పద్యప్రభంజనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్య ప్రభంజనం (పద్యసంకలనం)
పద్య ప్రభంజనం
కృతికర్త: సంకలనం
సంపాదకులు: అవుసుల భానుప్రకాశ్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): పద్య కవిత్వం
ప్రచురణ: మెతుకు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థ, సంగారెడ్డి
విడుదల: జనవరి, 2021
పేజీలు: 624

పద్య ప్రభంజనం దేశభక్తి అంశంపై అవుసుల భానుప్రకాశ్ సంపాదకత్వంలో వెలువడిన పద్య బృహత్సంకలనం[1]. ఈ పుస్తకంలో రాష్ట్రేతర కవుల రచనలు ఉండినప్పటికీ, అవి స్వల్పమే, తెలంగాణ జిల్లాల కవుల రచనలే ఈ పుస్తకంలో అధికం. సుమారు 610 మంది కవుల రచనలతో 624 పేజీలతో వెలువడిన బృహత్సంకలనం ఇది. ఈ గ్రంథాన్ని మెతుకు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థ సంగారెడ్డి ప్రచురించింది. ఈ సంకలనం డిసెంబర్ 2020 లో వెలువడింది. ఆచార్య కసిరెడ్డి, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఈ గ్రంథానికి మార్గదర్శనం చేశారు. కంది శంకరయ్య, డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, దోరవేటి చెన్నయ్య, గుండు మధుసూదన్, పి విట్టుబాబు సంపాదక మండలిగా వ్యవహరించారు. ఆదిలాబాద్ నుండి డాక్టర్ మాడుగుల నారాయణ మూర్తి, కరీంనగర్ నుండి నంది శ్రీనివాస్, ఖమ్మం నుండి ఎన్. సి. ఎచ్. చక్రవర్తి, నల్గొండ నుండి సాగర్ల సత్తయ్య, నిజామాబాద్ నుండి ఎన్. సాయి ప్రసాద్, మహబూబ్ నగర్ నుండి అంబటి భానుప్రకాష్, బస్వోజు సుధాకర్ ఆచారి, మెదక్ నుండి వడ్ల రాజయ్య, వర్కోలు లక్ష్మయ్య, రంగారెడ్డి నుండి గోగులపాటి కృష్ణమోహన్, జి కృష్ణ గౌడ్, వరంగల్ నుండి గుండు మధుసూదన్, హైదరాబాద్ నుండి డాక్టర్ మరుమాముల దత్తాత్రేయ శర్మ, రాష్ట్రేతర ప్రాంతాల నుండి పి. విట్టుబాబు జిల్లాల వారి సమన్వయకర్తలుగా వ్యవహరించి, ఈ పుస్తకం రూపకల్పనలో సహకారాన్ని అందించారు. అష్టకాల నరసింహ రామశర్మ, డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, మామిడి హరికృష్ణ, దేశపతి శ్రీనివాస్, గన్నమ రాజు గిరిజా మనోహర్ బాబు, ఆచార్య సూర్య ధనుంజయ్, ఆచార్య బన్న అయిలయ్య, డాక్టర్ ఎన్. రఘు, డాక్టర్ సాగి కమలాకర శర్మ, డాక్టర్ పత్తిపాక మోహన్, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి గౌరవ సలహా మండలి సభ్యులుగా వ్యవహరించారు.

అనుక్రమణిక[మార్చు]

ఈ గ్రంథంలో అనుక్రమణిక ఈ విధముగా ఉన్నది

  1. ప్రముఖుల ఆశీరభినందనలు,
  2. పద్య ప్రబోధం- ఆచార్య కసిరెడ్డి,
  3. కవితా ప్రభంజనం- శ్రీ పెరంబదూరు రంగాచార్య
  4. అభినందనం- మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్
  5. సుస్వాగతం -డాక్టర్ పూసల లింగా గౌడ్
  6. సంపాదకీయం -అవుసుల భానుప్రకాష్
  7. ఆదిలాబాద్ జిల్లా కవుల కవిత్వం
  8. కరీంనగర్ జిల్లా కవుల కవిత్వం
  9. ఖమ్మం జిల్లా కవుల కవిత్వం
  10. నల్గొండ జిల్లా కవుల కవిత్వం
  11. నిజామాబాద్ జిల్లా కవుల కవిత్వం
  12. మహబూబ్ నగర్ జిల్లా కవుల కవిత్వం
  13. మెదక్ జిల్లా కవుల కవిత్వం
  14. రంగారెడ్డి జిల్లా కవుల కవిత్వం
  15. వరంగల్ జిల్లా కవుల కవిత్వం
  16. హైదరాబాద్ జిల్లా కవుల కవిత్వం
  17. రాష్ట్రేతర కవుల కవిత్వం

పుస్తకావిష్కరణ[మార్చు]

జనవరి 24,2021, రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తు సమావేశ మందిరంలో ‘పద్య ప్రభంజనం అను ఈ దేశభక్తి పద్య బృహత్సంకలనాన్ని తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు[2], మెతుకు సీమ రచయితల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న కవిత, కవుల ప్రయత్నాన్ని అభినందించారు. పుస్తకం చదివిన తర్వాత ఇది ఓ జాతీయ కావ్యంలా అనిపించిందన్నారు కవిత. తెలుగు భాషలో పద్యానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేశారు. ఇలాంటి సాహిత్య ప్రక్రియ ద్వారా జాతిని ఎలా జాగృతం చేయాలనే అంశంపై దృష్టి పెట్టాలని కూడా ఆమె సూచించారు[3], .

మూలాలు[మార్చు]

  1. పద్య ప్రభంజనం, సంపాదకులు: అవుసుల భానుప్రకాశ్, మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ, సంగారెడ్డి ప్రచురణలు,డిసెంబర్,2020
  2. https://www.ntnews.com/telangana/the-leader-who-likes-the-process-of-verse-is-cm-kcr-127025
  3. https://tv9telugu.com/latest-news/mlc-kavitha-launches-padhya-prabhanjanam-398486.html

వెలుపలి లంకెలు[మార్చు]