గడియార స్తంభం
వికీపీడియా నుండి
గడియార స్తంభం అనగా ఎత్తైన స్తంభం మీద అందరికీ కనబడేలా ఏర్పాటు చేసిన గడియారం. చాలా గడియార స్తంభాలు చారిత్రక కట్టడాలు. వాటి నిర్మాణం చూపరులకు కనువిందు చేసేలా ఉంటాయి. పూర్వ కాలంలో గడియారాలు సామాన్య మానవులకు అందుబాటులో ఉండేవి కావు. అప్పటి పాలకులు ప్రజల సౌలభ్యం కోసం ఇలా గడియారపు స్తంభాలు ఏర్పాటు చేసేవారు. ఇవి సాధారణంగా నాలుగు దిక్కులకు నాలుగు ముఖాలు సూచిస్తూ ఉంటాయి.
సికింద్రాబాద్లో ఉన్న గడియార స్థంభాన్ని ఆంగ్లేయులు 1860లో కట్టించారు. ఇందులో ఉన్న గడియారాల్ని వ్యాపారవేత్త అయిన దీవాన్ బహదూర్ సేఠ్ లక్ష్మీ నారాయణ్ రామ్ గోపాల్ వితరణగా ఇచ్చాడు.[1]