సిద్ధాంత శిరోమణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సిద్ధాంత శిరోమణీ, ప్రాచీన భారతీయ గణితవేత్త రెండవ భాస్కరుని ప్రధాన రచన. 36 సంవత్సరాల వయసులో (అనగా సా.శ. 1150) రాయబడిన ఈ ఉద్గ్రంథంలో మూడు సంపుటాలుగా, సుమారు 1450 శ్లోకాలు ఉన్నాయి.[1]

భాగాలు[మార్చు]

లీలావతి[మార్చు]

ఇది భాస్కరుడు, తన కుమార్తె లీలావతి పేర రాసాడని ప్రసిద్ధి. ఇది సిద్ధాంత శిరోమణిలోని మొదటి భాగం. 13 అధ్యాయాలు, 278 శ్లోకాలు ఉన్న ఈ గ్రంథం అంకగణితం, కొలతలు గురించి చర్చిస్తుంది.

బీజగణితం[మార్చు]

సిద్ధాంత శిరోమణిలోని రెండవ భాగం బీజగణితం. ఇది 6 అధ్యాయాలుగా, 213 శ్లోకాలుగా ఉండి బీజగణితం () గూర్చి చర్చిస్తుంది.

గణితాధ్యాయం, గోళాధ్యాయం[మార్చు]

సిద్ధాంత శిరోమణిలోని మూడవ భాగమైన గణితాధ్యాయం, గోళాధ్యాయం, జ్యోతిష్య గ్రంథం. ఇది సుమారు 900 శ్లోకాలతో కూడి ఉంది.[2]

మూలాలు[మార్చు]

  1. "khagol Maandal". Archived from the original on 2012-04-20. Retrieved 2013-01-20.
  2. "BHASKAR'S ASTRONOMY". Archived from the original on 2012-04-20. Retrieved 2013-01-20.