కొల్లిడం నది
కొల్లిడం (బ్రిటిషు వారు కొలెరూన్ అనేవారు) తమిళనాడు లోని నది. తంజావూరు డెల్టా గుండా ప్రవహించే కావేరీ నదికి ఉత్తరాన ఉన్న పాయ, కొల్లిడం. ఇది శ్రీరంగం ద్వీపం వద్ద కావేరీ నది ప్రధాన శాఖ నుండి విడిపోయి తూర్పు వైపు బంగాళాఖాతంలోకి ప్రవహిస్తుంది. కొల్లిడం నది ద్వీపమైన దిగువ ఆనకట్ట వద్ద కొల్లిడంలోని పంపిణీ వ్యవస్థ ఉంది.
2005 లో వచ్చిన భారీ వరదల కారణంగా కొల్లిడం నది వెంబడి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు (పిడబ్ల్యుడి) వారు వరద నివారణ పనులు చేసారు.[1]
ఉద్భవం, ప్రవాహం
[మార్చు]కొల్లిడం నది తిరుచ్చి జిల్లా సమీపంలోని ముక్కొంబు (Upper Anaicut) వద్ద కావేరీ నది నుండి విడిపోతుంది. అక్కడి నుండి ఇది తూర్పు దిశగా ప్రవహించి, తంజావూరు మరియు కడలూరు జిల్లాల గుండా ప్రవహించి, చివరికి చిదంబరంను సమీపించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది పొడవు సుమారు 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
ప్రాముఖ్యత
[మార్చు]కొల్లిడం నది తమిళనాడు రాష్ట్రంలో వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ నది నీటితో పుష్కలంగా ఉన్న డెల్టా ప్రాంతం రైతులకు వరి, చెరకు, అరటి వంటి పంటలను పండించడానికి సహకరిస్తుంది. అలాగే ఇది పలు పట్టణాలకు తాగునీరు మరియు పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Flood prevention works along Kollidam to be over by March end". Retrieved 24 February 2012.