బగ్గు లక్ష్మణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బగ్గు లక్ష్మణరావు

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 1999
ముందు ధర్మాన ప్రసాదరావు
తరువాత ధర్మాన ప్రసాదరావు
నియోజకవర్గం నరసన్నపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 14 అక్టోబర్ 1946
అచ్యుతపురం గ్రామం, జలుమూరు మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు బగ్గు అప్పారావు, బగ్గు సరోజనమ్మ
జీవిత భాగస్వామి విజయలక్ష్మి
సంతానం రవీంద్ర, శ్రీనివాసరావు, రజిని

బగ్గు లక్ష్మణరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994 ఎన్నికల్లో నరసన్నపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. బగ్గు లక్ష్మణరావు 1980 నుండి 81 వరకు కోటబొమ్మాళి మండలం సమితి అధ్యక్షుడిగా, శ్రీకాకుళం జిల్లా జెడ్పీ ఛైర్మన్‌గా పని చేశాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

బగ్గు లక్ష్మణరావు 14 అక్టోబర్ 1946లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలం, అచ్యుతపురం గ్రామంలో జన్మించాడు. ఆయన 1968లో శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

బగ్గు లక్ష్మణరావు 1970 ఎన్నికల్లో అచ్యుతపురం గ్రామా సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆయన 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన తరువాత వరుసగా 1999, 2004, 2009 జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (28 April 2014). "నేనొస్తానంటే...మీరొద్దంటారా..!". Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.
  2. Sakshi (21 April 2014). "నరసన్నపేట... నాలుగు స్తంభాలాట". Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.