నరసింగ మిశ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరసింగ మిశ్రా
నరసింగ మిశ్రా


ఒడిశా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
2014 – 2019
ముందు భూపీందర్ సింగ్
తరువాత ప్రదీప్త కుమార్ నాయక్
నియోజకవర్గం బోలంగీర్

శాసన సభ్యుడు
పదవీ కాలం
2004 – 2009
ముందు బాలగోపాల్ మిశ్రా
తరువాత రమాకాంత సేథ్
నియోజకవర్గం లోయిసింగ

వ్యక్తిగత వివరాలు

జననం (1940-12-23) 1940 డిసెంబరు 23 (వయసు 83)
బోలంగీర్ , ఒరిస్సా , బ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి కుసుమ్ మిశ్రా
సంతానం 4 కుమారులు
వృత్తి న్యాయవాది, వ్యవసాయవేత్త, రాజకీయ నాయకుడు

నరసింగ మిశ్రా ( ఒడియా : ନରସିଂହ ମିଶ୍ର ; జననం 23 డిసెంబర్ 1940) భారతదేశంలోని ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 15వ ఒడిశా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

నరసింగ మిశ్రా 1990లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో లోయిసింగ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై బిజు పట్నాయక్ మంత్రివర్గంలో 1990 మార్చి 15 నుండి మార్చి 1995 వరకు న్యాయశాఖ మంత్రిగా పని చేసి, 1995లో బింకా నియోజకవర్గాల నుండి జనతాదళ్ టిక్కెట్‌పై పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2004లో లోయిసింగ నియోజకవర్గం నుండి 2014, 2019లో బోలంగీర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

నరసింగ మిశ్రా జూలై 1999 నుండి డిసెంబర్ 2000 వరకు పశ్చిమ ఒడిశా డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు మొదటి చైర్‌పర్సన్‌గా, ఆ తరువాత 15వ ఒడిశా శాసనసభలో 2014 నుండి 2024 వరకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేశాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. "Odisha Assembly: CLP Leader Narasingha Mishra Stages Sit-in Seeking Vigilance Probe Into Vedanta Land Deal" (in ఇంగ్లీష్). 6 February 2024. Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
  2. The New Indian Express (12 June 2014). "Narasingh Mishra New CLP Leader" (in ఇంగ్లీష్). Retrieved 8 April 2024.
  3. The New Indian Express (10 February 2024). "End of a glorious era as Narasingha, Routray bid farewell to politics" (in ఇంగ్లీష్). Retrieved 8 April 2024.