ప్రచురణ విభాగం (భారత ప్రభుత్వం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రచురణ విభాగం, భారత ప్రభుత్వం
స్థాపన1941
ప్రధాన కార్యాలయం స్థానంసూచనా భవనం, లోధీ రోడ్, న్యూఢిల్లీ
యజమాని/యజమానులుసమాచార ప్రచార మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం
అధికార వెబ్‌సైట్http://publicationsdivision.nic.in/

ప్రచురణ విభాగం, (Publications Division (India)) భారతదేశానికి చెందిన ప్రచురణ విభాగం. ఇది న్యూఢిల్లీ లోని సూచనా భవనం ప్రధానకేంద్రంగా పనిచేస్తుంది. ఇది సమాచార ప్రచార మంత్రిత్వశాఖ (భారతదేశం) లో ఒక విభాగం. ఈ కేంద్రం హిందీ, ఆంగ్లం, ఇతర భారతీయ భాషలలో పుస్తకాలను ప్రచురిస్తుంది. ముద్రించిన పుస్తకాల్ని దేశమంతటా విస్తరించిన సుమారు 20 కేంద్రాలు, ఏజెంట్ల ద్వారా విక్రయిస్తుంది.[1] జాతీయ పుస్తక ప్రదర్శనలలో వీరు పాల్గొని ప్రచురణలను ప్రజలకు అందజేస్తారు.

ఈ శాఖ 1941 లో స్థాపించబడి ఇప్పటివరకు సుమారు 7,600 పుస్తకాలను కళలు, సంస్కృతి, జీవితచరిత్రలు, శాస్త్ర సాంకేతిక, జీవశాస్త్ర, బాలలకు సంబంధించిన సాహిత్యాన్ని ముద్రించింది. మహాత్మా గాంధీ రచనలన్నింటినీ 100-భాగాలుగా ముద్రించింది.

ప్రచురణ విభాగం యోజన, ఆజ్‌కల్, కురుక్షేత్ర, బాలభారతి, ఎంప్లోయ్‌మెంట్ న్యూస్ వంటి కొన్ని పత్రికలు కూడా ముద్రిస్తుంది.

కొన్ని తెలుగు ప్రచురణలు[మార్చు]

  • నవ భారత నిర్మాతలు (Builders of Modern India):
    • మోక్షగుండం విశ్వేశ్వరయ్య (రచయిత: వి. సీతారామయ్య)
    • మదనమోహన్ మాలవీయ (రచయిత: సీతారం చతుర్వేది)
    • ఎన్.జి.రంగా (రచయిత: అధరాపురపు తేజోవతి)
    • పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ (రచయిత: మహేష్ చంద్ర శర్మ)
    • కేశవ బలిరాం హెడ్గేవార్ (రచయిత: రాకేష్ సిన్హా)
  • స్పూర్తి ప్రదాతలు
  • భారతీయ సంస్కృతీ వైతాళికులు:
    • కవులు, కథకులు, నాటక రచయితలు
    • ఆలంకారికులు
    • శాస్త్రవేత్తలు
    • భక్తకవులు-మార్మిక తత్వవేత్తలు
    • వాగ్గేయకారులు
  • పౌరులు-రాజ్యాంగం
  • పదునెనిమిది వందల ఏబది ఏడు
  • మహనీయుల మహత్కార్యాలు (రచయిత: ఆర్. కె. మూర్తి)
  • భారత మహాపురుషులు మహోన్నత మహిళలు
  • ప్రాచీన భారతదేశం
  • విదేశీ యాత్రికుల దృష్టిలో భారతదేశం
  • నోబెల్ పురస్కార మహిళా విజేతలు (రచయిత: చిత్రా గర్గ్)
  • సరళ పంచతంత్రం
  • మన జాతీయ పతాకం (రచయిత: కర్మ వీర్ సింగ్)
  • భారతదేశపు బలమైన, రహస్యమయమైన నదులు (రచయిత: అలకా శంకర్)
  • ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్యోద్యమ చరిత్ర (రచయిత: జి. కృష్ణ)
  • ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, సంపత్తి
  • భారత సుప్రసిద్ధ గ్రంథాలు (రచయిత: ఆర్. అనంతపద్మనాభరావు)
  • బాలల భారతదేశ చరిత్ర
  • రవీంద్రనాథ్ టాగూర్ బాలల కథలు
  • బాలల మహాభారతం
  • దేశ విదేశాల కథలు
  • విజయనగర ప్రాభవం (రచయిత: డా. వి. వి. కృష్ణ శాస్త్రి)
  • ఇది భారతదేశం
  • సంగ్రహ భారతీయుల ఇతిహాసం

మూలాలు[మార్చు]

  1. "Archived copy". Archived from the original on 4 March 2016. Retrieved 21 February 2016.{{cite web}}: CS1 maint: archived copy as title (link)