నామవరపు రాజేశ్వర్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నామవరపు రాజేశ్వర్ రావు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
-

వ్యక్తిగత వివరాలు

జననం (1969-06-30) 1969 జూన్ 30 (వయసు 54)
సూదన్‌పల్లి, కురవి మండలం, మహబూబాబాద్‌ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు ఎన్. సత్యనారాయణరావు, గిరిజాకుమారి
పూర్వ విద్యార్థి పెండేకంటి లా కాలేజీ, హైదరాబాద్

నామవరపు రాజేశ్వర్‌రావు భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 జులై 25న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

నామవరపు రాజేశ్వర్ రావు 1969 జూన్ 30న తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్‌ జిల్లా, కురవి మండలం, సూదన్‌పల్లి గ్రామంలో ఎన్. సత్యనారాయణరావు, గిరిజాకుమారి దంపతులకు జన్మించాడు. ఆయన పాఠశాల విద్య వరంగల్ సరస్వతి శిశుమందిర్, కాలేజీ విద్య గోవిందరావు పేటలో పూర్తి చేసి హైదరాబాద్ లోని పెండేకంటి లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు.

వృత్తి జీవితం[మార్చు]

నామవరపు రాజేశ్వర్ రావు లా పూర్తి చేశాక 2001లో హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి 2015 నుండి 2019 వరకు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా, తెలంగాణలో యూజీసీ, ఎస్ఎస్ఏవో, ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్ ప్యానెల్ న్యాయవాదిగా, 2019 నుండి హైకోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా పని చేశాడు. ఆయన సివిల్, ఆర్థిక నేరాలు, కార్పొరేట్ లా, మోటారు సమాదాలు, సర్వీసుకు చెందిన కేసుల్లో వాదనలు వినిపించాడు. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 జులై 25న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3]

2022 ఆగస్టు 16న హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ సమక్షంలో అదనపు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించాడు.[4][5]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (26 July 2022). "హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలు". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  2. Eenadu (26 July 2022). "హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు". Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  3. Andhra Jyothy (25 July 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు" (in ఇంగ్లీష్). Archived from the original on 26 July 2022. Retrieved 26 July 2022.
  4. telugu, NT News (2022-08-16). "హైకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణం". Namasthe Telangana. Archived from the original on 2022-08-16. Retrieved 2022-08-16.
  5. Sakshi (27 April 2024). "హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్‌ శ్రీనివాస్‌రావు,జస్టిస్‌ రాజేశ్వర్‌రావు". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.