కే.శ్రీనివాస్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కే.శ్రీనివాస్ రెడ్డి
జననం (1949-09-07) 1949 సెప్టెంబరు 7 (వయసు 74)
ఇతర పేర్లుశ్రీనివాస్ రెడ్డి
వృత్తిసీనియర్ పాత్రికేయుడు
జీవిత భాగస్వామికె.భారతి రెడ్డి
పిల్లలు3

కల్మెకొలను శ్రీనివాస్ రెడ్డి (జననం 1949 సెప్టెంబరు 7) ఒక భారతీయ తెలుగు భాషా పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు. గతంలో విశాలాంధ్ర వార్తాపత్రికకు సంపాదకులుగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రజా పక్షం అనే తెలుగు దినపత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నాడు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) సభ్యుడు.

ఫిబ్రవరి 2024లో రాష్ట్రప్రభుత్వం తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. కేబినెట్ హోదా కలిగిన ఆ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతాడు.[1]

కెరీర్[మార్చు]

శ్రీనివాస్ రెడ్డి సైన్స్ డిగ్రీ పట్టాపుచ్చుకున్న ఉన్నత విద్యావంతుడు. ఆయన తన రాజకీయ విశ్లేషణల కోసం అన్ని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్‌లలో కనిపిస్తాడు. ఆయన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కూడా.[2]

మూలాలు[మార్చు]

  1. "Telangana Media Academy: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్ రెడ్డి | K Srinivas Reddy Is Appoints Telangana Media Academy Chairman Sdr". web.archive.org. 2024-02-25. Archived from the original on 2024-02-25. Retrieved 2024-02-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Namasthe Telangana (26 February 2024). "మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్‌రెడ్డి". Archived from the original on 26 February 2024. Retrieved 26 February 2024.