ఆంధ్ర వీరకుమార శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్ర వీరకుమార శతకము
కవి పేరుబి.సూర్యనారాయణమూర్తి
మొదటి ప్రచురణ తేదీ1940
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంఆంధ్రవీరకుమారా!
విషయము(లు)దేశభక్తి, ఆంధ్రాభిమానము
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుకంద పద్యాలు
ప్రచురణ కర్తబి.సూర్యనారాయణమూర్తి, మద్రాసు
ప్రచురణ తేదీ1940
మొత్తం పద్యముల సంఖ్య119

ఆంధ్ర వీరకుమార శతకము[1]ను బి.సూర్యనారాయణమూర్తి 1940లో ప్రకటించాడు. బెజవాడ గోపాలరెడ్డి ఈ పుస్తకానికి తొలిపలుకులు వ్రాశాడు. రచయిత తనకున్న ఆంధ్రాభిమానం ఆంధ్రుల అందరి హృదయాలలో ప్రతిఫలించేటట్టు ఆంధ్రుల చరిత్రలోనూ, ఆంధ్రుల జీవితాలలోనూ ఆంధ్రులు గర్వించి చెప్పుకోదగిన విషయాలు యథోచితంగా పేర్కొని వర్ణించాడు. తన ఆంధ్రాభిమానము సంకుచితమైందని కాదని సూచించడానికి యావద్భారత దేశభక్తిని చాటే పద్యంతో ఈ శతకాన్ని ప్రారంభించాడు.

శీర్షికలు[మార్చు]

  1. ఆంధ్రభాష
  2. ఆంధ్రమహాకవులు
  3. ఆంధ్రక్షాత్రము
  4. ఆంధ్రమహాపురుషులు
  5. ఆంధ్రుల దేశభక్తి
  6. ఆంధ్రనారీమణులు
  7. ఆంధ్రహరిజనులు
  8. ఆంధ్రపూర్వోన్నతి
  9. ఆంధ్రుల దైన్యము
  10. ఆంధ్రప్రతాపము
  11. ఆంధ్రరాష్ట్రము

మచ్చుతునక[మార్చు]

గానాంబృతంబు భక్తి
ధ్యానాంబృత మొకటిగాఁ బ్రజావళిఁ దేల్పం
బూనిన త్యాగబ్రహ్మకు
వే నతులర్పింపు మాంధ్రవీరకుమారా!

మూలాలు[మార్చు]

  1. [1] Archived 2016-03-05 at the Wayback Machineభారతి మాసపత్రిక అక్టోబరు1940 సంచిక పుట128