లింగమనేని రమేశ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లింగమనేని రమేశ్

లింగమనేని రమేశ్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్త. అతను ఎయిర్ కోస్టాకు చైర్మన్‌గా ఉన్నాడు. 1983లో లింగమనేని ఎస్టేట్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. ఈ సంస్ధ ఆంధ్రప్రదేశ్ లోని పలు నగరాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

అతను విజయవాడలో జన్మించాడు. అతను కామర్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు. తన 19వ యేట నుండి తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ కార్యక్రమాలలో పనిచేసాడు. అతను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ-స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కృషి చేసాడు[3].

దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం[మార్చు]

గుంటూరు జిల్లా లోని నంబూరు పంచాయతీ పరిధిలోని లింగమనేని ఎస్టేట్స్‌లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ భూ సమేత దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం అతనిచే నిర్మించబడినది. పద్దెనిమిదేళ్ల క్రితం 2000లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అతను స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తున్నప్పుడు అతని మనస్సులో తట్టిన ఆలోచనా ఫలితం ఈ ఆలయ నిర్మాణం. 2012లో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతి అంతర్భాగంలో, బెజవాడ దుర్గమ్మకు సమీపంలో ఆలయాన్ని నిర్మించారు.[4]

మూలాలు[మార్చు]

  1. "Story of rise and rise of the Lingamaneni group".
  2. "చంద్రబాబు అధికారిక నివాసం: ఎవరీ లింగమనేని?".
  3. "Ramesh Lingamaneni".[permanent dead link]
  4. "18ఏళ్ల కల నేటికి సాకారం - ఆలయ నిర్మాణకర్త లింగమనేని రమేశ్‌".[permanent dead link]

బయటి లంకెలు[మార్చు]