సత్యవంత్ మల్లన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ ఎస్.మల్లన్న 20వ శతాబ్దపు తొలి దశకాల్లో హైదరాబాదుకు చెందిన ప్రసిద్ధ వైద్యుడు. ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ వ్యక్తిగత వైద్యుడు. మల్లన్న పేద కుటుంబంలో నుండి వచ్చి ప్రపంచ ప్రసిద్ధ పాథాలజిస్ట్ స్థాయికి ఎదిగాడు.[1]

మల్లన్న ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, ఇండోరు సమీపంలోని మౌలో జన్మించాడు. ఎఫ్.ఏ పరీక్షలో ఉత్తీర్ణుడైన తర్వాత వైద్య కళాశాలలో చేరాడు. ఈయన షోలాపూరుకు చెందిన ప్రముఖ వైద్యుని కూతురు అహల్యా కల్వాకర్ ను పెళ్ళిచేసుకున్నాడు.[2] వీరి సంతానమే భావి భారత సైనికదళాధిపతి సత్యవంత్ మల్లన్న శ్రీనగేష్. 1895 హైదరాబాదు క్లోరోఫార్ం కమీషను కాలంలో హైదరాబాదు వైద్య కళాశాల ప్రిన్సిపాలు ఎడ్వర్డ్ లారీతో పాటు ఇంగ్లాడుకు వెళ్ళాడు.[3] 1894లో లారీతో పాటు ఇంగ్లాండు వెళ్ళిన విద్యార్ధులలో, ముత్యాల గోవిందరాజులు నాయుడు, మహమ్మద్ అబ్దుల్ ఘనీ కూడా ఉన్నారు.[4] ఆ తర్వాత మల్లన్న నిజాం ప్రభుత్వ స్కాలర్‌షిఫ్ పొంది, ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో వైద్య విద్య అభ్యసించాడు. ఈయన జర్మనీకి వెళ్ళి రాబర్ట్ కాక్ వద్ద బాక్టీరియాలజీలో శిక్షణ పొంది, సూక్ష్మజీవశాస్త్రంలోని నూతన విజ్ఞానాన్ని హైదరాబాదుకు తెచ్చాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Pingali, Jaganmohan Reddy (2000). Down memory lane: the revolutions I lived through. Booklinks. pp. 36–37. Retrieved 22 November 2017.
  2. S. A., Husain (1985). "PHYSICIANS OF HYDERABAD DURING NIZAM IV, V & VI" (PDF). Bulletin of Indian Institute of History of Medicine (XV): 67–68. Retrieved 22 November 2017.
  3. K. S. S., Seshan. "Mahboob Ali Pasha: Legend with a lavish lifestyle". The Hindu. No. February 02, 2017. Retrieved 22 November 2017.
  4. K., Chandraiah (1998). Hyderabad, 400 Glorious Years. Hyderabad: K. Chandraiah Memorial Trust. p. 221. Retrieved 22 November 2017.