శరత్ పూర్ణిమ

వికీపీడియా నుండి
(కోజగారి పూర్ణిమ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.
శరత్ పూర్ణిమ

శరత్ పూర్ణిమ (కోజాగరాత్రి పూర్ణిమ), శరదృతువులో ఆశ్వీయుజ మాసం పౌర్ణమి నాడు ఈ పండుగగా జరుపుకుంటారు. ఈ పండగని శరత్-పూర్ణిమ, కొజాగరాత్రిపూర్ణిమ, కాముడిపున్నమి అని కూడా అంటారు. ఈరోజు రాత్రి లక్షీదేవి ఆకాశమార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసముండి తనని పూజిస్తారో వారికి అష్టఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. హిందువులు ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలవారు ఈపండుగ జరుపుకుంటారు. ఈ రోజు దేవాలయాలలో,, ఇంటిలో కూడా రాత్రి వేళ పాలల్లో చంద్రుడుని చూసి తరువాత ఆ పాలను ప్రసాదంగా స్వీకరిస్తారు.

వ్రతం చేయువిధానం[మార్చు]

ఉదయాన్నే లేచి శుచి శుభ్రంగా స్నానం చేసి ఇంట్లో తూర్పుదిక్కున లక్ష్మీదేవి పూజా మంటపం ఏర్పాటు చేయాలి.లక్ష్మి ప్రతిమను కాని, ఫొటోనికాని ఉంచి విఘ్నేశ్వర పూజచేసి లక్ష్మీదేవిని ఆస్వాదించాలి.ధూప, దీప నైవేద్యాలు పెట్టి భక్తిశ్రద్ధలతో లక్ష్మి అష్ట్రోత్రాలు, శ్లోకాలు చదివి పూజచేయాలి.రోజంతా ఉపవాసముండాలి.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]