ఓం నమో శివరుద్రాయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఓం నమో శివరుద్రాయ 2010 సంవత్సరంలో విడుదలైన ఖలేజా చిత్రంలోని భక్తి గీతం. దీనిని రామజోగయ్య శాస్త్రి రచన చేశారు. వినాయగం రమేశ్, కారుణ్య గానం చేయగా మణిశర్మ సంగీతాన్ని అందించారు.

నేపథ్యం[మార్చు]

అదొక గిరిజన గూడెం. అక్కడి ప్రజలకి చాలా కష్టాలు కలుగుతుంటాయి. వాటిని తీర్చడానికి దేవుడొస్తాడని వారి విశ్వాసం. అక్కడికి మహేశ్ బాబు వస్తాడు. వాళ్లకి ఆయనే దేవుడు. ఆయనే శివుడు. వాళ్ల కష్టాల్ని తీర్చడానికి దేవుడొచ్చాడనే నమ్మకాన్ని ఒక భక్తుడు (షఫీ) పాటగా పాడుతాడు.

పాట[మార్చు]

ఉపోద్ఘాతం :

ఓం నమో శివరుద్రాయ ఓం నమో శితికంఠాయ

ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమఢమ ఢమరుక నాదానందాయ

ఓం నమో నిఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయ

ఓం నమో హిమశైలా వరణాయ ప్రమధాయ ధిమిధిమి తాండవకేళీ లోలాయ

పల్లవి :

సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ

నీ పాదముద్రలు మోసీ పొంగిపోయ్నాది పల్లెకాశీ

చరణం 1 :

ఏయ్... సూపులసుక్కానీ దారిగా చుక్కలతివాసీ మీదిగా

సూడసక్కని సామి దిగినాడురా ఏసెయ్ రా ఊరువాడా దండోరా

ఏ రంగులహంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా

నిప్పు గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా

పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీలా

లోకాలనేలేటోడు నీకు సాయం రాకపోడూ

ఏయ్ నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడూ

వివరణ[మార్చు]

"శివ" అనే శబ్దమే ఒక నాదం. ఎన్నో రకాలుగా వర్ణించడానికి ఆస్కారం ఉన్న అంశం శివతత్వం. దీనిని పల్లెవాసుల స్వచ్ఛతను కలిపి సామాన్యమైన భాషలోని రచన "సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ" అని మొదలౌతుంది.

చివరికి వెళ్లేసరికి "లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడూ" అని చెబుతూ సామీ అంటే హామీ తానై ఉంటాడ"ని ధైర్యం చెబుతుంది. చెప్పకనే పైపైకలా బైరాగిలో ఉంటాడని, మంచును మంటను ఒక్క తీరుగా లెక్కసేయని ఎన్నో శివుని లీలల్ని చెబుతాడు.

"నిప్పు గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా".... గరళాన్ని గొంతులో నిలిపినందుకు సాక్ష్యంగా మచ్చ ఏర్పడిందట... నీలకంఠుడు... గరళకంఠుడు... అద్భుతమైన ప్రయోగం... గిరి...