బండ్ల మాధవరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెమట చిత్తడి నేల కవితా సంపుటి ముందుమాట నుండి

"మట్టిని నమ్ముకున్న శరీరాలకు
ప్రతిఫలం ఎప్పుదూ మోసమే"

అని అవగాహన చేసుకున్న కవి బండ్ల మాధవరావు. ఇతని తొలి కవితా సంపుటి చెమట చిత్తడి నేల. నేలా, పొలాలూ, చేలూ, రై తులూ, శ్రామికులూ, సాదారణ జన జీవితాలూ ఇతని కవిత్వ పాదాలు. అటు బురద పట్టిన పాదాలో, ఇటు వేదనతో చేలిన పాదాలో, ఆగిన పాదాలో కాదు. కదుల్తున్న పాదాలు. ఆ పాదాల వెంట మనం కదిలి వెళ్తే మట్టిని నమ్ముకున్న వాళ్ళు ప్రస్తుత వ్యవస్థలో మేసపోతున్న తీరు కళ్ళకందుతుంది.

"రక్తపు చెమటల్ని పవిత్ర విశ్వాసాల్ని
తాకట్టు పెట్టి తెచ్చి చల్లిన మందులు
పురుగుల్ని చంపవుకాక చంపవు."
"నీటి ఊసుల వాగ్దానాలు
నీటిమీద రాతల్లా కలవరపెడుతుండగా
నమ్మకంగా పురుగుల్ని చంపాల్సిన మందులు
నమ్ముకున్నవార్ని అంతం చేస్తున్నాయి"
"పీకిన వేరుశనగ మట్టలకి
ఎండిన తాలుగుండెలు వేలాడున్నాయి"
"పొలేలుగా అని ఎత్తిన చేటకింద
పొల్లు తప్ప మరేం మిగలటం లేదు"

మంచి వెత్తనం దొరకదు. నేరుండదు. విద్యుత్ కొరత. పురుగు మందుల కల్తీ. ఆఖరికి ఎంతో కొంత పంట దక్కితే, గిట్టుబాటు ధర దక్కదు. ఇదీ ఇవాల్టి వ్యవసాయ పరిస్థితి. దీన్ని పట్టించుకొంటున్న కవి బండ్ల మాధవరావు. ఒక కవితో రెండు కవితలో కాదు. "అన్నం మొలకెత్తడమంటే", "పత్తి చేలో దిష్టి బొమ్మ జీవితం", "చాటెడు మబ్బు కోసం", "మట్టిని మోసం చేస్తున్నారు", "హింసాత్మక దృశ్యం", - ఈ కవితల నిండా అతలాకుతలమవుతున్న రైతాంగ జీవితమే. మాయామర్మాలు తెలియని జీవితం కవిత్వ వస్తువైనప్పుడు, కవి నిజాయితీని అతని శిల్పం ప్రతిబింబిస్తుంది. మాధవరావు సాదాసీదా పదాల్తో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. మాటల్లో గారడీ లేదు. వినిర్మాణాలు లేవు. అన్వయ క్లిష్టతా లేదు. వస్తువుకి భాషకీ నడుమ సజాతీయ సంబంధం ఉంది. వస్తువుకి తగిన ఆత్మీయభాషను వాడడం ఇతని కవిత్వంలో సుగుణం. ఒక్క రైతు సమస్యలే కాదు, చుట్టూరా ఏ సామాజిక ఘర్షణ తలెత్తినా పట్టుకుంటున్నాడీ కవి. చేనేత కార్మికుల ఆత్మహత్యలూ, గాట్ ఒప్పద దురాక్రమణలూ గోడలమీదికెగబాకుతున్న అశ్లీల సంస్కృతి రేఖలూ, రోడ్లమీద పడ్డ శిథిల బాల్యాలూ, భావరాహిత్యపు చిర్నవ్వుల అందాలపోటిలూ - అన్నింటినీ రికార్డ్ చేస్తున్నాడు. ఎందుకు? జీవిత శిథిలమవుతుందని చెప్పేందుకే. వాస్తవికతను కళ్ళముందు పరిచి ఆలోచింప జేసేందుకే. వర్తమాన చరిత్రకు కవితాత్మక ప్రతిఫలనం.

- దర్భశయనం శ్రీనివాసాచార్య


అనంతారం: మాధవ్: ఒక అనుపమ ధార.. దేవిప్రియ “కూర్చున్న వాడిని కూర్చున్నట్లే వుంటాను దేహం రంగువెలుస్తూ వుంటుంది, చుట్టూ పరకాయించి చూస్తాను కొండలూ మట్టీ నీళ్ళూ సమస్తమూ రంగుతగ్గుతూ వుంటాయి నా లోలోపల కురుస్తున్న దిగులువర్షాన్ని చేతులు చాచి తాకుతుంటాను” (దిగులు/ అనుపమ) మాధవ్ 2009లో రాసిన ఇరవైయేడు పంక్తుల ఈ పద్యం చదివిన తరువాత నేను భారంగా, దిగులుగా, సాలోచనగా, మౌనంగా వుండిపోయాను. మైనస్ అయిదు డిగ్రీల సెల్సియస్ చలిలో నా చుట్టూ ఎవరో వంద డిగ్రీల మంటని రాజేసి, నన్ను మరిగించి, కరిగించి వేస్తున్నట్టు, అయినా వేదనలో కేక వేయడానికి కూడా నా నోరు పెగలనట్టు...! నిజమే; వెండీముల్ఫోర్డ్ అన్నట్టు అత్యుత్తమమైన, సాంద్రమైన కవిత్వం చదివిన తరువాత మనం వెంటనే మాట్లాడలేము. కాసేపు మౌనంగా వుండిపోతాము. అది ఉన్నత దశకి చేరిన కవిత్వానికి ఒక గీటురాయి.


ముందుమాటకి ముందుమాట మాధవ్; బండ్ల మాధవరావుని, తన చిన్ననాటి మిత్రుల లాగా, నేను కూడా ఇట్లాగే పిలుస్తుంటాను. శివశంకర్ తన మేస్టారు కనకనేమో, మాధవిని 'మాధవా' అని నోరారా పిలుస్తూ వుంటాడు. తన మూడో పుస్తకానికి నేను ముందుమాట - పీఠిక అనేది యేమిటో భారీగా, భారంగా అనిపిస్తోంది ఈ సందర్భంలో రాయాలనే మాధవ్ కాకతాళీయంగా, ఇరుగుపొరుగుగా వుంటున్నాం కనుక దాదాపు ప్రతిరోజూ ప్రతిపాదన ఇంత సుదీర్ఘకాలిక ప్రణాళికగా మారుతుందని తను వూహించివుండడు. పలకరించుకోడం, అప్పుడప్పుడయినా, గంటా రెండు గంటలు కూర్చుని మాట్లాడుకోడం, వీలు చిక్కినప్పుడు తన కారులోనో, నా కారులోనో కాసేపు తిరిగిరావడం... జరుగుతూనే వుంది. కానీ ఈ చిన్న ముందుమాట మాత్రం ముందుకుపోలేదు. సంవత్సరానికి పైనే గడిచిపోయింది. ఈలోపు నేనేమీ రాయలేదా అంటే, అక్షరాలని అమ్ముకుంటూ బతికేవాడికి అదెలా కుదురుతుంది? అది అంతా అధికంగా అసాహిత్యం, అకవిత్వం... పేజీలకి పేజీలు. పుంఖానుపుంఖం. - ఇలాగ కాదని, ఒకటి రెండు రోజులు మాధవిని వెంటబెట్టుకుని మాధవ్ తిరుగాడిన గాలిలో, ఆ నేలమీద, ఆ గుంటూరుజిల్లా కృష్ణా తీర సమీపంలోని గ్రామాలలో తిరిగిరావాలని అనుకున్నాను. అనుకున్న తరువాత ఒక నెలరోజులలోనే ఇది ముడిపడేట్టు చేయగలిగాను. గుంటూరుజిల్లా లోపలి లోకాన్ని చూపిస్తారమ్మని శ్రీధర్ని పసునూరి శ్రీధర్ బాబు - మురిపించి వెంట తీసుకుపోయాను. అంటే ఇది కవిత్రయయాత్ర అన్నమాట. నిజం చెప్పాలంటే ఇది ఒక వంక. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, ముంబై వంటి మహానగరాలకి కాకిలా తిరిగే ఈ తిరగలి బతుకునుంచి రెండు మూడు రోజుల వెసులుబాటు కోసం, మళ్ళీ ఒకసారి నా బాల్యపు, యవ్వనపు మట్టినీ, ఆకాశాన్నీ, చెరువులనీ, కొండలనీ, పైరుపచ్చటి పొలాల మీది నుంచి వచ్చే గాలినీ చూసుకుందామని లోపల యెక్కడో ఆశపడి వుంటాను. గోదావరి తీరాన, ఆది అనువాదకవి ఒక రాజకీయనాయకుడి తాజా వ్యాఖ్యానం ప్రకారం - నివసించిన పుష్కరపట్నంలో జరిగిన ఎండ్లూరి సుధాకర్ కూతురి పెళ్ళి చూసుకుని, అదే రాత్రి కృష్ణా తీరానికి తిరిగివచ్చాము. మరునాటి పొద్దున ప్రకాశం బ్యారేజి దాటి, ఉండవల్లి దగ్గర కుడిమలుపు తిరిగి కృష్ణ ఒడ్డు వెంట, మాధవ్ కవనభూమి అనంతారం దారి పట్టాము. ఉండవల్లి గుహల మీదుగా, సన్నటిరోడ్డు వెంట, పదుల సంఖ్యలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలు, ఒకటీ అరా గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ ఎన్.టి.ఆర్ విగ్రహాలూ, ఒకానొక ఊళ్ళో పరిటాల రవి నిలువెత్తు విగ్రహమూ... తెలుగు నేల ఇప్పుడు గమిస్తున్న రాజకీయ, ఆర్ధిక, సామాజిక దశని ఈ విగ్రహాలు ప్రతిబింబిస్తున్నట్టని పించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, గడిచిన పాతిక ముప్పయి సంవత్సరాలలో వచ్చిన మార్పులు, జరిగిన సామాజిక విచ్ఛిన్నతను ఆయా నాయకుల విగ్రహాల స్థితినీ, దుస్థితిని చూసి అర్ధం చేసుకోవచ్చు. ఒకచోట పచ్చగా పండిన వరి. ఒకచోట సగం పెరిగిన జొన్నచేను, ఇంకొక చోట విశాలమైన చెరుకుతోట, మరొకచోట పచ్చదనం బొత్తిగా లేని బీడు. మాధవ్ కవిత్వానికి అతిసారవంతమైన, పుష్కలమైన ముడి సరుకు సమకూరింది ఇక్కడే. బీడైపోతున్న శరీరాల్ని నాగళ్ళతో దమ్ము చేయాలి శుద్ధిచేసిన విత్తనాలతో మరో కొత్తపంటను పండించాలి! (9-9-1998 - స్పర్శ) ఇంక అనంతారం-అనంతవరం కంటే ఇదే బాగుంది - అయిదు నిముషాలలో చేరబోతున్నామనగా, మాధవ్ ముఖంలో, తరచూ వెళుతున్నప్పటికీ, పాతికేళ్ళ తరువాత ఊళ్లోకొస్తున్న వాడిలా, ఊరువిడిచి వెళ్ళి తిరిగి వస్తున్న ఒక బాలుడిలో కనిపించే ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఒక తన్మయత్వం! నేనీ మధ్య పదేపదే ఉటంకిస్తున్న డేవిడ్ ఇవాన్స్ సువర్ణవాక్యం 'you can take a boy out of Texas but you cannot take Texas out of the boy' - ఇటువంటి సందర్భాలలోనే అద్భుతం అనిపిస్తూ వుంటుంది. అల్లంతదూరం నుంచే, అనంతారం కొండ కనిపించీ కనిపించకముందు నుంచే, మాధవ్ నాకు సజీవ జటాజూట శివుడితో సహా కైలాస పర్వతం యేదో చూపించబోతున్నట్టు, పొంగిపోతూ మాట్లాడుతున్నాడు. ఊళ్ళో ప్రవేశించడానికి ముందు, కొత్తగా వేసిన తారురోడ్డు పక్కనే బోసిపోయి కనిపిస్తున్న గుట్ట దగ్గర కారులోంచి దింపి గుట్టచుట్టూ నడిపించాడు. చిన్న కొండ. గ్రానైట్చిప్స్ కోసం సగానికి పైగా తొలచివేశారు. గుట్టపాదాల దగ్గర యేర్పడిన గుంటనిండా నీళ్ళున్నాయి. దాని కన్నీళ్ళున్నాయనాలా? ఇక్కడిదాకా మమ్మల్ని తీసుకువచ్చిన కొత్తతారు రోడ్డు కింద పరిచింది బహుశా ఈ గుట్టరాళ్ళనే అయివుండాలి.

అనివార్య విషాదం. మాధవ్ 'ముచ్చబోడు' అని 2013 అక్టోబరులో రాసిన పద్యం ఈ పరిసర పర్యావరణ విధ్వంసాన్ని గురించే. ఈ చిన్నకొండ పేరు మాధవ్ పద్యం వల్ల ఇప్పుడు పలువురికి గుర్తుండిపోయింది. ఆ పక్కనే మాధవ్ వాళ్ళ పొలాలు కొన్ని వున్నాయని చూపించాడు. ఊరికి ఇంకొకవైపు మరి కొంత భూమి వుందన్నాడు కానీ, ఈ చేలకీ, ఆస్తులకీ అంతటి ప్రాధాన్యత లేదనుకున్నట్టున్నాడు, వివరం చెప్పలేదు. అనంతారంలో మాధవ్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ నాన్నగారు బండ్ల వెంకటపతి రావు కట్టించిందే. దిట్టమైన . వసారాలో, తెలిమబ్బు తునకలను తెంపుకొచ్చి కుప్పబోసినట్టు పత్తి, ఒక సూక్ష్మ ధవళగిరి లాగ తళతళ లాడుతూ, పైకప్పుని తాకుతోంది. 'అమ్మా' అనగానే ప్రత్యక్షమైంది మాధవ్ని కన్న బంగారుతల్లి సామ్రాజ్యం. చిట్టెమ్మ అంటారంట. మక్కడున్న ఆ అరగంటసేపూ ఆమె, వానాకాలం కోసం యెదురు చూడకుండా యెల్లప్పుడూ ఉరకలెత్తుతూ వుండే కొండవాగులాగ గలగలగలగల మాట్లాడుతూ నే వుంది. డెబ్బయి అయిదేళ్ళు చూసి వుండవచ్చు. అచంచలమైన ఆత్మవిశ్వాసం. అనంతారంలో లేనిది హైదరాబాదులో యేముంది గొప్ప, అనే ధిక్కారం, తిరస్కారం. తన చిన్న ఊరు. తన చిన్న ఇల్లు. తన స్నేహితురాళ్ళు. తన కుటుంబం. తన ప్రపంచం. ఎంత ధీమా! అటువంటి తల్లివుండగా మాధవ్ కవిత్వం మరొకలాగ యెలా వుంటుంది...! కొబ్బరి బూరెలూ, కారంపూస తిని స్వయంగా తానే పెట్టి గాజుకప్పులో తెచ్చి యిచ్చిన కాఫీ తాగి, చిట్టెమ్మతల్లికి నమస్కరించి, బయటకి వచ్చి చిట్టెమ్మ గారబ్బాయి చిటికెన వేలు పట్టుకుని అనంతారం కొండవైపు చూస్తూ ఊళ్ళోకి బయలుదేరాను. వీధుల్లో పోతూవుంటే అనంతారమంతా నాకు తెలిసిందే, నేను చూసిందే అనిపించింది. మాధవ్ మొదటి పుస్తకం 'చెమట చిత్తడినేల' (1998) నిండా పరుచుకుని వున్నది ఈ అనంతారమే. 'స్పర్శ' (2005) పంక్తి పంక్తిలో నేరుగానో, మాటుగానో తొంగిచూస్తున్నది ఈ అనంతారమే. పాపినేని శివశంకర్. శివశంకర్ పుట్టి పెరిగింది కూడా ఈ దగ్గరే. నెక్కల్లు. ఈ మధ్యనే అనంతారం కొండమీదికి, యెప్పుడు లెక్క పెట్టాడోకానీ, 361 మెట్లున్నాయని రా కొండమీదికి మంచి రోడ్డు వేశారు, నాకోసమే అన్నట్టు. కొండపైనుంచి చూస్తే పొలాలు..... మట్టి రంగు, పచ్చరంగు చీరలు రెండుమూడు ఉతికి నేలమీద ఆరేసినట్టు విగ్రహానికి నూనూగు మీసాల నూత్నయవ్వనంలో వున్న పూజారి మంత్ర సేవ చేస్తున్నాడు. కనిపించాయి. పైన చిన్న గుహాలయంలో వున్న చిన్న వేంకటేశ్వర గుడిముందు ఏపుగా, ఎత్తుగా పెరిగిన చిటికేసర చెట్టు కొమ్మల్లోంచి పైకి పొడుచుకు వచ్చినట్టు ఒక చతుర్ముఖ ధ్వజస్తంభం నిలిచివుంది. దానికి వేలాడుతున్న చిరుగంటలు గాలి కాస్త గట్టిగా తోలినప్పుడు, చిన్న శబ్దం చేస్తున్నాయి. అనంతారానికి తిరుగు లేని భద్రత ఉంది. రెండు పెద్ద పెద్ద కొండలు, వెంకటేశ్వరస్వామి కొండ, చెన్నకేశవస్వామి కొండ. ఈ రెండవకొండకి గట్టి దేవుడున్నట్టు లేదు. వైభవమంతా వేంకటేశ్వరుడి కొండకే, అనంతారంలో కూడా! మాధవ్ కవిత్వం - అనుపమ మనిషి మెదడు ఒకే ఒక అంగంలోకి కుంచించుకుపోయింది (బహిరంగ రహస్యం - 1998) అనీ, స్పర్శ మాత్రంతోనే విప్పారాల్సిన దేహం చూసినంత మాత్రానికే ముడుచుకు పోయింది (దేహవిస్ఫోటనం - 2000) అనీ, వెలుపలి నిశ్శబ్దం లోపలి శబ్దాల్ని నిలువరించ లేకపోయింది (2004) అనీ రాసిన కవి ఆలోచనాధార యేమై వుంటుంది? ఆ కవి అంతరంగంలోని ఒరిపిడిలో జనిస్తున్న రవ్వలలో కనబడని కార్చిచ్చు యేదో వున్నదనిపించడం లేదా?అనంతారం అరుగులబడిలో, లూకామేష్టారి దగ్గర అఆఇఈ దిద్దడం నేర్చుకుని, తుళ్ళూరు హైస్కూలులో చదువుకొని, అక్కడనుంచి తాడికొండ సత్యసాయి కాలేజీ మీదుగా, గుంటూరు జె.కె.సి. కాలేజి మీదుగా, కాశీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం చేరి, గంగాతీరంలో ప్రశాంతంగా తెలుగు ఎమ్.ఏ., చదువుకున్నాడు. వ్యాకరణం, అలంకారశాస్త్రం మాధవి కొంతయినా ఒంటపట్టటానికి కాశీచదువు బాగా పనికి వచ్చినట్టనిపిస్తోంది. ఈ విద్యాసముపార్జన క్రమంలో మాధవ్కి తారసపడిన కడియాల రామమోహనరాయ్, పాపినేని శివశంకర్ వంటి అధ్యాపకులు కూడా సామాన్యులు కాదు. వారితో యేర్పడిన సాంగత్యం వల్ల తన ప్రాపంచిక దృక్పధానికి కూడా సరైన, సవ్యమైన మార్గదర్శనం లభించింది. మాధవ్ కవిత్వం చెప్పడం యెప్పుడు మొదలు పెట్టాడో కానీ, అచ్చయిన మొదటి పద్యం ఫిబ్రవరి 1991 ప్రజాసాహితిలో వచ్చిన పద్యంగా 'చెమట చిత్తడినేల'లో నమోదైవుంది. మాధవ్ 1991 నుంచి 2014 వరకు. ఇరవై మూడేళ్ల పాటు ఆధునిక తెలుగు కవిత్వపు దారులలో ప్రయాణం చేశాడు. 'అనుపమ' తన మూడవ పుస్తకమే అయినా, యెక్కడా, యెప్పుడూ తన తాత్వికధారని తెగిపోనీయ లేదు. సృజనపరంగా తన అన్వేషణని ఆగిపోనీయలేదు. తరచూ రాయాలని చెప్పడం సాధనకోసమే. సాధన కవినైనా, వచన రచయితనైనా సానపడుతుంది. మెరుగుపరుస్తుంది. కవికి కానీ, వచన రచయితకి కానీ సోమరితనం పనికి రాదు. కవిత్వం కళ కాదనుకునే వారు కవిత్వం జోలికి రాకుండా వుండడమే మంచిది. ప్రసంగానికీ, కవిత్వానికీ తేడా చూడలేని వారు కవిత్వం జోలికి పోకుండా వుండడమే మంచిది. కవిత్వమంటే మాటలను పోగుచేయడం కాదు, మాటలని పొదగడం. రససిద్ది అంటే కొందరు అదియేదో నిషిద్ద పదమనుకుంటారు. వినేవాళ్ళకి కలిగేది అదే. శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు, ఆరుద్ర, కుందుర్తి, గద్దర్ గొంతెత్తి పాడినప్పుడు, గోరటి వెంకన్న ఆర్ద్రపద చిత్రాలతో పాట ఆలపించినప్పుడూ, బెల్లంకొండ, ఇస్మాయిల్, నగ్నముని, వేగుంట, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ, వరవరరావు, శివారెడ్డి, పాపినేని, ఖాదర్ మొహియుద్దీన్, గోపి, సిధారెడ్డి, యాకూబ్, కలిగిన ఆ గగుర్పాటు, ఆ పులకరం అదే. ఇప్పుడు రాస్తున్న పసునూరి శ్రీధర్ బాబు అఫ్సర్ వంటి ప్రతిభావంతులైన కవుల తొలిపద్యాలు చదివినప్పుడు తెలుగువాళ్ళకి వంటి, మాధవరావు, కొప్పర్తి వంటి అతి కొద్దిమంది కవులు సాధిస్తున్నది, కలిగిస్తున్నది కూడా రససిద్ధినే మాధవ్ 'అనుపమ' ఒక 'జ్ఞాపకాల చెట్టు, నాకైతే ఈ కొత్తపద్యాలు, కొత్తగా రాసిన పద్యాలు చదువుతుంటే ఒక టైమ్ మెషిన్లో కూర్చుని 1960 దశకంలోకి, అప్పటి గుంటూరుజిల్లా గ్రామ జీవనం లోకి వెళ్ళినట్టనిపించింది. 1960 నుంచి, 1990 వరకు, ఈ మూడు దశాబ్దాలలో ఊళ్ళు 'మారిపోయిన' మాట నిజమే. కరెంటొచ్చింది. టెలివిజనొచ్చింది. మొబైల్ ఫోనొచ్చింది. పురుగుమందు లొచ్చాయి. బి.టి. పత్తి వచ్చింది. పొగాకు తోటలు మాయ మయ్యాయి. కొత్త రాజకీయపార్టీలు ప్రవేశించాయి. ఊళ్ళల్లో రంగురంగుల జెండాలు యెగురుతున్నాయి. ఊళ్ళు మారిపోయిన మాట నిజమే. అయినా సన్నకారు రైతులు మారారా? ఊళ్ళల్లో రెక్కాడితేనే కానీ డొక్కాడని వర్గాల ప్రజలు మారారా? సాగుకింది విస్తీర్ణం కుంచించుకుపోతుంటే నిలువరించే ప్రయత్నం జరుగుతోందా? సారాంశంలో ఇటువంటి అనేకానేక ప్రశ్నల ప్రతిధ్వనులు మాధవ్ 'అనుపమ'లో వినిపిస్తాయి. 'అనుపమ'తో మాధవ్ మరింత ఆర్ద్రంగా మారాడు. మరింత సాంద్రంగా మారాడు. కవిత్వ కళ పట్ల మరింత మెలకువతో, మరింత బాధ్యతతో వుండడం అలవరచుకున్నాడు. స్వీకరించే వస్తువును మరింత స్పష్టమైన వెలుగులో చూడగలుగు తున్నాడు. మరింత పదునుగా తన కవిత్వం ద్వారా మాట్లాడగలుగుతున్నాడు. 'చెమట చిత్తడినేల'ను పరిచయం చేస్తూ, ఆనాడు దర్భశయనం శ్రీనివాసాచార్య, పద్య నిర్మాణంలో కనిపించిన లోపాలను గురించి చేసిన హెచ్చరికను సానుకూలంగా స్వీకరించి మాధవ్ ఆ ధ్యాన పెంచుకున్నాడు. దీనికి 'అనుపమ' కవితలలో అనేక ఉదాహరణలున్నాయి. 'ఒంటరిదీపం', 'మౌనవిస్ఫోటనం', 'అంతరించిపోతున్న జాతి', 'జ్ఞాపకాలచెట్టు, 'మిత్తన 'దుఃఖధూళి', 'దిగులు', 'కురవని చినుకుకోసం' వంటి పద్యాలు మనకి మాధవ్ చేస్తున్న కొత్త వాగ్దానాలని నేననుకుంటున్నాను. 'మాధవ్ 1993లో రాసిన 'అసలైన పోస్టర్ కోసం' అనే పద్యం చదివి, ఇటీవలనే శ్రీధర్ బాబు 'కవితా'లో 'అప్రయాణం' పేరుతో తనద్రవ శైలిలో చాలామంచి పద్యం రాశాడు. ఇది ఇద్దరు సమకాలిక కవుల మధ్య అభిలషణీయమైన అవగాహనకీ, పరస్పర స్ఫూర్తికీ, గౌరవానికీ ఒక ఉదాహరణ మాత్రమే కాక, మాధవ్ స్వీకరించే వస్తువుల ప్రవాహ ప్రాసంగికతను కూడా చూపుతోంది.' అనుపమ పద్యాలలో మాధవ్ అవలీలగా స్థానికతను విశ్వజనీనతగా మార్చివేశాడు. అనుపమలో మాధవ్ తననితాను ఫిలసాఫికల్గానూ, ఫిజికల్గానూ ఒక ఏకసూత్రంలో బంధించుకుని, కండెని తిప్పుకుంటూ, విప్పుకుంటూ వెళ్ళమని, ఆ దారపు కొనని మన చేతిలో పెట్టాడు. అనుపమలో యెక్కి ఊళ్ళు తిరిగివచ్చాక, కొండలూ గుట్టలూ యెక్కి దిగివచ్చాక, గుళ్ళూ గుహలూ, శిధిలాలూ, యుద్ధభూములూ చూసి వచ్చాక నాకొకటి అనిపించింది. మొదట మనమంతా పిల్లలం. ఆ తరువాత, కాలం కలిసివస్తే, విద్యార్ధులం. ఆ పిదప పంతుళ్ళం, గుమస్తాలం, రాతగాళ్ళం, భర్తలం, భార్యలం, తల్లులం, తండ్రులం, కొడుకులం, కూతుళ్ళం, తాతయ్యలం, అమ్మమ్మలం, సైనికులం, వైణికులం. మనమే దురాక్రమణ దారులం, మనమే బందీలం, మనమే కాందిశీకులం. అన్నీ తలమీద మోసుకుతిరుగుతూ వుంటాం చివరివరకూ. తన 'అనుపమ'కి ఈ ముందుమాట నేనే రాయాలని భీష్మించి, నేను రాసేవరకు ఏడాదిన్నరకి పైగా అసాధారణ సహనంతో వేచివున్న తమ్ముడు మాధవ్, మాధవి నిరాశలో ఆశ, కల్లోలాలలో ఆసరా అవుతున్న మా అమ్మాయి ఉమకీ మర్యాదకోసమే కాదు, మనసారా నా ధన్యవాదాలు. 20 మార్చి, 2014 హైదరాబాద్.

          • ****** ******

దృశ్యరహస్యాల వెనుక

కవిత్వం వొక సజీవ బంధం మాధవ మట్టిని కవిత్వాన్ని స్పృశించినప్పుడల్లా చీల్చుకుంటూ మొలకెత్తే విత్తనాన్ని ముద్దాడిన తన్మయత్వం కల్గుతుంది. అతని కవిత్వంతో కరచాలనం చేసిన క్షణాల్లో అతని గుండె చెలమలో వూరే చెమ్మ నా యెదలోకి ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. అతని కవిత్వం లోతుల్లోకి పయనించే అనేక సందర్భాల్లో నన్ను నాలోకి తరచి చూసుకుంటున్న అనుభూతి మిగిలింది. అతని కవితాభివ్యక్తితో గాఢాలింగనం చేసిన ప్రతిసారీ నేనూ అతనూ వొకే గూటి పక్షులం లేదా వొకే తల్లి బిడ్డలం అనిపిస్తుంది (we are kind of a thing - sailing in the same boat - అంటారే, అలాంటి feeling అన్నమాట). అందుకు కారణం యిదీ అని నిర్దిష్టంగా చెప్పలేనప్పటికీ యిద్దరివీ దాదాపు వొకే సామాజిక నేపథ్యాలు కావడం వల్ల కావొచ్చు. కృష్ణమ్మకు చెరో వైపు వ్యావసాయిక కుటుంబం నుంచి వొకే విధమైన చదువులు చదివి బోధనా వృత్తిలో యెక్కువ సమయం పిల్లల మధ్య గడపడం వల్ల కావొచ్చు, సొంత నేలకు దూరమైన వలస దుఃఖాన్ని సమంగా అనుభవించి వుండడం వల్ల కావొచ్చు, ఆధునికతని స్వచ్ఛందంగా ఆలింగనం చేసుకొని స్వీయ మూలాల నుంచి విడిపోయిన పరాయీకరణ వేదన నుంచి బయటపడటానికి పడే తండ్లాట యిద్దరికీ వొకలాంటిదే అవడం వల్ల కూడా కావొచ్చు. రాజకీయ ఆచరణ పరిష్కారాల విషయంలో దృక్పథ పరమైన వైరుధ్యాలు అసలుకే లేవని చెప్పలేను గానీ మాధవతో అతని కవితోద్వేగాలతో మమేకం కావడానికి అవి అంతగా అడ్డుకాలేదు. అందుకే కాసేపు మీతో యీ నాలుగు మాటలూ..... నగరం అతణ్ణి కలుపుకొంది గానీ నగరంలో యెందుకో అతను బండ్ల మాధవరావు అనబడే మాధవ స్నేహం అపురూపమైనది. హైదరాబాద్ నాకు అన్నీ యిచ్చినట్టే మాధవ ప్రేమనూ యిచ్చింది. నగరం అతడ్ని కలుపుకొంది కానీ నగరంలో ఎందుకో అతను ఇమెడలేకపోయాడు. చాలామందిలా నాగరికాన్ని అలవరచుకోలేకపోయాడు. ఎక్కడో బలంగా గాయపడ్డాడు. దేవిప్రియ,శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్, కెపి అశోక్ కుమార్ లాంటి సాహితీ మిత్రులు కట్టిపడేయలేకపోయాయి. చివరికి అన్నీ వొదులుకొని వొట్టి చేతుల్లోనే షరతులేని ప్రకటిత అప్రకటిత వాత్సల్య బాంధవ్యాలు కూడా పుట్టినూరికి పయనమయ్యాడు. అతణ్ణి హైదరాబాద్ కీ విజయవాడ అని పిల్చుకునే బెజవాడ కీ సాపత్యమే లేదు. హైదరాబాదు అన్ని విధాలా మెట్రోపాలిటన్ నగరం, గట్టిగా మాట్టాడితే విశ్వనగరం. ఊరి వాసన వదలని పట్టణం బెజవాడు. ఊరివాసన వదలని తనమే మాధవలోనూ వుంది. అందుకే మళ్ళి సొంత గూటికి చేరుకున్నాడు. కానీ కళ్ళముందు స్వప్నం సాకారమయ్యే లోపు గూడు చెదిరిపోయింది. ఉన్నది కోల్పోయినా పొందిన కొత్తదానితో రాజీ పడదామనుకున్నా అదీ మిగలలేదు. 'చనుబాలధారతో కడుపు నింపే ఊరు నన్ను అక్కున జేర్చుకొని ఊరడించే అమ్మ' (ఊరంటే అమ్మ - 2002) అనుకున్నాడొకప్పుడు. కానీ ఆ అమ్మ అంగడి సరుకయ్యింది. మనుషుల్ని మార్కెట్ కబళించింది. అధికారమే అందుకు రాదారి పరిచింది. హాం ఫట్... ఇళ్ళు మాయం. వూళ్ళు మాయం. అరచేతిలో వైకుంఠం. వాకిట్లో స్వర్గం, క్షణంలో సగంలో ఇంద్రనగరాలు, వర్చ్యుయల్ పంచరంగుల కలల ప్రపంచం కళ్ళ ముందు సాక్షాత్కారం. రాజ్యమే మంత్రగాడు. బడా జాదూగర్, కొండలు గుట్టలు చెరువులు దొరువులు నదుల కరకట్టలు ముక్కారు పంటల పొలాలు... నేలంతా అన్యాక్రాంతం. ప్రభుత్వమే కబ్జాదారు. ఆత్మహత్యలు, మిస్సింగ్లు, ఎన్కౌంటర్లు... అన్నీ నిశ్శబ్ద హత్యలే. పాలకులే హంతకులు. యెక్కడ తేడా కొట్టిందో తెలుసుకునే లోపే అంతా చేజారిపోయింది. సమీకరణ సేకరణ విస్తాపన పునరావాస 'క్రీడ'ల్లో మనిషి చెదిరిపోయాడు. రాజకీయ ఆబోతుల కాళ్ళమధ్య నలిగిన లేగదూడ అయ్యాడు. నగరాల్ని ప్రజలు చీమల్లా నిర్మిస్తే అవి యే పాముల పాలవుతాయో యే స్వార్థ రాజకీయాల నెలవులవుతాయో తెలిసినా నిస్సహాయుడయ్యాడు. పాలస్తీనా పౌరుల్లా సొంత నేల మీదే పరాయి అయ్యాడు. అయినా సొంత కాళ్ళ మీద నిలదొక్కుకోవాలనే పదే పదే ప్రయత్నించాడు. A person who has not been completely alienated, who has remained sensitive and able to feel, who has not lost the sense of dignity, who is not yet "for sale", who can still suffer over the suffering of others, who has not acquired fully the having mode of existence - briefly, a person who has remained a person and not become a thing - cannot help feeling lonely, powerless, isolated in present-day society, అంటాడు Erich Fromm The Art of Beingలో. 'ఎవరు - ఎప్పుడు - ఎక్కడ - ఎందుకు - తమను కోల్పోతారో తాము కాకుండా పోతారో - నిరంతర అన్వేషణ' (పునర్యానం). తనను తాను కాపాడుకోడానికి యెప్పట్లానే మాధవరావు సేద తీర్చే కవిత్వాన్నే ఆశ్రయించాడు. కవిత్వాలంబనతో జీవితాన్ని గెలవాలని తపించాడు. పరిస్థితులతో సంఘర్షించాడు. దుస్సహ వేదననుంచి విముక్తం కావడానికి తానే కవిత్వమయ్యాడు అంటే సమంజసంగా వుంటుందేమో! మనిషి కవిత్వం కావాలంటే హృదయం వుండాల్సిన చోటే వుంటే చాలంటారు. కానీ ఆ హృదయానికి చెమ్మగిల్లే కన్నుండాలనీ సున్నితత్వాన్ని కోల్పోనివాళ్ళే క్రియాశీలక కవులు కాగలరు అనీ మాధవ మరోసారి నిరూపించాడు. ఈ సంఘర్షణలో యెక్కడైనా వొకానొక బలహీన క్షణంలో మాత్రమే 'మట్టి నాది కాకుండా పోయాక రైతు పదానికి నేను రాజీనామా చేశాక నేలతో బంధం తెగినప్పుడే నీటితోనూ బంధం తెగిపోయింది' (అకాల వర్షం) అని ప్రకృతి మీద అలక ప్రకటిస్తాడు. ఇది మాధవ స్వభావానికి వ్యతిరేకం. అన్ని విధాలా పరాయికరణకు ఇది పరాకాష్ట.భూనిర్వాసితుల గోస యిది. అనుభవిస్తే గానీ అర్థం కాని మానసిక వ్యతిరేకం. అన్ని విధాలా పరాయీకరణకు యిది పరాకాష్ట అని ప్రకృతి మీద అలక ప్రకటిస్తాడు. ఇది మాధవ స్వభావానికి స్థితిని అతరంగా ఆవిష్కరించాడు మాధవరావు, అయితే కేవలం వైయక్తిక వేదన కాదు. అనేక సమూహాలది. ఎన్ని కోల్పోయినా సామూహిక చేతనను స్పృహను కోల్పోకుండా వున్నందువల్లే - - మట్టితో తన అనుబంధాన్ని 'నేలకూలిన చెట్టు అంటుకట్టుకోవాలని తపిస్తోంది' (సందిగ్ధప్రశ్న) అని అంతిమంగా ప్రకృతికీ మనిషికీ మధ్య వుండాల్సిన సజీవ సంబంధాన్ని ఆదృష్టి తో వీక్షించాడు. ఆ కారణంగానే శ్రమ పరాయీకరణ చెందే సూక్ష్మ మూలాల్ని సైతం అతను కవిత్వీకరించగలిగాడు. 'నోట్ల కల'లో మాధవరావు వ్యక్తం చేసిన సామాజిక రాజకీయ ఆర్థిక దృష్టి కోణం మార్క్స్ చెప్పిన అదనపు విలువ సిద్ధాంతానికి సంక్షిప్త సూత్రీకరణలా కనిస్తుంది. శ్రమ పరాయీకరణ దోపిడీలపై నిర్మితమయ్యే పెట్టుబడిదారి సమాజం పట్ల అతని సైద్ధాంతిక అవగాహనకి శాస్త్రీయ దృక్పథానికి దృష్టాంతంగా కనిపించే యీ మాటలు చూడండి: 'శ్రమలోంచి కారిన చెమట నోట్లుగా మారాల్సిన చోట రక్తం బొట్లుగా మారుతుంది. నోట్లు నోట్లను సంపాదించిన చోట శరీరకష్టం చెమటనో ఆకలినో ప్రసాదిస్తోంది.' వర్గ స్పృహతో యిలా సూటిగా చెప్పిన అంశాన్నే మట్టికీ ముద్దకీ మధ్య నిలిచిన రక్తపుటేరులు ఎప్పటికి ఇంకిపోతాయో అని పరోక్షంగా ప్రశ్నించాడు. శ్రమజీవికష్టం ఫలించాలని, ఆకలి పోవాలని ఆశించాడు. అదే సమయంలో అత్యాధునిక సమాజంలో మనిషిని పరాయీకరించే 'సాలెగూళ్ళు ' బలపడుతున్న కొద్దీ కార్పొరేట్ శక్తులు విస్తరిస్తున్న మేరా మానవ సంబంధాలు అదృశ్యమౌతున్నాయన్న ఆవేదన నిరంతరం అతణి విడవకుండా వెంటాడుతూనే వుంది. ఆ అశాంతి నుంచి బయటపడే తపనే అతని కవిత్వంలో ప్రతిఫలించింది. విస్పష్టమైన రాజకీయ అవగాహన దాని బలం. అది అన్ని విధాల నిర్మాణాత్మకం. కవిత్వ రూపంలో గానీ సారంలో గానీ వినిర్మాణానికి మాధవరావు వ్యతిరేకి. ఆధునికోత్తరవాదుల వినిర్మాణం భావ వినిమయానికి అడ్డంకి అని అతను భావించి ఉండవచ్చు. గూఢత అతని కవిత్వ నిఘంటువులో లేదు. తనదైన ప్రాపంచిక దృక్పథాన్ని ప్రకటించడానికి అస్పష్టతకీ సంక్లిష్టతకీ సందిగ్ధతకీ కావులేని సూటైన వచనాన్నే అతను యిష్టపడ్డాడు. దేన్నైనా నేరుగా చెప్పడమే అతనికి అలవాటు. తాగుబోతు వ్యక్తావ్యక్త ప్రేలాపన లాంటి పరస్పర అసంబద్ధ పదాల కూర్పే కవిత్వం తక్కినదంతా అకవిత్వమనీ దబాయించే సాహిత్య అరాచక వాదులకు మాధవరావు కవిత్వం సరైన జవాబు, దృక్పథ రాహిత్యాన్ని వున్నతీకరించే శుద్ధ కవితాభిలాషులకు అతని అభివ్యక్తి నచ్చకపోవచ్చు. అందువల్ల వచ్చే లోటేం లేదు. కవిత్వం - లోపలికి బయటికి చేసే ప్రయాణాల పౌనఃపున్య పరంపర. అది కేవలం ఆత్మిక అనుభవమో మనో వ్యాపారమో కాదు. అదొక సామాజిక ఆచరణ. సరైన దృక్పథం దాని జీవ ధాతువు, మాధవరావు దాన్ని బలంగా నమ్ముతున్నాడనడానికి మరో రుజువు యీ 'దృశ్యరహస్యాల వెనుక'. దృక్పథ ప్రధానమైన కవిత్వంలో సిద్ధాంత ప్రమేయాలు యెక్కువై కవిత్వం కుదించుకు పోతుందనీ అలాంటి కవిత్వం నినాదప్రాయమైపోతుందనీ ఆరోపణలు వింటుంటాం. అది తప్పని చెప్పడానికి యెన్నో వుదాహరణలు కళ్ళ ముందు వున్నా చూడడానికి నిరాకరిస్తాం. మాధవరావు కవిత్వాన్ని రాజకీయ అభిప్రాయ ప్రకటనకు సాధనంగా యెన్నుకోడానికి సంకోచించలేదు. చుట్టూ జరుగుతున్న దుర్నయాన్ని చూసి మౌనంగా వుండలేనితనమే అందుకు ప్రేరణగా నిలిచిందని ఆయా సందర్భాల్లో స్పష్టంగా గమనిస్తాం. అయితే అతని భావజాలం యిదీ అని పద్యంలో యే వొక్క పంక్తిలోనో యెత్తిచూపడానికి వీలులేకుండా కవిత అంతటా పరుచుకొని వుంటుంది. ఒక రాజకీయ దృక్పథంతో మాధవరావు కూర్చిన కవితలు నడుస్తున్న రాజకీయ చరిత్రలో కవిగా అతను యెక్కడ యెవరి వైపు నిలబడ్డాడో తెలియజేస్తాయి. దృశ్య రహస్యాల వెనుక, కుంకుమ పూల విధ్వంసం, మళ్ళీ ఓ కొత్త తవ్వాయి వంటి కవితల్లో దీన్ని స్పష్టంగా చూడవచ్చు. సామాజికంగా రాజకీయంగా కల్లోల కాలంలో పుట్టి మధ్య, కుదించుకుపోతున్న ప్రజాస్వామిక స్థలాల మధ్య, వివిధతు కవిత్వమిది. అనేక సంక్షోభ సందర్భాల మధ్య, విషాద సమయాం భిన్నత్వాన్నీ హరించే వొకే జాతి వొకే సంస్కృతి వొకే భాష వంటి ఏక ధృవవాదాల మధ్య, అల్పసంఖ్యాకులపై majoritarianism ఆధిపత్యం హింసాత్మకంగా అమలవుతున్నప్పుడు, ప్రశ్నించే ప్రతి స్వరాన్ని దేశద్రోహంగా నిర్ధారిస్తున్నప్పుడు మాధవరావులో ముందుకు వస్తాడు. పాలితుల దుఃఖాన్ని అందుకుంటాడు, గుండెలోపలి కవి యెటువంటి తడబాటు లేని నిక్కమైన లౌకిక ప్రజాస్వామ్యవాదిగా అలజడిని వినిపిస్తాడు. 'దీపాల కింద చీకట్ల గురించి ఎవరో ప్రశ్నిస్తారు. ప్రశ్నల అణచివేత నిరాటంకంగా రించుకుంట పోతుంది' (అబ్రకదబ్ర) యిది మాధవరావు 2004లో అన్నమాట. ఈ రోజు అణచివేత మరింత క్రూరంగానూ కవటంగానూ విస్తరించింది. అప్రకటిత నియంతృత్వం వూడలు దిగింది. భిన్నాభిప్రాయాలకు తావు లేదు. అసహనం పెచ్చు పెరిగింది. దేశభక్తి పేరుతో ఫాసిజం విజృంభిస్తుంది. రాజ్యాంగ బద్ధమైన హక్కుల్ని రాజ్యమే హరిస్తుంది.. 'గొంతులోంచి మాట బయటకు రాకముందే గొంతు చుట్టూ బిగుస్తున్న ఉరితాళ్లు అనేక అణచివేతల మధ్య ప్రశ్నపై వాడు ఆధిపత్యం చలాయిస్తున్నాడు. భక్తికీ కొన్ని తూకాలుంటాయి. గోవులో కొన్ని తులసిదళాలో నాలోని దేశభక్తిని ఎప్పటికప్పుడు కొలుస్తూవుంటాయి' (దృశ్య రహస్యాల వెనుక) వ్యవస్థీకృతమైన హింస ప్రైవేటు వ్యక్తుల ద్వారా అమలై ఆమోదముద్ర వేయించుకుంటుంది. చట్ట సభలే మూకస్వామ్యాన్ని పెంచి పోషిస్తున్నాయి. దృశ్య రహస్యాల వెనుక వున్న (అస్పష్ట దృశ్యమే అన్నట్టున్నా కనపడని 'పెగసస్' లాంటి రహస్యమేదో దాగువుంటుంది.) దుర్మార్గ ప్రణాళికల్ని మాధవరావు బహిర్గతం చేస్తున్నాడు.

అనేక పోరాటాల తర్వాత 370, 35 ఎ ద్వారా కశ్మీర్ ప్రజలు సాధించుకున్న స్వయం ప్రతిపత్తిని హరిస్తూ చట్టాలు తయారయ్యాయి. అక్కడ సైన్యం పహరా లోపల యే నిమిషం యేమౌతుందో బయటి ప్రపంచానికి తెలీదు. ఎన్ని కుంకుమ పూలు మిలటరీ బూట్ల కింద నలిగి నెత్తురు ప్రవహిస్తుందో చెప్పడానికి భద్ర - బుద్ధిజీవులు సంకోచిస్తున్నప్పుడు మానవ హక్కుల విధ్వంసాన్ని కవిత్వ మాధ్యమంగా నిర్భయంగా నిరసిస్తున్న సాహసి మాధవరావు. కశ్మీరం క్షతగాత్ర యుద్ధ క్షేత్రమనీ మానవ హక్కులకు అక్కడ చోటులేదని ఆవేదన చెందుతున్నాడు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలకులు చేపట్టే చర్యలు నిష్ఫలమని తీర్మానిస్తున్నాడు. 'బతకడమే యుద్ధమవుతున్న చోట ఎవడెందుకు ఆయుధమవుతున్నాడో ఎవడెందుకు మందుపాతరవుతున్నాడో కారణాలు సమాధువులవుతుంటాయి వాడి కళ్లూ చెవులూ మూసేసి నువ్వెవడినో ఒప్పించడానికి మాట్లాడుతుంటావు దేశమంతా ప్రశాంత దృశ్యాలు జాలువారుతుంటాయి పై పై పూతలు లోపలి గాయాల్ని మరింత మరింత స్రవింప చేస్తుంటాయి ఎప్పటికీ ఏ దారప్పోగూ ముక్కలైన యీ నేలను కలిపి కుట్టలేదు గాయం నేలకైనా దేహానికైనా నిత్యం రక్తం ఓడుతూనే ఉంటుంది. ' (కుంకుమ పూల విధ్వంసం) మతతత్త్వవాదులు యెప్పుడు అధికారంలోకి వచ్చినా యీ విధ్వంసం వాళ్లకు ప్రధానమైన ఎజెండాగా వుంటుందని మాధవరావు రెండు దశాబ్దాల కిందే హెచ్చరించాడు. నా దేహం మీద కప్పాల్సిన కఫన్ రంగు కాషాయంగా వివర్ణమైన వర్తమానం గురించే యీ సంపుటి ఎక్కువగా ఉండాలంటాడు. (సంధ్యార్థవాలు 2000) గా గోచరిస్తుంది. మాట్లాడటం వల్ల ప్రతి కవితా చాలా ఫ్రెష్ గా వర్తమానంతో సంధానం లేని యే సాహిత్యమైనా ప్రయోజనం లేనిద్ర అని నా గట్టి నమ్మకం. దృశ్యరహస్యాల వెనుక ' present time poetry. 'అనుపమ జ్ఞాపకాల చెట్టు. ఎక్కువ భాగం అది గతం మీద కేంద్రీకృతం. కరోనా సృష్టించిన సామాజిక కల్లోలంలో రోడ్డున పడ్డ వలస కార్మికుల వేదన, మానవ సంబంధాలు విచ్ఛేదన, కార్పోరేట్ కి అనుకూలంగా రూపొందిన వ్యవసాయ చట్టాల కింద నలిగే రైతుల రోదన, సాంస్కృతిక జాతీయవాదం పేరుతో నిర్బంధంగా అమలయ్యే ఫాసిజం, గత శవ రాజకీయాలు, ఉబుసుపోని సామాజిక మాధ్యమ వుద్యమాలు... యిలా ఎన్నో సంఘటనలు కవిత్వానికి వస్తువులయ్యాయి. వస్తు వైవిధ్యం యీ సంపుటిలో ప్రధానంగా కనిపించే ప్రత్యేకత. పత్రికల్లోనో టీవీ తెరమీదో సోషల్ మాధ్యమం లోనో కనిపించే ప్రతి వార్తనీ సంచలనం కోసం కవిత్వంగా మలిచే వుబలాటపు కవులు వొక చివర, సంఘటనల్ని సాహిత్యీకరించడాన్ని తిరస్కరించే విమర్శకులు మరో చివర నిలబడి వున్నప్పుడు తనను కదిలించిన సందర్భాన్ని మాధవరావు గొప్ప నేర్పుతో సంయమనంతో కవిత్వంగా మలిచాడు. సాహిత్య విలువలతో రాజీ పడకుండానే యే పార్టీ పాలనలో వున్నా ప్రజల పక్షంలో స్థిరంగా నిల్చి తన రాజకీయాభిప్రాయాల్ని బలంగా వ్యక్తీకరించాడు. అలా రాసిన వాటిలో 'నగరాన్ని ముట్టడించిన నాగళ్ళు ప్రత్యేకంగా పేర్కొనదగింది. రైతుల నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత దూకుడుగా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా స్పందిస్తూ చెప్పిన మాటలు చూడండి. 'నేను నీ కోసం విత్తనాన్నె మట్టిని చీల్చుకొని తలెత్తి నిలబడుతుంటా నువ్వు నా కోసం రహదారుల్లో మేకుల్ని మొలిపిస్తుంటావు' అన్నప్పుడు యేకకాలంలో దేశానికి తిండి పెట్టే కర్షక వీరుల శ్రమని వున్నతీకరించడం వారి నిరసించే హక్కుని సైతం కాలరాసే పాలకుల క్రూరత్వాన్ని తెగనాడడం కనిపిస్తుంది. ఎప్పటికైనా 'నగరాన్ని ముట్టడించిన నాగళ్ళదే అంతిమ విజయం అన్న హెచ్చరికతో కవిత ముగుస్తుంది. పార్లమెంట్ లో అధికార పీఠంపై కూర్చున్న రాజకీయ పార్టీలతో అతనికి ప్రమేయం లేదు. కార్పోరేట్ కి దళారులుగా వ్యవహరించేవాళ్ళెవవరైనా అతని దృష్టిలో ప్రజా శత్రువులే. దేశాన్ని ప్రపంచీకరణకి ప్రయోగశాల చేసిన నాటి 'స్పర్శ' సంపుటిలో కూడా యిటువంటి పంక్తుల్ని చూస్తాం. మొన్సాంటోల విస్తరణ ఊబిలోకి మట్టికాళ్ళు దిగబడతాయి (దృశ్యం విరిగిన చప్పుడు 1998) వేల వేల దుక్కుల్ని దున్నిన చేతులు విత్తనాల మొదళ్ళని స్పర్శించిన పాదాలు పనికిరాని పనికిమాలిన నాగళ్లవుతాయి (అర్రు కడిగిన జీవితం 1999) మొదటి కరోనా సందర్భంగా అకస్మాత్తుగా అనాలోచితంగా లాక్ డౌన్ ప్రకటించినప్పుడు కోట్లాది మంది వలసకార్మికులు వందలాది మైళ్ళు సొంత యిళ్ళకు నడిచి వెళ్తున్నప్పుడు రాసిన కవితలు ఎక్కడిదాకో, అమ్మ కడిగిన పాదం. సంఘటనల పట్ల యే కవైనా స్పందించకుండా యెలా వుండగలరో నాకైతే అర్థం కాదు. ' పగిలి ఎర్రముద్దలైన నీ పాదాలను నా శిరస్సున ఉంచి ఊరేగిస్తాను' వంటి సహానుభూతి కవి హృదయం మాత్రమే ప్రకటించగలదు. నేలతల్లి కడిగిన పాదం దేశం సింహాసనాన్ని నిలదీస్తోంది అని చివర్లో అన్న వొక్క వాక్యం ten commandments తో సమానం. స్వీకరించిన వస్తువే రూపాన్ని నిర్దేశిస్తుంది అన్న సూత్రీకరణ నిజమే అని యీ సంపుటిలోని కొన్ని కవితల్ని చూసినప్పుడు తప్పక వొప్పుకుంటాం. కథని కవిత్వంగా కన్సీవ్ చేసే విద్యని మాధవరావు సానబడుతున్నాడని ఇల్లు, ఊరు రాజధానయ్యింది, విరిగిన కల, జ్ఞాన వృక్షం ఓ సంజాయిషీ స్వరం, చిట్టి తల్లి, మాయమైన చేతులు, నేను కాని నా చిత్రం, తానూ నేనూ వంటి కవితల్లో గమనిస్తాం. కథలకు వస్తువులు వొక్కోసారి ఘటనలైతే కొన్నిసార్లు ఆ ఘటనలు కల్గించిన ప్రకంపనలు కావొచ్చు. మరో సారి వాటికి కారణమయ్యే కవితలోకి చొచ్చుకొని వస్తాయి. చివరికి పరిపూర్ణమైన కథ వొకటి సామాజిక చలనాలు వాటి నుంచి పుట్టే అంతరంగ కల్లోలాలు రూపొందుతుంది. అవసరం కొద్దీ అందులో జీవితానికి సంబంధించిన అనేక పొరలు నిర్మితమౌతాయి. వొక ఉదాహరణ చూద్దాం : 'ఇల్లు' కవిత గతం వర్తమానం భవిష్యత్తు - త్రికాలాల్లో నడుస్తుంది. 'అక్కడో ఇల్లుండేది' అనగనగా లాంటి యెత్తుగడతో మొదలు పెట్టిన యీ కదా కవితలో రచయిత గత స్మృతుల నోస్టాల్జియా నుంచి యింట్లో యింటి చుట్టూ వున్న సజీవ నిర్జీవ ప్రపంచంతో సంభాషణ నెరపుతూ భిన్న సామాజిక సాంస్కృతిక అంశాల్ని నెమరువేస్తూ అకస్మాతుగా వొక్క కుదుపుతో పఠితల్ని వర్తమానంలోకి తీసుకువస్తాడు. 'రాజధాని మా వూర్లోకి చొరబడింది. ఊరు నగరపు దేహాన్ని కప్పుకుంటూ పురాస్మృతుల కుబుసాన్ని విడుస్తోంది' అని చెప్పి - 'ఇప్పుడక్కడ ఇల్లు లేదు అని వొక విధ్వంస దృశ్యాన్ని ముందుకు తెస్తాడు. అది ప్రధ్వంసాభావం. అది యెంతో బాధిస్తుంది. దాన్నుంచి బయటపడేసే 'ఓ కొత్త నిర్మాణాన్ని కలగంటూ...' భవిష్యత్తు వైపు దృష్టి సారించడంతో కవిత ముగిస్తాడు. స్థూలంగా యీ కవితలోని కథ యిది. ఘటనల ప్రకంపనల చుట్టూ అల్లిన కథా కవిత యిది. కుటుంబ సంబంధాలు, భౌతిక /వస్తు సంస్కృతి, వుత్పత్తి విధానాలు అన్నీ మాయమై పోయిన జీవన విధ్వంసం, దానిమీద పునర్నిర్మాణం. వునికికీ వినాశానికీ మధ్య యేర్పడే వైరుధ్యాలు, అందుండీ పుట్టిన సంఘర్షణ ... యిదంతా అనేక పాత్రలతో సన్నివేశాలతో పెద్ద కాన్సా మీద కథ నవలగానో రాయదగిన యితివృత్తం. దాన్ని నొకు చిన్న కవితలోకి వొంపడం కవికి పరీక్షే. కవిత్వ నిర్మాణ రహస్యం తెలిసిన మాధవరావులాంటి యే కొందరో దాన్ని నిర్వహించగలరు. యే కవిత ఓపెన్ ఎండింగ్ కథగా మారిన క్రమంలో వొక నిర్దిష్టమైన అంతర్గతమైన సంవిధానం వుంది. సూక్ష్మ ప్రణాళిక వుంది. మంచి అల్లిక వుంది. శైలి వుంది. బిగువైన నిర్మాణం వుంది. ఇల్లు కథ అక్కడ ముగియక పోవడమే అసలు విషాదం, యెక్కడ చూసినా శిధిల జీవన దృశ్యాలే. పచ్చదనం మీద మొలిసే కాంక్రీటు వనాలతో ఊరు రాజధానవడం విషాదానందాల సమ్మిశ్రణం. కానీ ఊరించిన రాజధాని సౌధం హఠాత్తుగా కళ్లముందే కుప్పకూలిపోయిన తర్వాతి ఎపిసోడ్ 'విరిగిన కల'. అన్నీ కలిపి చూస్తే పెద్ద కాన్వాస్ మీద మరింత పెద్ద కథ రూపుకడుతుంది. కరోనాని నెపంగా చేసుకుని రాసిన కాలిక కవితల్లో కూడా యిటువంటి కథా లక్షణాలు గోచరిస్తాయి. తరతరాలుగా మనుషులమధ్య సామాజిక దూరాన్ని పాటించిన జాతుల తరుపున క్షమాపణ అభ్యర్థించే 'అసింటా, బయటి కరోనా పురుగు కంటే చేయడానికి వుపాధి లేక రాబడి లేక పొట్టలోపలి ఆకలి పురుగే నిర్వీర్యం చేస్తుందేమో అని భయపెట్టించే 'లోపలి పురుగు', పెళుసుబారుతున్న స్త్రీ పురుష సంబంధాల పట్ల ఆర్తిని ప్రకటించే 'తానూ నేనూ ' కవితలు చూడండి. కరోనా చుట్టూ నిర్మించిన అనేక కథాంశాలు కనిపిస్తాయి. 'అసింటా 'కవిత కాస్త సిగ్గుపడదాం లాంటి కన్ఫెషన్. అంటరానితనాన్ని కుహనా శాస్త్ర తర్కంతో మరోసారి సమర్థించుకుంటున్న బ్రాహ్మణీయ సంస్కృతిపై అది బలమైన చెంపపెట్టు. అలాగే, 'కలవడం కదా ముఖ్యం నవ్వుకోవడం కదా ముఖ్యం - నలుగురు కలిసి కలిసుండటం కదా జీవితం' అని తీర్మానించిన 'తానూ నేనూ ' కవితలో వర్తమాన జీవిత చిత్రణ ద్వారా గతాన్ని పాఠకుల వూహకు వదిలిన టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ దాన్ని ఓపెన్ స్టోరీగా మలిచింది. నిన్నటి 'అనుపమ'లో యివాళి దృశ్య రహస్యాల వెనుక లో యిటువంటి కవితలు యెక్కువగా కనిపిస్తాయి. వాటిలోని 'కథాకావ్య' లక్షణాల్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయొచ్చు.

ఒక బిగువైన కరచాలనం లేక వొక గాఢ పరిష్వంగం లేక వొక ఆత్మీయ స్పర్శ లేక వొక మరువని కలయిక లేక వొక తీయని పిలుపు లేక నాలుగోడల మధ్య సామూహిక స్పందనా రాహిత్యంతో మగ్గిపోతున్న కరాళ కరోనా కాలంలో మాధవ కవిత్వం నులి వెచ్చగా సున్నితత్వాల్ని తట్టి లేపింది. వొంటరితనాన్ని తరిమి కొట్టింది. భుజం పలకరించింది. మనిషితనం మోసులెత్తేలా చేసింది. పదాల్ని నిజానికి కవిత్వ రహస్యం తెలిసిన మాధవ లాంటి సీనియర్ సంప్రదాయం కూడా అంతగా లేదు. ఎక్కడైనా వొకట్రెండు మాటల్ని కవులకు నాబోటి సంపాదకుల అవసరం లేదు. తెలుగులో అటూ యిటూ సర్దడమో అర్థచ్చాయల్లో విశ్రాంతి తీసుకునే తడిమి లేపడమో తప్ప చేసింది గానీ చేయగలిగింది గానీ లేదు. సత్కవుల స్వేచ్ఛ నిరంకుశమైంది. దాన్ని గౌరవించి వొదిగి వుండటమే తొలి పఠితగా నేను చేసింది. తక్కిందంతా మాధవకు నా మీద వున తొలినాటి చెమట చిత్తడి నేల (1998) నుంచి స్పర్శ (2005) అభిమానమే. అనుపమ (2014), ఊరి కల (2017)ల మీదుగా ఈనాటి దృశ్యరహస్యం వరకూ మాధవ కవిత్వం అంతటినీ వొక చోట అతనొక విరామమెరుగని దీర్ఘ కవితని అల్లుతున్నట్టనిపిస్తుంది. ముగించు లేని యీ కవితకు యాంకరింగ్ పాయింట్ మనిషే. మనిషి చుట్టూ అలుముకొని వున్న సామాజిక సంబంధాలే అతని కావ్య వస్తువు. అయితే మాధవ మనిషి అమూర్త మానవుడు కాదు. నిర్దిష్ట స్థలకాలాల్లో అనుక్షణం వునికి కోసం సంఘరించే మనిషి. రక్తమాంసాలతో నిత్య చలనం లో వున్న మనిషి. సమస్త వుద్వేగాలను గొంతులో నింపుకొని తోటి మనిషితో సంభాషణ కోసం సజీవ సంబంధం కోసం ఆరాటపడే నికార్సైన నిలువెత్తు మనిషి. మనిషి తనను తాను కోల్పోతున్నందుకు దుఃఖం, అందుకు కారణ మౌతున్న వ్యవస్థల పట్ల ఆగ్రహం - రెండూ కలిసిన మానిస్తా 'గీతం' బండ్ల మాధవరావు కవిత. అయితే అతని గొంతులో దూల వ్యక్తమైనంత తీవ్రంగా ఆగ్రహం పలకదు. అతని వ్యక్తిత్వంలోనే! స్వభావం వుంది. మనుషుల్లోనూ కవిత్వంలోనూ 'శబ్ద - అర్థ సందర్భా మధ్య లేచే నిలువెత్తు గోడల్ని బద్దలు కొట్టాలని అతని ప్రయత్నం మనుషుల్ని కలిపి కుట్టే వొజ్జ బంతిలాంటి నిక్కమైన వాక్యాన్ని అక నిర్మిస్తున్నాడు. వెలిసిపోయిన వంకర మాటల్ని, చిలుము పట్టిన, పడిన మకిలి పట్టిన మాటల్ని శుభ్రం చేసి మాటకి ప్రాణం పోస్తేనే ము మనుషులుగా మిగులుతాం అని విశ్వసిస్తున్నాడు. కవి యెప్పుడ పీడితుల పక్షమే అని మాధవ యీ కొత్త సంపుటి ద్వారా మరోహా నిర్ధారిస్తున్నాడు. అనేక ప్రలోభాల మధ్య అణచివేతల మధ్య ద్రో మధ్య యీ నిర్ధారణ యివాల్టి అవసరం.

నిన్నటి తోట ఇవ్వాళ వల్లకాడు ఇప్పుడది వసంతం కోసం నిరీక్షిస్తుంది.

నిన్నటి వూరు ఇవ్వాళ ఎడారి వొక తొలకరి కోసం దాహంతో ఎదురు చూస్తోంది.

పొడారి పెలుసుబారిన గుండె వొక తడి పద్యం కోసం పలవరిస్తోంది.

హైదరాబాద్, జూలై 31, 2021. ఆహ్వానిద్దాం. ఎ.కె.ప్రభాకర్ సంపాదకుడు