రామాయణ పరివారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామాయణ పరివారము
రామాయణ పరివారము పుస్తక ముఖచిత్రం
కృతికర్త: బుర్రా వెంకటేశం
సంపాదకులు: బుర్రా వెంకటేశం
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రచురణ: విశ్వసాహితీ ట్రస్ట్
విల్లా నం. 70, విల్లా స్ప్రింగ్స్ (వెస్ట్), కౌకూర్. సికింద్రాబాద్
హైదరాబాద్- 500010
విడుదల: 2021, డిసెంబరు
పేజీలు: 162

రామాయణ పరివారము తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐ.ఎ.ఎస్. అధికారి బుర్రా వెంకటేశం రచించిన పుస్తకం.[1] రామకథా వైశిష్ట్యాన్నీ, పాత్రల ప్రత్యేకతల్నీ రామాయణంలోని 50 ముఖ్యమైన పాత్రల పరిచయంతో పాటు వారి గుణగణాలూ, రామాయణంలో వారి ప్రయాణమూ, వారినుంచి నేర్చుకోవాల్సిన విషయాలు లాంటివన్నీ ఈ పుస్తకంలో సరళమైన భాషలో వివరించాడు.[2]

రామాయణంలో ముఖ్యమైన పాత్రలైన దశరథుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, జటాయువు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, రావణుడు, శబరి, అహల్య, సీత, ఊర్మిళ, మండోదరి, తార, కుబేరుడు, మైరావణుడు, పరశురాముడు తదితర యాభై పాత్రల గురించి ఆ పాత్రనూ పరిచయం చేస్తూ, ఆ పాత్రకు రామాయణంతో గల సంబంధాన్ని స్వభావం, వారి ఆలోచన విధానం, ప్రవర్తన, ఆ పాత్ర నుంచి నేర్చుకోదగ్గ, విస్మరించ వలసిన విషయాలను ప్రత్యేకంగా వివరించాడు.[3]

విషయసూచిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (19 June 2022). "చీకట్లో దీపం రామాయణం". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.
  2. Namasthe Telangana (10 April 2022). "రామాయ‌ణంలోని ఈ పాత్ర‌ల గురించి మీకు తెలుసా !!". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  3. Eenadu (6 March 2022). "సమీక్ష". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.