ఉద్యోగుల జమ ఆధారిత బీమా పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉద్యోగుల జమ ఆధారిత బీమా పథకం 1976 (Employees’ Deposit Linked Insurance Scheme 1976) - ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ భవిష్య నిధి, పించనుతో పాటు తన సభ్యులకు బీమా సదుపాయాన్ని కూడా అందచేస్తున్నది. ఒక సభ్యుడు సర్వీసులో ఉండగా మరణిస్తే అతనికుటుంబ సభ్యులకు బీమా మొత్తం అందచేయబడుతుంది. బీమా పథకానికి సభ్యులు ఏ మాత్రం చెల్లించరు. యజమానులు సభ్యుల నెలవారీ వేతనంలో (ప్రాథమిక వేతనం + కరువు భత్యం) 0.5% మొత్తాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు ప్రీమియంగా చేల్లిస్తాయి. సభ్యులు దురదృష్టవశాత్తూ మరణించినప్పుడు వారి కుటుంబసభ్యులకు చెల్లించే మొత్తం వారి భవిష్యనిధి ఖాతాలో ఉన్న మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ బీమా పథకం కింద సభ్యుల కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా రూ. 3,60,000 చెల్లించబడుతుంది.

విశేషాలు[మార్చు]

EPFO సభ్యులకు బీమా ప్రయోజనాలను అందించడానికి 1976 లో EDLI పథకం ప్రారంభించబడింది. ఈ పథకం వెనుక EPFO యొక్క ప్రధాన లక్ష్యం సభ్యుల మరణం విషయంలో సభ్యుల కుటుంబానికి ఆర్థిక సహాయం లభించేలా చూడటం. ఈ బీమా పథకం కింద మినహాయింపు లేదు. భీమా కవరేజ్ మరణానికి ముందు ఉద్యోగం యొక్క చివరి 12 నెలల్లో డ్రా చేసిన జీతం మీద ఆధారపడి ఉంటుంది.[1]

కంట్రిబ్యూషన్[మార్చు]

EPFO నిర్వహిస్తున్న మూడు పథకాలకు ఉద్యోగి, అలాగే యజమాని కంట్రిబ్యూట్ చేస్తారు. ప్రతి పథకానికి చేసిన కంట్రిబ్యూషన్ ఈ క్రింది విధంగా ఉంటుంది:

EPFO స్కీము ఉద్యోగి చెల్లింపు యజమాని చెల్లింపు
EPF మూల వేతనంలో 12 % + కరువు భత్యం మూల వేతనంలో 3.67% + DA
EPS N/A మూల వేతనంలో 8.33 % + DA
EDLI N/A 0.5% ( రూ. 75 గరిష్టం)


మూలాలు[మార్చు]

  1. "Employees Deposit Linked Insurance Scheme (EDLI): Benefits, Eligibility & Charges". www.paisabazaar.com.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]