ఆపరేషన్ అశ్వమేధ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 427
ఇండియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737
హైజాకింగ్ సారాంశం
తేదీఏప్రిల్ 24 – 25, 1993
సారాంశంవిమాన హైజాకింగ్
ప్రదేశంఢిల్లీ, శ్రీనగర్ మధ్య హైజాక్ చేయబడినది
ప్రయాణీకులు141
సిబ్బంది6
గాయాలు (ప్రాణాపాయం)0
మరణాలు1 హైజాకర్
విమానం రకంబోయింగ్ 737
ఆపరేటర్ఇండియన్ ఎయిర్ లైన్స్
విమాన మూలంఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
డిల్లీ, భారతదేశం
గమ్యంఅమృత్‌సర్, భారతదేశం

ఆపరేషన్‌ అశ్వమేధ్‌ అనునది ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ఇస్లామిక్‌ ఉగ్రవాదులు హైజాక్‌ చేసినప్పుడు రేస్క్యూ ఆపరేషన్‌. ఏప్రిల్ 24, 1993 ఏప్రిల్ 25 న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐ.సి.427 విమానాన్ని భారతదేశంలో హైజాక్ చేసారు. ఈ హైజాకింగ్ జరిగినపుడు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ లో నేషనల్ సెక్యూరిటీ గార్డులకు చెందిన కమాండోలు అందులో గల 141 మంది బందీలను అమృత్ సర్ విమానాశ్రయంలో రక్షించారు. ఈ హైజాక్ కు కారణమైన మొహమ్మద్ యూసుఫ్ షా అనే హైజాకర్ కమాండోలు విమానంలోకి ప్రవేశించి బందీలకు ఏ హాని చేయకముందే ఐదు నిమిషాల లోపునే చంపబడ్డాడు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ను "ఆపరేషన్ అశ్వమేథ్" గా నామకరణం చేసారు.

హైజాకింగ్[మార్చు]

ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐ.సి 427 ఢిల్లీ నుండి 13:57 గంటలకు శ్రీనగర్ వెళ్ళుటకు బయలుదేరినది. విమానంలో 141 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. వారిలో 126 మంది పెద్దలు, 9 మంది పిల్లలు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం గగన తలంలోనికి ప్రవేశించిన తరువాత ఒక ప్రయాణీకుడు తన పేరును సయ్యద్ సలాలుద్దీన్ గా చెప్పుకొని తన వద్ద పిస్టల్స్, హాండ్ గ్రానైడ్స్ ఉన్నవనీ, విమానాన్ని కాబూల్ వైపుకు దారిమళ్ళించాలనీ చెప్పాడు. 14:43 గంటలకు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు విమానం హైజాక్ చేయబడి ఆఫ్ఘనిస్థాన్ లోని కాబూల్ కు దారి మళ్ళిస్తున్నట్లు సమాచారం అందినది.[1]

లాహోర్ కు చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానాన్ని పాకిస్తాన్ గగన తలంలో ప్రవేశించడాన్ని నిరాకరించింది. అపుడు విమానం తిరిగి భారతదేశానికి వచ్చింది.[2] చివరికి విమానం భారతదేశంలోని అమృత్‌సర్ లో 15:20 గంటలకు ల్యాండ్ అయినది. హైజాకర్ విమానాన్ని ఇంధనంతో నింపాలని కాబూల్ కు వెళ్ళాలనీ డిమాండ్ చేసాడు. భారతదేశ క్యాబినెట్ సెక్రటేరియట్ కు సంబధించిన విపత్తు నిర్వహణా గ్రూపు (సి.ఎం.జి), ఢిల్లీ విమానాశ్రయానికి చెందిన కేంద్ర కమిటీ ఈ సంఘటనకు స్పందించింది. అమృత్‌సర్ జిల్లా కు చెందిన డిప్యూటీ కమీషనర్, పోలీసు సూపరింటెండెంట్ లు హైజాకర్ తో చర్చలు జరిపారు. 18:00 గంటలకు అమృత్‌సర్ కు పంజాబ్ పోలీసు డైరక్టరు జనరల్ వచ్చారు. ఆయన హైజాకర్ తో చర్చలు జరిపారు. హైజాకర్ మొండిగా తన డిమాండుపై పట్టు పట్టి విమానం లో వార్నింగ్ కొరకు కాల్పులు జరిపాడు.[1]

ఎన్.ఎస్.జి ఆపరేషన్[మార్చు]

హైజాకర్ విమానంలో కాల్పులు జరిపిన తరువాత, సి.ఎం.జి స్పందించి అదాంపూర్ మీదుగా అమృత్‌సర్ కు ఒక ఎన్.ఎస్.జి కమాండో దళాన్ని పంపింది. అదేవిధంగా చర్చించేవారికి తన చర్చలు కొనసాగించవలసినదిగా సలహా యిచ్చారు. 23:00 లకు హైజాకర్ తన డిమాండ్లను పరిష్కరించకపోతే తాను విమానాన్ని పేల్చివేస్తానని ప్రకటించాడు. సి ఎం జి విమానంలోకి ప్రవేశించుటకు ఎన్.ఎస్.జి కమాండోలకు, చర్చించేవారికి సూచనలిచ్చింది.[1] తరువాత రెండు గంటలలో ఆ బృందం గ్రౌండ్ పరిస్థితిని అంచనా వేసి ఆపరేషన్ కు పథకం వేసింది. ఏప్రిల్ 25 01:00 లకు 60 మంది ఎన్.ఎస్.జి కమాండోలు 52 ప్రత్యేక ఏక్షన్ బృందం విమానంలోనికి వెళ్ళుటకు సిద్దమయ్యారు. హైజాకర్ ఈ ఆకశ్మికంగా కమాండో బృందాలు లోపలికి రావడంతో ఆశ్చర్యపడ్డాడు. హైజాకర్ స్పందించి విమానంపై కాల్పులు జరిపు నష్ఠం కలిగించే లోపుగా సైలన్స్ పిస్టల్ తో ఒక కమాడో హైజాకర్పై కాల్పులు జరిపాడు. ఈ ఆపరేషన్ ఐదు నిమిషాలలో ముగిసింది. ఈ ఆపరేషన్ లో ఎటువంటి గాయాలు పడినవారు గానీ, ఇతర నష్ఠం కలిగిన బందీలు కానీ లేరు.[1][3][4]

తరువాత పరిణామాలు[మార్చు]

ఆ తరువాత ఆ హైజాకర్ జలాలుద్దీన్ అలియాస్ మొహమ్మద్ యూనస్ షా గా గుర్తింపబడ్డాడు.[3] మృతదేహం స్థానిక పోలీసులకు అందజేసారు. పిస్టల్ చే కాల్చబడినందున ఆయనకు హాస్పటల్ కు తరలించారు. ఆయన నుండి పూర్తిగా లోడ్ చేయబడిన 9 mm పిస్టల్స్ రెండింటిని స్వాధీనం చేసుకున్నారు.[1] భారత అధికారులు ఆ హైజాకర్ హిజ్బుల్ మొజాహిద్దీన్ కు చెందిన సభ్యుడని ప్రకటించాయి. కాని ఆ సంస్థ బాధ్యత వహించుటకు నిరాకరించింది.[2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Hijacking of Indian Airlines Flight IC427 on 24th April 1993". Parliament of India. 1993-04-26. Archived from the original on 2018-01-20. Retrieved 2016-05-05.
  2. 2.0 2.1 "Indian Commandos Kill Gunman to Thwart Hijacking". Los Angeles Times. 1993-04-25.
  3. 3.0 3.1 Limca Book of Records. Bisleri. 1999.
  4. "National Security Guard". Indian Defence Review. Lancer. 8 (3): 61. 1993.

ఇతర లింకులు[మార్చు]