిశోధనలను కొనసాగించారు. ఈమె ఈశాన్య భారతదేశం హెల్మిన్త్ పరాన్నజీవి సమాచార డేటాబేస్ (NEIHPID) తయారీలో పాల్గొన్న DIT - నార్త్-ఈస్ట్ పరాన్నజీవి సమాచార విశ్లేషణ కేంద్రం యొక్క ప్రధాన పరిశోధకురాలు. ఈమె పిక్టోరియల్ గైడ్ టు ట్రెమాటోడ్స్ ఆఫ్ లైవ్‌స్టాక్ అండ్ పౌల్ట్రీ ఇన్ ఇండియా, వెదురు పుష్పించే, ఎలుకల నియంత్రణ అనే రెండు పుస్తకాలను ఆమె రచించారు. ఈమె పరిశోధనలు 340 కి పైగా వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆమె ఈశాన్య భారతదేశం హెల్మిన్త్ పరాన్నజీవి సమాచార డేటాబేస్ (NEIHPID) యొక్క సహ రచయిత: హెల్మిన్త్ పరాన్నజీవుల కొరకు నాలెడ్జ్ బేస్, ఈ ప్రాంతం యొక్క పరాన్నజీవి జీవవైవిధ్యానికి సంబంధించిన డేటాబేస్, ప్రభుత్వానికి శాస్త్రీయ సలహా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.

పురస్కారాలు, గుర్తింపులు[మార్చు]

పద్మశ్రీ పురస్కారం

ఈమెను 1998లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎన్నుకుంది. ఈమెను 2005 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీకి ఫెలో ఎన్నికైంది. ఈ.కె జానకి అమల్ పురస్కార గ్రహీత.[2] ఈమెకు 2011 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీ యొక్క జీవితకాల సాఫల్య పురస్కారం. ఈమెకు భారత ప్రభుత్వం నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[3]

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈమె నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయంలో జువాలజీ విభాగంలో మాజీ ప్రొఫెసర్. ఈమె హెల్మిన్త్ పరాన్నజీవి సమాచార డేటాబేస్కు ప్రధాన ప్రేరేపకురాలిగా పనిచేసింది. ఈమె అనేక విశ్వవిద్యాలయాల్లో సైన్స్ కార్యక్రమాల్లో ప్రారంభ ఉపన్యాసాలు ఇచ్చింది. అందులో గువహతి విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్ ఆర్.పి.చౌదరి ఎండోమెంట్ లెక్చర్, కోల్‌కతాలోని జూలాజికల్ సొసైటీ లాంటి వాటిలో ప్రారంభ ఉపన్యాసాలు ఇచ్చింది. ఈమె ఆహార విలువ కలిగిన జంతువులను ప్రభావితం చేసే పురుగు అంటువ్యాధులపై అనేక పరిశోధనలు చేసింది. ఈమె పరాన్నజీవి శాస్త్రంపై రెండు పుస్తకాలు, అనేక వ్యాసాలను ప్రచురించారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈమె నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయం యొక్క మాజీ వైస్ ఛాన్సలర్ ప్రమోద్ టాండన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కంప్యూటర్ ఇంజనీర్, రచయిత ప్రతీక్ టాండన్ కుమారుడు.

మూలాలు[మార్చు]

  1. "Distinguished Scientists". Biotech Park. 2016. Retrieved 25 December 2019.
  2. "Six from Northeast to receive Padma Shri, one Padma Bhushan". The Northeast Today. 26 January 2016. Archived from the original on 28 ఆగస్టు 2016. Retrieved 11 January 2020.
  3. "NASI Fellows". National Academy of Sciences, India. 2016. Archived from the original on 26 డిసెంబరు 2018. Retrieved 11 January 2020.