హేవ్ లాక్ వంతెన
హేవ్ లాక్ గోదావరి వంతెన | |
---|---|
Coordinates | 17°00′26.6″N 81°45′21″E / 17.007389°N 81.75583°E |
OS grid reference | [1] |
Carries | రైల్వే లైన్ |
Crosses | గోదావరి |
Locale | తూర్పుగోదావరి జిల్లా , రాజమహేంద్రవరం భారత దేశం |
Official name | హేవ్ లాక్ వంతెన |
Other name(s) | గోదావరి వంతెన |
Maintained by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
Characteristics | |
Total length | 2.7 కీలో మీటర్ల |
Design life | 100 సంవత్సరాలు |
History | |
Construction start | 1897 నవంబరు 11 |
Opened | 1900 ఆగస్టు 30 |
Closed | 1997 |
Location | |
హేవ్లాక్ వంతెన ఆంధ్ర ప్రదేశ్లో రాజమహేంద్రవరం వద్ద, గోదావరి నదిపై 19 వ శతాబ్దంలో బ్రిటిషు ప్రభుత్వం ఈ వంతెనను నిర్మించారు.చెన్నై నుండి కోల్కతా రైలు మార్గంలో ఈ వంతెన ఉంది. నూరేళ్ళకు పైగా ఉపయోగపడిన ఈ వంతెన సేవలను 1997 లో భారతీయ రైల్వే నిలిపివేసింది. ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ వంతెనను రైల్వేల నుంది కొని పర్యాటక కేంద్రంగా మార్చింది.
చరిత్ర[మార్చు]
హేవ్లాక్ వంతెన ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ఉంది. బ్రిటిషు ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణాన్ని 47 లక్షల అంచనా వ్యయంతో 1897 నవంబర్ 11 న ప్రారంభించి, 1900 ఆగస్టు 30న పూర్తి చేసింది. 2.7 కి.మీ. పొడవు, 1.7 మీ వెడల్పు తో సర్ ఆర్థర్ హేవ్ లాక్ అనే బ్రిటిష్ ఇంజనీర్ పర్యవేక్షణలో దీని నిర్మాణం జరిగింది. ఈ వంతెన 118 ఏళ్ల చరిత్ర కలిగినది. ఈ వంతెన పై మొట్టమొదట మెయిల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం చేసినట్లు రికార్డులో నమోదయింది.100 ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలు అందించిన ఈ వంతెన పై సేవలను భారతీయ రైల్వే 1997 సంవత్సరంలో నిలిపివేసింది. చివరిసారిగా ఈ వంతెనపై కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణించినట్లు రికార్డ్ నమోదయింది[1]
పర్యాటకంగా అభివృద్ధి[మార్చు]
వాడుక నిలిపివేసిన ఈ వంతెనను 2017 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైల్వే శాఖకు 12.5 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ నిర్మాణంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయించుకుంది.[2]
మూలాలు[మార్చు]
- ↑ "The Havelock Bridge Meorial Stone". 21 March 2009.
- ↑ "Havelock bridge to be developed into tourist spot". The Hindu. 17 December 2008.