మిరియపు కుటుంబము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిరియపు కుటుంబము

మిరియపు తీగె మలబారు దేఅమునందెక్కువగా పైరగు చున్నది. ఇది అగంతుక వేరుల మూలమున ప్రాకును.

ఆకులు
ఒంటరి చేరిక తీగెకు రెండు వైపులనే యుండును. హృదయాకారము, కొంచెము వంకరగా నుండును. అయిదారు ఈనెలుండును. కొన వాలము గలదు. రెండు వైపుల నున్నగ నుండును.
పుష్పమంజరి
కంకి, ఏక లింగ పుష్పములు; కొన్ని అడ కంకులో కొన్ని పుష్పములును గల్వు. ఆడు తీగెలు పోతు తీగెలు వేరు వేరుగా కూడా ఉన్నాయి.
పుష్ప కోశము
లేదు
దళ వలయము
లేదు
బొమ్మ
మిరియపు మొక్క:

కంకిపై కొన్ని పొలుసులు వంటి చేటికలు మాత్రమున్నవి. వాని మధ్యనే మిగిలిన పుష్ప భాగములుండును. స్త్రీ పుష్పము వద్దనున్న కమటి చేలన్నియు గలసి గిన్నె వలె ఏర్పడియున్నవి.

మగ కంకి కింజల్కములు
మూడు కాడలు పొట్టిగను లావుగను నున్నవి.
అండ కోశము
కొన్ని టి యందు గొడ్డైయుండి నట్లు కనబడును. మరి కొన్నిటి యందు నదియు లేదు.
ఆడు కంకి కింజల్కములు
కొన్ని పుష్పములందు మాత్రము రెండు కింజల్కములున్నవి. కొన్నిటి యందు పుప్పొడి తిత్తులు లేక గొడ్డులైనవి యున్నవి. కీలము లేదు. కీలాగ్రములు మూడు. కండ కాయ.

ఈ కుటుంబమునందు గుల్మములును గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంటరి చేరికగానైనను, అభిముఖ చేరికగానైనను, కిరణ ప్రసరముగ నైననుండును. కొన్నిటికి గణుపు పుచ్చములు గలవు. సమాంచలము పుష్పములు చిన్నవి. మిధున పుష్పములు ఏక లింగ పుష్పములును గలవు. పుష్ప కోశము గాని దళవలయము గాని లేదు. కింజల్కములు రెండు మొదలు ఆరు వరకు నుండును. మూడు గాన్, అంతకు ఎక్కువగాని స్త్రీ పత్రములుండును. కొన్నిటిలో నవి కలసి యున్నవి. కొన్నిటిలో విడివిడిగానఏ యున్నవి.

మిరియములు మలబారు దేశమునందే ఎక్కువగా పండు చున్నవి. కొమ్మలను నాటియే పైరు చేయుదురు. తీగెలు ప్రాకుటకు గురుకుగానుండు బెరడు గల చెట్లను పాతుట మంచిది. తరుచుగా పనస చెట్లను పాతి వానిపై తీగెలు ప్రాకింతురు. ఈ తీగెలకు నీరు విస్థారమక్కర లేదు. మూడేండ్లకు కాయలు కాయ నారంబించును. ఏడేండ్ల వరకు బాగుగ కాయును. తరువాత క్రమక్రమముగా తగ్గి పోవును. కారంభించును గాన నాదీ గెలను దీసి వేసి క్రొత్త వానిని బ్రాకించెదరు. గెలలోని పై కాయలు రంగు మారుట నారంభింపగనే కాయలను కోసి వేసి ఎండలో బెట్టుదురు. మిరియములలోను రెండు మూడు రకములున్నవి. కొన్ని పెద్దవి. కొన్ని చిన్నవి. కొన్ని ఎక్కువనొక్కులు నొక్కులుగానుండును. కొందరు మెరపకాయలకు బదులుగా మిరియములనే వాడుకొందురు. మిరియములు చాల లనుపానములలో ఉపయోగించు చున్నారు. మిరియపు పొడియు వంటికి మంచిది. చిర కాలమునుండి మన దేశ్మునుండి మిరియములు చాల ఎగుమతి అగు చున్నవి.

తామల పాకు[మార్చు]

తామల పాకులు చిరకాలమునుండి మనదేశములో పలు భాగములందు పైరు చేస్తున్నారు. తమలపాకుల లోను మూడు నాల్గు రకములు న్నవి. ఒడిషా ప్రాంతముల పొగాకుతో వేసికొను తాంబూలములకు ప్రత్యేకముగ నొక విధమగు ఆకు గలదు. అది జీడి గింజ ఆకారముగ నుండును. మిక్కిలి దట్టముగను, ముదురుగు రంగుగను కారముగను నుండును. రెండేండ్ల తీగల ముక్కలను రెండు మూరలో ఎంతో గోసి రెండు మూడు కణుపుల భూమిలో పాతి, మిగిలిన తీగ పై ఈతాకులనైనను దేనినైనను గప్పి నీరు బోయుదురు. ఈ తీగెల నతి శ్రద్ధతో జూచు చుండ వలయును. ఇవి ప్రాకుటకు గొన్ని చోట్ల అవిశ ములగ చెట్లను పెంచెదరు. కొన్ని చోట్ల పోక చెట్టుల మీదనే ప్రాకనిచ్చెదరు. తామలపాకుల రసము ఔషదములలో కూడా వాడుదురు. తామల పాకుల పంట వలన ఎకరమునకు రెండు సంవత్సరములలో రూపాయలు 300 మొదలు 560 వరకు రావచ్చును.

పిప్పిలి[మార్చు]

పిప్పిలి తీగెలు మన దేశములో పలు భాగములందు పెరుగును. వీని ఆకులు పెద్దవ్. పుష్పములలో స్త్రీ, పురుష భేదము గలదు. ఇవి పెరుగుటకు సార వంతమైనవియు, ఎత్తుగా నున్నట్టియు, మెరక నేలలుగావలయును. వీనికి భూమిలో కొంత దూరము ప్రాకి అచ్చట బైకి వచ్చు కొమ్మలు గలవు. వీనిని దీసి పాది పైరు చేయుదురు. వేరులను ఎండబెట్టిన కాయలను ఔషధములలో వాడుదురు. == చలవ మిరియము== చలవ మిరియముల తీగెను మన దేశస్మున కక్య దేశములనుండి తెచ్చిరి. దానినక్కడక్కడ పెంచు చున్నారు. చలవ మిరియములను తాంబూలమునందును ఔషధములందును వాడుదురు.