ఆరోగ్య సూత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1.మధుమేహం: మామిడాకులు రాత్రిపూట నీటిలోకాచి ఉదయం వడకట్టి తాగవలెను. ద్రాక్ష పళ్ళు రోజుకు రెండు, మూడు తినవలెను. మధుమేహం అదుపులో వుంటుంది.

2.ఆస్తమా అదు పులో వుండాలంటే దాల్చిన చెక్క పొడిచేసి ఒక స్పూన్ తేనెకలిపి సేవించ వలెను.

3."రక్తపోటు" నివారణకు ఒకస్పూను తేనె, ఒకస్పూను అల్లం రసం, ఒకస్పూను వెల్లుల్లి రసం కలిపి రోజుకు రెండుసార్లు సేవించవలెను.

4.శొంఠి అనగా ఎండబెట్టిన అల్లం ఇది ఆరోగ్యానికి చాలామంచిది. ఆకలి కలిగిస్తుంది. జలుబు, జ్వరాలకు, కడుపులో గడబిడకు మంచి ఔషధం. ఈ శొంఠి టీలో వేసుకుని తాగితే వెంటనే పనిచేస్తుంది లేదా పొడి చేసి అన్నంలో కలుపుకుని తినాలి. అజీర్ణానికి కూడా బాగా పనిచేస్తుంది. ఈక్రింద సూచించినట్లు పొడి తయారు చేసి సీసాలో తడి తగలకుండా వేసి భద్రపరచుకోవాలి. శొంఠి 50గ్రా, కందిపప్పు 2 tbsp, పెసరపప్పు 2 tbsp, సెనగపప్పు 2 tbsp, ధనియాలు 2 tbsp, నెయ్యి 4 tbsp, ఉప్పు తగినంత, రెండు చెంచాల నెయ్యి వేడిచేసి ధనియాలు పప్పులన్నీ విడివిడిగా వేయించాలి. మెగతా నెయ్యిలో శొంఠి చిన్నముక్కలుగా చేసి రంగుమారేవరకు వేయించాలి. చల్లారాక అన్నీకలిపి, తగినంత ఉప్పు వేసి గ్రైండర్లో పొడి చేసుకోవాలి.

5.ఆరోగ్యానికి అరటిపండు: అరటిపండులో సహజసిద్దమైన చక్కెరలు, పీచుపదార్ధాలు సమృద్దిగా వుంటాయి.గంటన్నరశ్రమకు తగిన శక్తి రెందు అరటి పళ్ళు అందిస్తాయి. మనం టివిలో తరచూ సూస్తుంటాము ప్రపంచ టెన్నిస్ ఆగటగాలళ్ళు ఆటమద్య విరామ సమయములో రెందు పళ్ళు తినటం శక్తినివ్వటమే కాదు, అనేక రోగాలను నిరోదించేగుణం కలది. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడికిలోనైనవారు ఈఫలం తీసుకుంటె ఒత్తిడి తగ్గి మనస్సు ప్రసాంతంగా ఉంటుంది. ఇందులో ఉండే బి6 విటమిన్ రక్తంలోని చక్కరమోతాదుని నియంత్రిస్తుంది.దీనిలోఇనుపధాతువులను రక్తంలోని ఎర్రకణాలను వృద్దిచేసుంది. దీనిలోవుండేఅధికశాతం పొటాషియం వలన రక్తపుపోటుని అదుపులోవుంచి పక్షవాతంరాకుండాఆపుంది. దీనిలోని అధికపీచుపదార్ధంవలన మలబద్దకాన్నినివారిస్దుంది. దీనిని ప్రతిరోజూఏదోఒకసమయంలోభుజించుటవలన మెదడుకి చురుకుదనం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులలో గ్రహణశెక్తినిపెంపోందిస్తుంది. చాతిలో మంటను తగ్గిస్తుంది. వేవిళ్ళలతో బాధపడె మహిళలు వీటిని తింటే చాలవుపశమనంకలుగుతుంది.దోమకాటు వలన వచే వాపు, మంటకు పరటి పండుతొక్కలోపలిభాగంతో రుద్దితే తక్షణంవుపశమనంకలుతుంది.దీనిలోఫుండే B విటమిన్ నాడీమండలానికి మేలుచేస్తుంది. చిప్సు, చాక్లెట్లు తినుట మాని అరటిపండ్లను తినుటవల్ల్ల మానిసిక ఒత్తిడి ల్తగ్గించటమేకాకుండా ఊబకాయాన్ని నివారిస్తుంది.కడుపులో పుండ్లను (ulcers) నివారించుటలో మేటిఫలం. మానసిక ప్రశాంతత కలిగించుటలో ఈపండును మొదటచెప్పుకోవాలి. ధాయ్ లాండ్ దేశంలో గర్బిణిస్త్రీలు విధిగావీటినితినటంద్వారా పుట్టబోయే పిల్లలు సాత్విక స్వభావులుగావుంటారని నమ్ముతారు.ఋతువులమార్పువలన వచ్చే అనేక సమస్యలకు విరుగుడు ఈఫలమే! పొగ తాగే అలవాటుని మానిపించుటలో అరటి పండును గురించి ఆలోచించాలి. ఒత్తిడి తగ్గించేందుకు భోజన విరామ సమయంలో చిరుతిండిగా తీసుకుంటే ప్రయోజనం వుంటుంది. క్రమం తప్పకుండా ఈ పండును తినేవారికి పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం లేదు. ఉలిపిరి కాయలను నిర్మూలించాలంటే అరటిపండు తొక్క లోపలి భాగం ఉలిపిర్ల మీద పెట్టి కదలకుండా ప్లాస్టరుని అతికించినచో క్రమంగా తగ్గుతాయి. ఆపిల్ తో పోలిస్తే నాలుగురెట్లు మాంసకృత్తులు, రెట్టింపు పిండిపదార్ధాలు, మూడురెట్లు భాస్వరం, ఐదురెట్లు విటమిన్ A కలిగివుంది. మీ కాలిబూట్ మెరుపు తగ్గిందా.. అరటి పండు తొక్కలోపలి భాగంతో రుద్దండి ఆ తరువాత పాలిష్ చేయండి, మెరిసిపోతూ వుంటుంది.

6. అనాసపండు: అనాసపండు తినటంవల్ల జీర్ణవ్యస్తమెరుగుపడుతుంది. కీళ్ళవాపులనివారిణి, చర్మవ్యాధులురావు. రక్తపోటురాకుండా గుండెవేగాన్నినియంత్రిస్తుంది.

7. మూత్రపిండాల్లో రాళ్ళు: ఉలవ చారు దానిమ్మపండుగింజలు కలిపి తినవలెను, తులసిఆకులరసం, తేనె కలిపి తీసుకొనవలెను.పుచ్చకాయలు తిన్నయెడల మూత్రపిండాల్లో రాళ్ళు హరించును. లివర్ పనిచేయనియెడల వేడినీళ్ళలో తులసిఆకులుకడిగి తినవలెను. ఇది అజీర్ణమునకు, కడుపునొప్పి నివారింఛును, మలేరియాకు, తలనొప్పికి కూడా మంచి ఔషధము.

8.ఆరోగ్యానికి తేనె:ఈ భూప్రపంచంలో పాడవని పదార్దం ఏదైనా వున్నదా? అని ప్రశ్నించుకుంటే అది తేనె మాత్రమే. చాలాకాలం వాడకపొతే చిన్న చిన్న స్పటికాల్లాగ కనబడుతయి. ఆసీసాను వేడినీళ్ళలో వుంచితే మామూలు తేనెలాగ మారిపోతుంది. దయచేసి తేనెను మిక్రొవేవ్ ద్వారా వేడి చేసేందుకు ప్రయత్నించకండి దానివలన అందులోని పోషకపదార్ధాలు నశిస్తాయి. తేనెతోపాటు దాల్చినచెక్కతోడయితే రోజూ మనం ఎదుర్కొనే ఆరోగ్యసమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకే చాలామంది తేనెను రాంబాణంతో పోల్చుతారు. ఏవ్యాధికైనా తేనెను వాడవచ్చు ప్రతికూల లక్షణాలు ఏమీవుండవు. డయాబెటిస్ సమస్య వున్న వాళ్ళు కూడా తగు మోతాదులో తీసుకోవచ్చు. తేనె దాల్చినచెక్క ఈకింది ఆరోగ్య సమస్యల నివారణకు మంచిది.

గుండెజబ్బులు: తేనె దాల్చినచెక్క పొడి బాగా కలిపి రొట్టెముక్కలపై పరచి జాం లాగ వాడాలి ఇలాక్రమం తప్పకుండా వాడితే కొలెస్ట్రాల్ రక్తనాళాలనుంచి తగ్గించి గుండె పోటు రాకుండా కాపాడుతుంది.

కీళ్ళవాతం:రోజూ పొద్దున్న సాయంత్రం ఒక కప్పు వేడినీళ్ళలో ఒక చెంచా తేనె అరచెంచా దాల్చిన పొడి ఒక్ నెలె రోఫుల పాటు వాడితే నోప్పులు మటుమాయం.

మూత్రాశయం సమస్యలు: రెండు పెద్ద చంచాల దాల్చిన పొడి ఒక చిన్నచెంచాతేనె ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలుపుకొని క్రమం తప్పకుండా వాడితే మూత్రాశయంలోనిబాక్టీరియాను నాశనంచేస్తుంది.

కొలెస్ట్రాల్: రెండుపెద్దచెంచాలు దాల్చినపొడి మూడు చిన్నచెంచాలు తెనె అరగ్లాసు టీనీళ్ళతో కలుపుకొని తాగితే కొలెస్ట్రాల్ అదుపులో వుంటుంది.

జలుపు, పడిశము:ఒకపెద్దచెంచాతేనె, పావుచిన్నచెంచా దాల్చినపొడి కలుపుకొని మూడురోజులు సేవిస్తే జలుబు, దగ్గు తగ్గుతుంది.

కడుపులో గడబిడ: ఒకపెద్దచెంచా దాల్చినపొడి ఒకచిన్నచెంచాతేనె కలుపుకొని తాగితే ఉదర సంబంధిత సమస్యలు, గ్యాస్, పరిష్కారం అవుతాయి.

రోగనిరోధకశక్తి: రోజూకొంచం తేనె దాల్సినచెక్కపొడి కలుపుకుని సేవిస్తే రోగనిరోధకశక్తి పెరుగుదుంది.

అజీర్తి: దాల్చినపొదడి రెండు పెద్దచెంచాల తేనెతోకలిపి భోజనానికి ముందు సేవిస్తే అజీర్తి బాగా పనిచేస్తుంది.

ఇన్ ఫ్లూయింజా: ఒకపెద్దచెంచాతేనెను నోటిలోవేసుకొనిన దీనిలోవున్న పదార్దాలు వ్యాధికారక వైరస్ ను సంహరించి ఉపశమనమును కలుగచేస్తుంది.

దీర్ఘాయిష్: రోజూ నాలుగు చెంచాల తేనె ఒక చెంచా దాల్చినపొడి మూడుకప్పుల నీళ్ళలో కలిపె పొంగించి 'టీ" లాగ మూడు నాలుగు సార్లు తాగితే చర్మము మృదువుగా తయారవుతుంది. వార్ధక్య లక్షణాలను త్వరగా రనీయదు. ఎక్కువకాలం బ్రతకవచ్చు.

మొటిమలు: మూడు పెద్దచెంచాల తేనె ఒకచిన్నచెంచా దాల్చినపొడి పేస్టులాగ కలుపుకొని మొటిమలకి పట్టించి మర్నాడు వుదయం వేడి నీళ్ళతో కడుక్కోవాలి. ఇలారెండు వారాల పాటు ఆచరిస్తే మొటిమలు మాయం.

చర్మ వ్యాధులు: తేనె దాల్చిన్ పొడి సమపాళళ్ళో కలుపుకొని పట్టించాలి. గజ్జి, చిడుము, తామర తదితర చర్మవ్యాధులకు ఇది దివ్యంగా పనిచేస్తుంది.

అధికబరువు సమస్య: ఉదయాన్నేఅల్పాహారానికి ముందు, రాత్రి నిద్రకు వుపక్రమించేముందు ఒక్ పెద్ద చెంచాతేనె 1/2 చిన్న చెంచాదాల్చినపొడి ఒకకప్పు నీళ్ళల్లో మరిగించి తీసుకోవాలి.ఇది క్రమం తప్పకుండాసేవిస్తే అధిక బరువుని నియంత్రించి మరింత కొవ్వుచేరకుంటా చూస్తుంది.

కేన్సర్: జపాను ఆస్ట్రేలియా దేశాలలో జరిపిన పరిశోధనలలో ఉదరము ఎముకల కేన్సర్ కె సమర్ధవంతముగా చికిత్స చేసినట్ట్లు తెలిసింది. ఒక్ పెద్ద చెంచా తేనె ఒక్ చిన్న చెంచా దాల్చిన పొడి కలిపి ఒక నెల పాటు వాడితే మంచి ఫలితాలు సాధించినట్ట్లు రుజవైంది (రోజుకు మూడుసార్లు).

త్వరగా అలిసిపోవుట: ఒక గ్లాసు నీళల్లో పెద్దచేంచాలో సగం తేనె కలిపి దానిపై కొంచము దాల్చినపొడి జల్లి పడగడుపున, మధ్యాహ్నం 3 గంటలకు తీసుకొంటే అలసట మటుమాయం.

నోటి దుర్వాసన: ఫొద్దున్న పళ్ళుశుభ్రంచేసుకొన్న తర్వాత ఒక్ చిన్న చెంచా తేనె రెండు చిటికలు దాల్చిన్ పొడి వేడినీళ్ళల్లో కలుపుకొని రెండు, మూడు సార్లు పుక్కిలించి నట్లయితే రోజంతా తాజా శ్వాస.

వినికిడి లోపం: రోజూ ఉదయం, రాత్రి ఒక చిన్న చెంచా తేనె అంతే ప్రమాణంలో దాల్చినచెక్క పొడి క్రమం తప్పకుండా సేవిస్తే వినికిడి లోపం తగ్గుతుంది.

'మధుమేహం: దాల్చినచెక్క పొడిని అరా టీ స్పూన్ తీసుకుంటే గుండెకు హానిచేసే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ల్యుకేమియా, లింఫోమా (క్యాన్సర్) కారక మాణాల వ్ఱుద్ధిని దాల్చినచెక్క నిరోధిస్తుందని అమెరికాలోని మేరీల్యాండ్ వ్యవసాయ శాఖ పరిశోధకులు నిర్ధారించారు.

మతిపరుపు': వృద్ధాప్యంలో మతిపరుపు రావడమనివార్యము, అయితేయిదితప్పనిసరికాదని జార్గిటౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.పాట్రిషియా హారీస్ అంటున్నారు.వార్ధఖ్యంలో సరైన పోషకాహారం, మందులు వాడుతూ ఉంటే మతిమరుపు రాడంటారు ఆమె. మానసిక ఒత్తిడి లేకుండా, శరీరం ఆరోగ్యంగా ఉంటే మతిమరుపు రాదు.

ఇవి కూడా చూడండి[మార్చు]