కస్తూరి రంగకవి
కస్తూరి రంగకవి తెలుగు కవి. అతను 1750లలో నివసించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]రంగకవి నియోగి బ్రాహ్మణుడు. వేంకటకృష్ణయామాత్య, కామాక్షమ్మల కుమారుడు. అతను పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో నివసించాడు. అతను ఛందశ్శాస్త్రం, పదజాలంపై ప్రధానంగా రచనలు చేసాడు. అతను బాగా సుపరితమైన తెలుగు నిఘటువు అయిన "సాంబనిఘంటువు"ను రాసాడు. ఇది స్వచ్ఛమైన తెలుగు పదాల నిఘంటువు. ఆ రోజుల్లో ఉన్న పద్ధతిలో ఇది పద్య రూపంలో కూర్చబడింది. శాస్త్రీయ తెలుగు కాలం నుండి వచ్చిన ప్రామాణిక రచనలలో ఇది ఒకటి. 1920లలో వావిళ్ళ ముద్రణాలయంలో పైడిపాడి లక్ష్మణ మంత్రి రాసిన ఆంధ్రనామ సంగ్రహము, ఆడిదము సూరకవి రాసిన ఆంధ్ర టీకా విశేషము లతో కలిపి రంగకవి రాసిన సాంబనిఘంటువులను కలిపి ఒక పుస్తకంగా ప్రచురించారు.
అతను తెలుగు ఛందశ్శాస్త్రం పై ఆనందరంగరాట్ఛందము (లక్షణ చూడమణి) అనే పేరుతో ఒక ప్రామాణిక రచన చేశాడు. ఈ పుస్తకం యొక్క పేరు దాని కృతి భర్త (అంకితం చేయబడిన వాడు) ఆనంద రంగ పిళ్ళై నుండి వచ్చింది. ఆనంద రంగ పిళ్లై వ్యాఖ్యాత, బహుశా భారతదేశంలోని ఫ్రెంచ్ గవర్నర్ కోసం మున్షి. కాస్తురి రంగ కవి యొక్క ఇతర రచనలలో కృష్ణార్జున సంవాదము, పద్మనాయక చరిత్రము వంటి కావ్యాలున్నాయి.[1]
రచయిత రచనలు
[మార్చు]- రంగకవి లక్షణ చూడామణి (ఆనందరంగరాట్ఛందము) అనే ఛందో గ్రంథమును రచించి ఆనందరంగపిళ్ళెకు అంకితమిచ్చాడు.
- సాంబ అనే మకుటముతో సీస శతక రూపముగా సాంబనిఘంటువును రచించాడు.
- కృష్ణార్జున చరిత్రము, పద్మనాయక చరిత్రము ఇతని ఇతర గ్రంథములు.[2]
ఇతర విశేషాలు
[మార్చు]ఆలూరి కుప్పన కవికి ఇతడు గురువు.సా.శ.. 1750 ప్రాంతములో ఫ్రెంచి గవర్నరు డూప్లే ప్రభువుకు దుబాసిగా ఉన్న ఆనందరంగ పిళ్ళె ఆస్థాన కవిగా కూడా ఇతడు పనిచేసాడు.
మూలాలు
[మార్చు]- ↑ "kastUri ranga kavi". engr.mun.ca. Archived from the original on 2017-09-24.
- ↑ Narasiṃhārāvu, Vi Vi Yal (1993). Chilakamarti Lakshmi Narasimham (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 978-81-7201-499-5.