శంభు ప్రసాద్ తుండియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంభుప్రసాద్ తుండియా
శంభు ప్రసాద్ తుండియా


ఎమ్మెల్యే
పదవీ కాలం
2007 – 2012
ముందు మానహర్ లాల్ మక్వాన
తరువాత పూనంభాయ్ మక్వాన
నియోజకవర్గం దాసడ

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
2014 – 2020

వ్యక్తిగత వివరాలు

జననం (1970-11-14) 1970 నవంబరు 14 (వయసు 53)
జంజార్క. ఢంధూక జిల్లా, అహ్మదాబాద్, గుజరాత్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

శంభు ప్రసాద్ తుండియా గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భారతీయ జనతా పార్టీ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

శంభుప్రసాద్ 1970 నవంబరు 14న గుజరాత్ రాష్ట్రం, ఢంధూక జిల్లా, జంజార్క లో బాల్దేవ్ దాస్, సవితా బెన్ దంపతులకు జన్మించాడు. ఆయన అహ్మాదాబాద్ విశ్వవిద్యాలయం నుండి బి. ఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

శంభుప్రసాద్ తూండియా భారతీయ జనతా పార్టీలో చేరి కార్యకర్త స్థాయి నుండి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2007లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దాసడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి గెలిచి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగుపెట్టాడు. శంభుప్రసాద్ తూండియా 2014లో భారతీయ జనతాపార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికై,[1] 2020 వరకు ఎంపీగా పని చేశాడు.[2] శంభుప్రసాద్ తూండియా 2017లో గుజరాత్ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా పని చేశాడు.[3]

మూలాలు[మార్చు]

  1. The Indian Express (5 February 2014). "BJP, Cong candidates file nomination for RS polls" (in ఇంగ్లీష్). Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
  2. The Indian Express (22 January 2020). "Gujarat: Polls to 4 Rajya Sabha seats by April" (in ఇంగ్లీష్). Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
  3. The Indian Express (10 December 2018). "Gujarat MP demands Dalit member in BJP panel" (in ఇంగ్లీష్). Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.