దూపాడు సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[విజయనగర సామ్రాజ్యం]] చివరి పాదంలోనూ, తరువాత కొంతకాలం [[రాయలసీమ]]లో కొంతభాగానికి స్థానిక నాయకులుగా లేక రాజప్రతినిధులుగా పనిచేసిన ఒక వంశం వారిని '''శాయపనేని నాయకు;ఉ''' అని అంటారు<ref>శాయపనేనివారి చరిత్ర: పరిశోధక గ్రంథము, కొడాలి లక్ష్మీనారాయణ, 1976, ఇతిహాస పరిశోధకమాల</ref><ref>కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>.
[[విజయనగర సామ్రాజ్యం]] చివరి పాదంలోనూ, తరువాత కొంతకాలం [[రాయలసీమ]]లో కొంతభాగానికి స్థానిక నాయకులుగా లేక రాజప్రతినిధులుగా పనిచేసిన ఒక వంశం వారిని '''శాయపనేని నాయకులు''' అని అంటారు<ref>శాయపనేనివారి చరిత్ర: పరిశోధక గ్రంథము, కొడాలి లక్ష్మీనారాయణ, 1976, ఇతిహాస పరిశోధకమాల</ref><ref>కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>.





19:23, 26 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

విజయనగర సామ్రాజ్యం చివరి పాదంలోనూ, తరువాత కొంతకాలం రాయలసీమలో కొంతభాగానికి స్థానిక నాయకులుగా లేక రాజప్రతినిధులుగా పనిచేసిన ఒక వంశం వారిని శాయపనేని నాయకులు అని అంటారు[1][2].


శాయపనేని నాయకులు చరిత్ర శ్రీ కృష్ణదేవరాయల వారి కాలమునుండి తెలియవస్తుంది[3]. తురుష్కులతో జరిగిన యుద్ధములలో శాయప్ప నాయుని శౌర్యపరాక్రమములకు సంతసించిన రాయలవారు శ్రీశైలము దగ్గరవున్న గుడిపాడు గ్రామమును అమరముగా వ్రాసి ఇచ్చిరి. శాయప్ప కొడుకు వేంగళ నాయుడు మరియు మనుమడు వేంకటాద్రి నాయుడు తదుపరి ఈ అమరమును 533 గ్రామములుగా విస్తరించిరి. దీనిని దూపాటి సీమ అంటారు. అరవీటి వంశస్థుల మరియు గొల్లకొండ సుల్తానుల సంధి కాలమున శాయపనేని వారు పలు కష్టములకోర్చి పాలన సాగించిరి. వీరు ఎదుర్కొనిన క్లిష్ఠ పరిస్థితులను దూపాటి కైఫీయతులో ఒక కరణము చాల చక్కగా వర్ణించెను[4].

గంగయ్య నాయుడు 1564 ప్రాంతములో రామరాయల వారి సేనాధిపతిగా ఉన్నాడు. వేంకటాద్రి రచించిన ప్రబంధము 'సకలజనసంజీవనము' తెలుగు సాహిత్యములో ఎన్నదగిన గ్రంథము. గండికోట పాలకుడగు తిమ్మానాయుడు వేంకటాద్రి సోదరి వేంకటాంబను పెండ్లాడెను.

1626లో గంగప్ప నాయుని కాలములో రాయలసీమ గొల్లకొండ సుల్తానుల వశమైనది. శాయపనేని వారు సుల్తానులకు తలొగ్గక తప్పలేదు. 1802లొ థామస్ మన్రో గొల్లకొండ నవాబు నుండి రాయలసీమను పొంది బ్రిటిషు రాజ్యములో కలిపాడు.

మూలాలు

  1. శాయపనేనివారి చరిత్ర: పరిశోధక గ్రంథము, కొడాలి లక్ష్మీనారాయణ, 1976, ఇతిహాస పరిశోధకమాల
  2. కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు
  3. Copper Plate and Stone Inscriptions of South India, Alan Butterworth and V. V. Chetty, 1905, Government of Madras, p. 1174
  4. Textures of Time: Writing History in South India, V. Narayanarau, D. D. Shulman and S. Subrahmanyam, 2003, Other Press LLC, pp. 264-270, ISBN 1590510445