అంబటి లక్ష్మి నరసింహరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంబటి లక్ష్మి నరసింహారాజు తెలుగు కవి, రచయిత.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అంబటి లక్ష్మీనరసింహరాజు వరంగల్ జిల్లా ములుగు తాలూకా ఆత్మకూరు గ్రామంలో 1892లో జన్మించాడు. తండ్రి సుందరరాజు. అతను ఎన్నో నాటకాలు కావ్యాలు శతకాలు రచించాడు. అతని రచనలపై వసుచరిత్ర రచించిన రామరామభుషణుని(భట్టుమూర్తి) ప్రభావం చాలా ఉంది.

కర్ణుడు అధినాయకుడిగా చేసి ' కర్ణాభ్యుదయము ' కావ్యం రచించాడు.లాగి సెట్టి పేటవాసులు పూస్కూరు రంగారావు ప్రోత్సాహం మీద అర్జునుని అధి నాయకునిగా ' విజయ విజయం ' కావ్యాన్ని రచించాడు.చాలా శతకాలు అలభ్యాలు.

ప్రబంధాలు[మార్చు]

  1. ప్రచ్ఛన్న పాండవము
  2. ప్రహ్లాద చరిత్ర
  3. ప్రభావతి ప్రద్యుమ్నo.
  4. యదువీర విజయం
  5. హానుమద్విజయం
  6. విజయ విజయం
  7. కర్ణాభ్యుదయం

నిర్వచన మహాకావ్యాలు:[మార్చు]

  1. సుమతి
  2. శశిరేఖ
  3. ద్రౌపతి
  4. రుక్మాంగద
  5. పార్వతి పరిణయం.

నవలలు[మార్చు]

  • శాంతాబాయి[2]

శతకాలు:[మార్చు]

  1. శ్రీ వెంకటేశ్వర శతకం
  2. యాదగిరి నృకేసరి శతకం
  3. నిరోష్ట్య శతకం
  4. సాంబమూర్తి

మూలాలు[మార్చు]

  1. తెలుగు సాహితీ కిన్నెర, తెలుగు (2018). డిగ్రీ ద్వితీయ సంవత్సరం తెలుగు పుస్తకం. హిమాయత్ నగర్: తెలుగు అకాడమీ. pp. Page. ISBN 8181803329.
  2. telugu, NT News (2022-02-06). "నవలా ప్రభంజనం.. తెలంగాణ సాహిత్య ప్రస్థానం". www.ntnews.com. Retrieved 2023-09-12.